26, డిసెంబర్ 2013, గురువారం

ఒకే ఒక్కడు..కేసీఆర్

మొదట వారు ఆయన ఉనికిని నిరాకరించారు. ఆ తర్వాత ఆయనను ఎగతాళి చేశారు. ఆయన వేషభాషలను గేలి చేశారు. వ్యక్తిత్వంపై దాడి చేశారు. ఆరోపణల వర్షం కురిపించారు. ఆయనను రాజకీయంగా అంతంమొందించడానికి యుద్ధం చేశారు. ఎన్ని కుట్రలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు, ఎన్ని ఉద్విగ్న క్షణాలు… అయినా ఆయన ప్రజాస్వామిక పంథాను వీడలేదు. ఒక లక్ష్యంకోసం ఇన్ని అవమానాలను, ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న నేత సమకాలీన చరిత్రలో మరొకరు లేరు. వందలాది మంది పిల్లలు మృత్యుపాశాన్ని కౌగిలించుకుంటుంటే ఆయన దుఃఖంతో చలించిపోయారే తప్ప హింసామార్గం ఎంచుకోలేదు. పోలీసులు తన కాళ్లూ చేతులూ పట్టుకుని బస్తాలా విసిరేసినప్పుడూ, మృత్యువు చివరి మెట్టుపై నిలబడినప్పుడూ కూడా సంయమనం కోల్పోలేదు. రాజకీయ సమీకరణే ఎప్పటికయినా తెలంగాణా సాధిస్తుందని ఆయన నమ్మాడు. ఉద్యమాలకు బెదరనివాడు అధికారం పోతుందంటే భయపడతాడని ఆయన బలంగా విశ్వసించాడు. చాలాసార్లు ఇటు తెలంగాణవాదులూ, అటు తెలంగాణ ద్రోహులూ ఇద్దరూ ఒకే గొంతుకతో ఆయనపై విరుచుకుపడ్డారు. కిందపడిన ప్రతిసారీ వెయ్యి ఏనుగల బలంతో లేచాడు. జారిపోతున్న శక్తులను కూడదీసుకుని మళ్లీ మళ్లీ పోరాడాడు. అందరినీ తెలంగాణ చక్రబంధంలోకి తీసుకొచ్చి నిలిపాడు. చివరకు ఆయనే గెలిచాడు. ఆ ఒక్కడు కేసీఆర్! పన్నెండేళ్ల క్రితం ఆయన ఒక సాధారణ నాయకుడు. మెదక్ జిల్లా తప్ప బయట పెద్దగా సంబంధాలు లేని నాయకుడు. వెనుక బలమైన సామాజిక వర్గంలేదు. తరగని ఆస్తులు లేవు. గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయేంత బక్కపల్చటి మనిషి. మరోవైపు చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, డి.శ్రీనివాస్, జానారెడ్డి, దేవేందర్‌గౌడ్ వంటి బడాబడా నేతలు రాజకీయాలను ఏలుతున్నకాలం. అన్నింటా పాతుకుపోయిన బలమైన సీమాంధ్ర పారిశ్రామిక వర్గం. పగబట్టిన చానెళ్లు, పత్రికలు. బుసలు కొట్టే సామాజిక వర్గాలు. అందుకే తెలంగాణ సాధన ‘చెన్నారెడ్డి వల్లనే కాలేదు, ఈయన వల్ల ఏమవుతుంది?’ అందరూ తీసిపారేసిన రోజులవి. నిజమే చెన్నారెడ్డి, జానారెడ్డి, ఇంద్రారెడ్డి, నరేంద్ర…ఇలా చాలా మంది తెలంగాణ పతాకాన్ని అర్ధంతరంగా వదిలేసి పోయారు. ఇన్ని భుజంగాలను దాటుకుని, ఏరులాగా మొదలైన ఉద్యమాన్ని నదిలాగా మార్చి తీర్చి, తెలంగాణ పతాకాన్ని ఢిల్లీ పురవీధుల్లో ఊరేగించిన ఘనత కేసీఆర్‌ది. భావజాల వ్యాప్తి, ఉద్యమవ్యాప్తి, రాజకీయ అస్తిత్వ కాంక్షలను కలబోసి, కలనేసి ఒక దివ్యాస్త్రంగా మలిచిన నాయకుడు కేసీఆర్. సీమాంధ్ర ఆధిపత్య శక్తులు ఐదున్నర దశాబ్దాలుగా తెలంగాణపై రుద్దిన అనేక మిథ్యలను బద్దలు కొట్టి, ప్రత్యామ్నాయ సాంస్కృతిక చిహ్నంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించి అందరినోళ్లూ మూయించారాయన. తెలంగాణవాద శక్తులన్నీ సంఘటితమై కాంగ్రెస్, టీడీపీ, తదితర రాజకీయ పక్షాల పునాదులను బద్దలు కొట్టకపోయి ఉంటే ఇవ్వాళ తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. సాయుధ పోరాటాలకు గద్దె దిగనివాడు ఓటు ఆయుధంతో గద్దె దిగుతాడన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలంగా నమ్మినవారు కేసీఆర్. సరిగ్గా ఈ సూత్రం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయ గరిమనాభిపై నిలబడి అన్ని రాజకీయ పక్షాలనూ తెలంగాణ నినాదానికి ఒప్పించారు. రాజకీయ విస్తృతాంగీకారాన్ని సాధించారు. తెలంగాణ సమాజంలో మునుపెన్నడూ లేని ప్రత్యేక రాష్ట్ర చైతన్యాన్ని నాటగలిగారు. స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే ఏమవుతుందో, సీమాంధ్ర నేతల నాయకత్వంలోని పార్టీలు ఎప్పుడు ఎలా ఎందుకు వ్యవహరిస్తాయో ప్రజలకు అర్థమయ్యేలా చాటిచెప్పగలిగారు. తెలంగాణ ఎవరు ఇచ్చినా ఎవరు తెచ్చినా ఇవ్వడానికి, తేవడానికి భూమికను రూపుదిద్దినవారు కేసీఆర్. తెలంగాణలో అన్ని పార్టీలూ, నాయకుల రాజకీయ భవిష్యత్తును తెలంగాణ రాష్ట్ర డిమాండుతో ముడివేసి, ఎవరూ ఇటూ అటూ కదలలేని స్థితిని తీసుకువచ్చారు. రాజకీయాలు, ఉద్యమాల మధ్య తులాదండం ఏదో ఒకవైపు జారిపోకుండా చెయ్యిపట్టుకుని నడిపించారాయన. వేయిపడగల శత్రు సర్పానికి చిక్కకుండా ప్రత్యేక రాష్ట్ర డిమాండును ఆశయాల తీరానికి చేర్చారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను చెప్పడమంటే ఇతరుల పాత్రను గుర్తించకపోవడం కాదు. మహాభారత యుద్ధం అర్జునుడొక్కడే గెలవలేదు. శ్రీకృష్ణుడు, భీముడు, అభిమన్యుడు, ద్రుష్టద్యుమ్నుడు…వీరంతా లేరా? యుధిష్ఠిర, నకుల, సహదేవులు లేరా? అందరూ పోరాడినవారే. కానీ అర్జునుడే ప్రధాన పాత్రధారి, శ్రీకృష్ణుడు సూత్రధారి. యుద్ధాన్ని అనేక మలుపులు తిప్పి, విజయానికి బాటలు వేసింది వారే. తెలంగాణ సాధన పోరాటంలో వీరంతా ఉన్నారు. కానీ ఎక్కడ మొదలయ్యామో, ఏయే మలుపులు తిరిగామో గుర్తుచేసుకోకపోతే అది చరిత్రకాదు. తెలంగాణ రాజకీయ, విద్యార్థి, ఉద్యోగ, కుల సంఘాల జేయేసీలు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయమైనది. కొన్ని కారక శక్తులు, కొన్ని ప్రేరక శక్తులు. కొన్ని చోదక శక్తులు, మరికొన్ని సాధక శక్తులు- ఈ విజయం అందరిదీ.

Naresh Gadagani కథనం ఇది..

www.facebook.com/thovva

21, డిసెంబర్ 2013, శనివారం

కేసీఆర్ పార్టీని ఎందుకు విలీనం చేయడం లేదు ?

సమైక్యాంధ్ర అనకుండా తెలంగాణను అడ్డుకునేందుకు అన్ని రకాల విఫలయత్నాలు చేస్తున్న టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు ఇప్పటి దాకా ఆ ఒక్క సమైక్యాంధ్ర అనే పదం ఎందుకు అనలేదు ? అంటే దాని వెనక పెద్ద లాజిక్కే ఉంది. కేసీఆర్ తీసుకునే నిర్ణయం మీద తన రాజకీయ పునాదులు నిలబెట్టుకునేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నాడు.

తెలంగాణ ఇస్తే బొంతపురుగును ముద్దాడుతాం..టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తాం అని కేసీఆర్ ఇది వరకే ప్రకటించాడు. అయితే కాంగ్రెస్ మీద అనుమానంతో ఆ విషయంలో కేసీఆర్ ఇప్పుడు తొందరపడడం లేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత మోత్కుపల్లి చేత కేసీఆర్ టీఆర్ఎస్ ను విలీనం చేయనందుకే తెలంగాణ ఆగిందని కొత్త రాగం అందుకున్నాడు. శాసనసభలో సీమాంధ్ర టీడీపీ నేతల చేత చర్చకు అడ్డుపడకుండా చేయించలేని తెలంగాణ టీడీపీ దద్దమ్మలు..కేసీఆర్ ను కాంగ్రెస్ లో పార్టీ విలీనం చేయాలని చచ్చు ..ఉచిత సలహాలు ఇచ్చారు. ఇదంతా బాబు సూచనల మేరకే అన్నది అందరికీ తెలిసిందే అనుకోండి.

అయితే అసలు బాబుకెందుకు కేసీఆర్ చింత అని అంటే..కేసీఆర్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే తెలంగాణలో బీజేపీతో పాటు మిగిలే పార్టీ టీడీపీ. ఈ పార్టీకి ఖమ్మంలో కొంచెం పట్టుంది. హైదరాబాద్ లో మహా అయితే ఈ సారి కొన్నిఓట్లు సాధిస్తుంది. మిగిలిన జిల్లాలలో మొండిచేయే మిగిలింది. అయితే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ప్రజలు చూడదలుచుకుంటే బీజేపీ - టీడీపీలు మిగులుతాయి. అందుకే బీజేపీతొ పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేయాలని బాబు ఆశ. టీఆర్ఎస్ అడ్డు తొలిగితే ఇప్పటికి కాకపోయినా భవిష్యత్ లో అయినా జనాలు అన్నీ మరిచిపోయి ఓటేస్తారని బాబు ఆశతో ఉన్నారు.

ఈ వ్యవహారం గమనించే తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ పాత్ర ఎంతో మిగిలి ఉందని, ఇప్పటికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఏ మాత్రం పార్టీని విలీనం చేస్తే మూడేళ్లు తిరిగే సరికి కాంగ్రెస్ - టీడీపీ రెండూ కలిసి తెలంగాణను నాశనం చేస్తాయని అనుమానంగా ఉన్నాడు కేసీఆర్. పదేళ్లు తిరగకముందే తెలంగాణ విభజనతో ప్రయోజనం లేదని సీమాంధ్ర మీడియాతో కొత్త నాటకం ఆడించి తిరిగి విలీనం చేసినా ఆశ్చర్యం లేదు. కేసీఆర్ తన స్వప్రయోజనాల కొరకు తెలంగాణ డిమాండ్ తెచ్చాడని తప్పుడు ప్రచారం చేసేందుకు సీమాంధ్ర మీడియా మాఫియా ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది.

 అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు - నిధులు - ఉద్యోగాలు వంటి విషయంలో కీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. నవ తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాల కొరకు టీఆర్ఎస్ పాత్ర లేకుంటే తెలంగాణ వచ్చినా కూడా ఉపయోగం ఉండదన్న అభిప్రాయంతోనే ఆయన విలీనం ఊసెత్తడం లేదు. అందుకే అవకాశవాద టీడీపీని బొందపెట్టి నవ తెలంగాణలో టీఆర్ఎస్ వెంట నడుద్దాం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుందాం.

జై తెలంగాణ ..జైజై తెలంగాణ

please like & share
www.facebook.com/thovva

14, డిసెంబర్ 2013, శనివారం

ఎందుకు రా కలిసుండాలె ..?

ఎందుకు రా కలిసుండాలె ..?

అన్యాయం జరుగుతుందని .. 60 ఏండ్ల సంది మొత్తుకుంటుంటె
ఒక్క నాయకుడన్న అయ్యో పాపం అన్నోడున్నడ ..అవహేళన చేసెటోడు తప్ప
మేమూ తోటి తెలుగోళ్లమే గదరా..మరి మమ్మల్నెందుకు తెలంగాణోళ్లను జేసిండ్రు


ఎందుకు రా కలిసుండాలె ...?

నీళ్లు లేక పొలాల బీళ్లు వెట్టి బతుకుదెరువుకు దేశంబొయ్యి బతుకుతుంటె
గంజి నీళ్లకు గతిలేక ఆకలి చావులతో అల్లాడుతుంటే ..ఒక్కడన్న ఓదార్చిండా ..సేదదీర్చిండా
మేమూ తోటి తెలుగోళ్లమే గదరా..మరి మమ్మల్నెందుకు తెలంగాణోళ్లను జేసిండ్రు

ఎందుకు రా కలిసుండాలె...?

12 ఏండ్ల సంది కేసీఆర్ తెలంగాణ కొరకు ఉద్యమిస్తుంటె
పదవి కోసమని పరాచికాలాడిండ్రు..తాగుబోతని తప్పుడు ప్రచారం జేసిండ్రు
దోచుకుంటున్నడని దొంగ ఆరోపణలు చేసిండ్రు ..కుటుంబం కొరకని కుట్రలు చేసిండ్రు

మీరు జేస్తె సంసారం ..మేము జేస్తే వ్యభిచారమా
చంద్రబాబు కుటుంబం అంత రాజకీయం జేస్తది
వైఎస్ కుటుంబం మొత్తం రాజకీయం జేస్తది
అదే తెలంగాణోడు జేస్తే కుటుంబ రాజకీయం
థూ... మీ బతుకులు జెడ..మీ కండ్లల్ల నిప్పులు వడ

ఆత్మగౌరవ జెండా ఎత్తుకున్న మా విధ్యార్థులు మీకు తాలిబన్లయినప్పుడు
ఆత్మబలిదానాలు జేసుకున్న మా పిల్లలు మీకు తోటి మనుషులుగా కనిపియ్యనప్పుడు
మా అస్థిత్వ పోరాటాన్ని మీరు అవహేళన చేసినప్పుడు ..ఎందుకు రా కలిసుండాలె ?

తెలంగాణ నిచ్చెన మీది నుండి అధికారం అందుకున్నోడు
ఎక్కిన నిచ్చెనను ఎన్కకు తన్నిండు..అయిదేండ్ల అధికారంతో ఆగం జెయ్య జూసిండు
నది దాటి నంధ్యాల కాడ ..ఆడి కోవాల్నంటే పాస్ పోర్ట్ గావాలె..వీసా గావాలె అని ఇషం గక్కిండు
అందుకే పాపం పండి యాడాది తిర్గక ముందే పాస్ పోర్ట్ లేకుంట పావురాల గుట్టకాడ పానమిడ్సిండు

నాలుగేండ్ల సంది వెయ్యి మంది మా పిల్లలు మంటల్ల గాలుతుంటె
మా జనం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు జేస్తుంటె
తెలుగువారం కలిసుందా అని కథలు జెప్తున్న ఒక్కడన్న
మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం జేసిండా
మా తరపున సర్కారుతోని లడాయికి దిగి ఇది తప్పు అని ప్రశ్నించిండా ..
నా అన్యాయాన్నే నువ్వు గుర్తించనప్పుడు నాకు అన్నవెట్లయితవు

కడుపుల లేనిది కావులించుకుంటె రాదు
ఇడుదల కాయితం సిద్దమయింది
ఇప్పటికయిన ఒప్పుకుని ఇజ్జత్ నిలవెట్టుకో

sandeepreddy kothapally

www.facebook.com/thovva

10, డిసెంబర్ 2013, మంగళవారం

మోక మీద కొచ్చినంక మొరాయిస్తున్న బాబు !

బాబు : ఆర్నెళ్లు ఫాంహౌజ్ లో పడుకునే కేసీఆర్ నన్ను విమర్శిస్తాడా ?

తెలంగాణ : నువ్వు గుడిసెలో పంతున్నవా ..గుడి ఎన్క పంతున్నవా..పండుకోనికె యాడైతె ఏంది పనికి మాలినోడ

 బాబు : నీళ్లొస్తాయని..ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమిస్తానని చెప్పడం తప్ప కేసీఆర్ ఏం చేశాడు ?

తెలంగాణ : తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి మీరేం పగలదీశారో.. 1999ల బీజేపీని పుణ్యాన అధికారం దక్కించుకున్నావ్..ఆనక ఎన్టీఆర్ కు పొడిసినట్లే బీజేపీకి వెన్నుపోటు పొడిచావ్. ఓ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రం విభజన జరగితే ఎలా ఉండాలి అన్న ఆలోచన లేకుండా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చావా ? విజన్ 20-20 అని కారు కూతలు కూయడం కాదు. మాట్లాడే మాటలకు రీజన్ కూడా ఉండాలి

బాబు : నేను ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగువారిని కాపాడేందుకు వెళ్లా !

తెలంగాణ : పక్కనున్న తెలంగాణ వారిని కాపాడలేవు.. వారి ఆకాంక్షలను గౌరవించలేవు గానీ అక్కడికెళ్లి సొల్లు మాటలు చెబుతున్నావా

బాబు : బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే కేసీఆర్ నన్ను బెదిరిస్తాడా ?

తెలంగాణ : వసూలు చేయడం చూశావా ? ఆధారాలుంటే బయటపెట్టు. నీ కారుకూతలు రాసే పేపర్లున్నాయని రెచ్చిపోకు ..అవి అచ్చయి చరిత్రలో నిలుస్తాయని గుర్తు పెట్టుకో

బాబు : తెలుగు ప్రజలను కలవకుండా విషబీజాలు నాటారు. రెండు వైపులా జనాలను రెచ్చగొట్టి విభజన చేస్తున్నారు

తెలంగాణ : మరి ఈ విష బీజాలను తొలగించడానికి నీవు చేసిన ప్రయత్నాలు ఏంటో ? చెప్పలేదు. విషబీజాలు వేసిన టీఆర్ఎస్ తో 2009లో ఎందుకు పొత్తు పెట్టుకున్నావ్ ? ఆ తరువాత తెలంగాణ తేల్చాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాశావ్ ? అఖిలపక్షం పెట్టాలని ఎందుకు ప్రధానికి లేఖ రాశావ్ ?

ఈ ఆంధ్రబాబుల రుబాబులు మనకు కొత్తేం కాదు.. మోక మీదకు వచ్చినంక చంద్రబాబు మొరాయిస్తున్నడు. నిన్నటిదాంక నిమ్మలంగ ఉన్న చంద్రబాబు ఈ మూడు రోజుల నుండే ఎందుకు ఎగిరెగిరి పడ్తున్నడు.  1969 మాదిరే తెలంగాణను అడ్డుకుని తెరమరుగు చేయాలని కుట్రలకు తెరలేపారు. అన్ని పార్టీలు ఏకమయ్యి అడ్డుకోవాలని ఆరాటపడ్తుండ్రు. కానీ ఇది ఎడ్డి తెలంగాణ కాదు..ఇప్పుడు ఆగే ముచ్చట లేదు.

కుట్రలను చేధిద్దాం ... తెలంగాణ సాధిద్దాం

please like this page

www.facebook.com/thovva 

బాబు లత్కోరు..జగన్ శకం అంతం : కేసీఆర్

కేసీఆర్ కు ప్రధాని పదవి ఇచ్చినా సరే.. నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం 

తెలంగాణ బిల్లు చాలా సులభమయింది
55 మంది పార్లమెంటుకు హాజరై 
28 మంది మద్దతు పలికినా తెలంగాణ బిల్లు పాసవుతుంది

చంద్రబాబు ఓ లత్కోరు మనిషి
సీమాంధ్ర పాలకులు చేసిన తప్పుల మూలంగానే
తెలంగాణ ఈ రోజు విడిపోతుంది
విడిపోయినా కలిసుందాం
ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు


సన్నాసుల్లారా ..టీడీపీ,జగన్ పార్టీల లో కొనసాగడం అనైతికం
ఇప్పటికన్నా బానిస ..భాంచగిరి చేయడం మాని రోషముంటే బయటకు రండి
తెలంగాణ ఆపడం ఎవరి తరం కూడా కాదు
తెలంగాణ ప్రజలు విడిపోవాలంటే కలిసుందామనడం అవివేకం
తెలంగాణ జగన్ పార్టీ శకం ముగిసింది
ఇప్పుడు సీమాంధ్ర నేతలు చేస్తున్న ఇలాంటి పనులు
అప్పట్లో చేసినందుకే రాజాజీ మద్రాసు నుండి వెళ్లగొట్టారు
జగన్ పార్టీల ఇంకా ఉన్నోళ్లు కన్నతల్లికి కొరివి పెట్టినట్లే
చంద్రబాబు ఇంకా విషం కక్కుతూనే ఉన్నాడు
తెలంగాణ ప్రజల మనసెరిగి మెలగాలి

please like page

www.facebook.com/thovva

9, డిసెంబర్ 2013, సోమవారం

చంద్రబాబు చెల్లని నోటు !

2009 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గురించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్లారెడ్డి ఎన్నికల సభలో
ఓ ప్రశ్న వేశారు. "కామారెడ్డిల చెల్లని రూపాయి ఎల్లారెడ్డిల చెల్తదా ? అని జనాన్ని ప్రశ్నించారు. చెల్లని రూపాయి ఎక్కడయినా చెల్లదు" అని జనం సమాధానం ఇచ్చారు.

కేసీఆర్ చెప్పినదానికి జర్రంత ఎక్వ తక్వ కాకుంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నడు. తెలంగాణ ఓట్ల కోసం కేంద్రానికి లేఖ ఇచ్చి 2009ల టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ..ఈనాడు పేపరు రాసిన రాతలు జూసి ఆ పొత్తుకు పురిట్లనే సంధికొట్టిండు. వైఎస్ అధికారం వచ్చినంక టీఆర్ఎస్ పార్టీని గల్లంతు చేయాలని ప్రయత్నిస్తే..చంద్రబాబు అంతకుముందే ఆ పనికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 46 స్థానాలలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని 33 స్థానాలలో తన పార్టీ నేతలతో నామినేషన్లు వేయించి చివరి సమయంలో బీ ఫాంలు ఇచ్చి టీఆర్ఎస్ విజయాలను అడ్డుకున్నాడు. టీడీపీ అభ్యర్థులను టీఆర్ఎస్ గెలిపిస్తే..టీఆర్ఎస్ కు బాబు వెన్నుపోటు పొడిచి అధికారానికి దూరమయ్యాడు.

ఇక 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష సమయంలో అఖిలపక్షం పెడితే తెలంగాణ మీద వెంటనే అసేంబ్లీ ఏర్పాటు చేసి తీర్మానం చేస్తారా ? లేదా ? తీర్మానం మీరు పెడతారా ? లేక మమ్మల్ని పెట్టమంటారా ? అని బీరాలు పలికాడు. తీరా 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన రాగానే 10 వ తేదీన అడ్డంతిరిగి అసలు తెలంగాణ ఎలా ఇస్తారు ? ఇంత పెద్ద నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకుంటారా ? అని మొరాయించాడు. చంద్రబాబు పుణ్యం..సీమాంధ్ర నేతల మోసం ఫలితంగా  వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేశారు.

ఇక ఆ తరువాత 2011 ఉప ఎన్నికలల్ల బాబ్లీ నాటకం ఆడి చంద్రబాబు మహారాష్ట్రల పోయి కూసున్న తెలంగాణ జనం ఎక్కడా కనీసం టీడీపీ డిపాజిట్ దక్కనివ్వలేదు. ఆ తరువాత గత ఏడాది పాదయాత్ర జేస్తున్న అని తెలంగాణ మీద కేంద్రం అఖిలపక్షం పెట్టాలని ప్రధానికి లేఖ రాసిండు. అఖిలపక్షంలో అడ్డదిడ్డంగ లేఖ ఇచ్చాడు. ఇన్నేళ్ల ఉద్యమం ఫలితంగా జులై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు సీమాంధ్ర రాజధానికి రూ.4.5 లక్షల కోట్లు నిధులడిగాడు. ఆ మరుసటి రోజు నుండి సమన్యాయం.. ఆ తరువాత ఇద్దరు కొడుకుల సిద్దాంతం.. ఆ తరువాత ఢిల్లీ దీక్ష..తాజాగా కొబ్బరికాయల సిద్దాంతం అని దిక్కు మాలిన వాదన చేస్తూ తెలంగాణ వ్యతిరేక వాదన చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఉన్న కాస్త సిగ్గునూ పక్కన పెట్టి అసలు రాజధాని ఉన్న ప్రాంతం ఎక్కడయినా రాష్ట్రంగా విడిపోయిందా ? అడ్డగోలు విభజనకు అంగీకరించాలా ? సీమాంధ్ర రాజధాని అడవిలో పెట్టుకోవాలా ? అని ప్రశ్నలు వేస్తున్నాడు.

పూటకో మాటతో తెలంగాణ - సీమాంధ్రలో ఎక్కడా మొహం చెల్లని చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానం అయినా కరుణిస్తే ఈ సారి గట్టుక్కుతానా ? అని ఆలోచనల్లో పడ్డాడు. అరవింద్ కేజ్రివాల్ విజయాన్ని అబ్బో అని పొగుడుతున్నాడు. ఢిల్లీల ఉన్న కేజ్రివాల్ కూడా తెలంగాణ ఉద్యమానికి నిజాయితీగా మద్దతు తెలిపాడు. కానీ ఈ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన నీకు ఓ స్పష్టమయిన వైఖరి లేకపోవడం ఇక్కడి ప్రజలంతా చేసుకున్న దౌర్భాగ్యం.

please like & share this page

www.facebook.com/thovva

8, డిసెంబర్ 2013, ఆదివారం

నిండుకుండ తొణకదు..ఎంగిలిస్తరాకులు ఎగిరెగిరి పడ్తయి

నిండు కుండ తొణకదు (KCR).. ఎంగిలి ఇస్తరాకులు ఎగిరెగిరి పడుతున్నయి (ఎవ్వలో నేం జెప్ప)


కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ మీద నిర్ణయం తీసుకున్నప్పటి నుండి 13 ఏండ్ల సంది ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. ఇన్నేండ్ల ఉద్య మంల ఎన్నో రాజీనామాలు..అవమానాలు, ఆరోపణలు, అణచివేసే కుట్రలు, టీఆర్ఎస్ ను తెరమరుగు చేసే ప్రయత్నాలు..తెలంగాణోడు..ఆంధ్రోడు అందరు గలిసి కేసీఆర్ ను ఎన్ని తిప్పలు వెట్టాల్నో అన్ని వెట్టిండ్రు. ఒక రాజకీయ పార్టీ నేత మీద ఎన్ని విధాల దాడులు జరగకూడదో అన్ని విధాల దాడి కేసీఆర్ మీద జరిగింది. సీమాంధ్ర మీడియా కేసీఆర్ వ్యక్తిగత జీవితం మీద కూడా దాడి చేసింది. విలువల గురించి మాట్లాడే మేధావులు కేసీఆర్ విషయంలో వలువలు విడిచి రాస్తున్న మీడియా రాతలను ఖండించిన పాపాన పోలేదు. తెలంగాణ, టీఆర్ఎస్, కేసీఆర్ విషయంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఓ మాఫియాలా వ్యతిరేకంగా పనిచేసింది. పని చేస్తూనే ఉంది. తెలంగాణకు అనుకూల సంకేతాలు వచ్చిన ప్రతిసారి ఈ మాఫియా రెచ్చిపోయి అడ్డుకునే, గందరగోళంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇన్నేళ్లు అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగిన కేసీఆర్ గత మూడు నెలలుగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేదాకా అప్రమత్తంగా ఉందాం అని తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తున్నారు. సంబరాలైనా..సమావేశాలయినా ఆ తరువాతనే అని చెబుతున్నారు.

ఎంగిలి ఇస్తరాకులు ఎగిరెగిరి పడుతున్నయి

తెలంగాణ గురించి నిన్నటి మాట్లాడనోడు.. పొయ్యిల వన్పోడు..ఎగతాళి జేసినోడు..ఎక్కిరించినోడు..అడిగిన విద్యార్థులను అడ్డంబడి తన్నినోడు.. తెలంగాణ ఎందుకని మీడియా సాక్షిగా ప్రశ్నించినోడు..అసలు కేసీఆర్ ఎవరు ? అన్నోడు ..ఆయన బలమెంత అని బీరాలు వొయ్యినోడు..ఇచ్చేటోళ్లు..తెచ్చెటోళ్లు ..మద్దతిచ్చె టోళ్లు అందరు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. మేమే ముందట్కి వడి తెచ్చినవని తెగ ఫీలయితున్నరు. తెలంగాణ వచ్చిందా...అది ఇవ్వక తప్పని పరిస్థితి కేసీఆర్, తెలంగాణ సమాజం ఈ పార్టీలకు సృష్టించిండ్రా అన్నది అందర్కి ఎర్కనే..ఇక ఎంగిలిస్తారాకులు ఎవరో గుడ్క మీకే తెల్సు నేం జెప్పాల్సిన పనిలేదు.

please like & share this page

www.facebook.com/thovva


సందీప్ రెడ్డి కొత్తపల్లి

7, డిసెంబర్ 2013, శనివారం

మారనంటున్న కిరణ్ ..మారాం చేస్తున్న చంద్రబాబు..జగన్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తరువాత కూడా సీల్డ్ కవర్ సీఎం కిరణ్, మాజీ ముఖ్యమంత్రి, రెండు కళ్ల చంద్రబాబులు మారడం లేదు. ఇంకా చెల్లిపోయిన సమైక్య సొల్లును కిరణ్ సొల్లుతూనే ఉన్నాడు. అసేంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తానని రంకెలు వేస్తున్నడు. అసలు అసేంబ్లీల తెలంగాణ బిల్లు గురించి చర్చ జరుగుతుంది గానీ ఓటింగ్ ఏమీ జరగదు. జరిగినా దానిని పరిగణనలోకి తీసుకోరు. ఈ విషయం తెలిసి గుడ్క వాగుతున్న కిరణ్ సీమాంధ్ర జనం చెవిల పువ్వులు పెడుతుంటే ఎంపీ లగడపాటి పక్కనుండి చప్పట్లు కొడ్తున్నడు. కూట్ల రాయి తియ్యలేనోడు ఏట్ల రాయి తీస్తడా అని రాజీనామా జెయ్యనీకే ధైర్యంలేని ముఖ్యమంత్రి తెలంగాణను అడ్డుకుంటా అని పోజులు గొడ్తుండు. తాన్దూరనే సందులేని కిరణ్ మెడకో డోలు లగడపాటిని తగిలిచ్చుకున్నడు. సన్నాసి సన్నాసి రాసుకుంటె బూడిద రాలిందని ..ఈల్లు ఈసారి మళ్ల గెల్చె మొఖాలె గావు గానీ లేని సమైక్యాంధ్ర గురించి తెగ పీలయితున్నరు.

ఇక తెలంగాణనా ? సమైక్యాంధ్రనా ఏ సంగతి ఇంగా తెల్సుకోలేక తిప్పలు వడుతున్న చంద్రబాబు ఆరునెలలు అధికారం ఇస్తే ఏందనేది తేల్చుకోని ఆ తరువాత సమన్యాయం ఎట్ల చేయాలెనో ఆలోచించి.. ఆ తరువాత కొబ్బరికాయ సమంగ పల్గదీసి.. ఉన్నది ఒక్కడే కొడుకు గావట్క ఇద్దరు పిల్లలున్నోళ్ల ఇండ్ల సుట్టు తిర్గి. ఆళ్లకు ఏ పిల్ల ఇష్టమో తెల్సుకోని .. ఆ తరువాత చిత్తూరు నుంచి ఆదిలవాద్ కు .... రంగారెడ్డి నుండి శ్రీకాకుళానికి పాదయాత్ర జేసి ఆంధ్ర ప్రదేశ్ ఎంత పొడుగు ..ఎంత ఎడెల్పు ఉందో తన అడుగులతోనే లెక్క గట్కోని అప్పుడు ఓ దినం మేస్త్రీలను పిల్సుకోనొచ్చి దారం పట్టించి తెలంగాణ - ఆంధ్ర ఇబజిస్తడట. మనిషికో మాట ..గొడ్డుకో దెబ్బ అని అంటరు. చంద్రబాబు కు మాటలు, దెబ్బలు ఏవి గుడ్క పనిజేసెటట్లు లేదు.

ఇగ అయ్యకు అధికార మొచ్చిన తర్వాత ఎల్గుల కొచ్చిన కడప చిన్రాయుడు జగన్ బాబు సమైక్యాంధ్ర సమైక్యాంధ్ర అని దేశవంత తిరిగి చెప్తున్నడు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, అధికార పక్షం యూపీఏ రెండు గుడ తెలంగాణ బిల్లుకు సై అన్నంక తెలంగాణ ఎట్ల ఆగుతదో ఈ చిన్రాయునికె తెల్వాలె. తండ్రి అధికారంల ఉంటెనే కోట్లు ముల్లె గట్టినోడు ..చేతికి అధికార దొరికితె చెరబట్టుడు ఖాయం. మొన్న తుపాను వచ్చిందని రైతులను కల్వనీకె వొయ్యి మైకుల మాట్లాడనీకె మడికెట్లల్ల సెక్యూరిటీ కానిస్టేబుల్ ను వంగవెట్టిండు జగన్. ఇసోంటోనికి గిట్ల సీమాంధ్ర జనం ఓట్లేస్తె జనం అందరినీ ఒంగవెట్టుడు ఖాయం.

ఇసవంటి నేతలతోని సీమాంధ్ర జనం ఎట్ల ముందలవడ్తరో .. ఏమో ..ఈళ్లను దేవుడే కాపాడాలె

sandeepreddy kothapally

please like & share

www.facebook.com/thovva 

6, డిసెంబర్ 2013, శుక్రవారం

ఎవరి అమ్మ ? ఎక్కడి అమ్మ ? ఎందుకు అమ్మ ?

ఎవరి అమ్మ ? ఎక్కడి అమ్మ ? ఎందుకు అమ్మ ?

తెలంగాణ ఇచ్చినంతట్లనే పొయ్యిన పిల్లలు తిరిగొస్తరా ?
సచ్చిన పానాలు లేచొస్తయా ? తల్లుల కడుపుకోత సల్లార్తదా ?
1300 మంది అమరుల ఉసురు కొట్టుకుపోతదా ?

ఇచ్చిన తెలంగాణను ఎన్కకు తీసుకోని
ఇగురం లేని కొడుకుల మాటలు వట్టుకోని
నాలుగేండ్ల సంది పిల్లల పానాలతోని ఆడుకోని

తెలంగాణ ఉద్యమాన్ని అన్గదొక్కనీకే
అవసరమయిన అన్ని ప్రయోగాలు జేసి
ఆఖర్కి ఇక ఇయ్యక తప్పదని తెల్సుకోని
ఇయ్యాల తెలంగాణ ఇచ్చింది

లేని పంచాయితి పెట్టొద్దు
అమ్మ మన అమ్మ కానే కాదు
అమ్మ మనకు ఎప్పటికీ సవతి తల్లె
సీమాంధ్ర పెట్టుబడిదారుల నుండి ఓట్లు రాలవన్న
పరిస్థితి తెలుసుకున్న తరువాతనే
తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని అందరూ గుర్తవెట్టుకోవాలె

తెలంగాణ
నిఖార్సయిన
నిజాయితీ గల ఉద్యమం

ఇలాంటి ఉద్యమాలకు ఏ అమ్మయినా సలాం కొట్టాల్సిందే
అమరుల తల్లులకు తప్ప ఏ అమ్మకు తెలంగాణ సలాం కొట్టదు..కొట్టకూడదు

please like & share

www.facebook.com/thovva 

5, డిసెంబర్ 2013, గురువారం

తెలంగాణకు ఇక రెండడుగుల దూరంలో ..!

అమరుల త్యాగాలు..విద్యార్థులు, ఉద్యోగుల పోరాటం..సమస్త తెలంగాణ ప్రజల సహకారం. మొత్తానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంకంలో ఒక కీలకఘట్టం పూర్తి చేసుకుంది. సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలను ఛేధించుకుని కేంద్ర క్యాబినెట్ ఆమోదం దక్కించుకుంది. ఎన్నో బలిదానాలు.. ఎందరికో కడుపుకోత.. లాఠీఛార్జీలు, రబ్బరు బుల్లెట్లు..భాష్పవాయువు గోళాలు. తెలంగాణ అంతా పోలీసు పదఘట్టనల కింద నలిగిపోయింది. దెబ్బ తగిలిన ప్రతిసారి రెట్టింపు వేగంతో ఉద్యమంలోకి తెలంగాణ జనం వచ్చేశారు.

ప్రపంచ చరిత్రలో ఇంత సుధీర్ఘంగా సాగిన ఉద్యమం ఈ మధ్య కాలంలో ఏదీ లేదు. భవిష్యత్ లో ఏదీ ఉండదు కూడా. స్వాతంత్ర పోరాటం తరువాత అంత సుధీర్ఘంగా సాగింది. ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వ్యవస్థ తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమ నాయకత్వం, తెలంగాణ ఏర్పడితే వచ్చే సమస్యల మీద చేసిన యాగీ అంతా ఇంతా కాదు. తెలంగాణ ఉద్యమ నాయకత్వానికి తెలంగాణ ప్రజల అండలేకుండా చేసేందుకు వారి వ్యక్తిగత జీవితం మీద కూడా కావాల్సినంత బురద చల్లాయి. ఎన్ని నిందలు పడ్డా..ఎంత అణగదొక్కాలని చూసినా నిఖార్సయినా ..నిజాయితీ గల తెలంగాణ ఉద్యమం ఎక్కడా ఉలిక్కిపడలేదు.

2009 ప్రకటన వెనక్కి తీసుకున్న తరువాత నాలుగేళ్లుగా తెలంగాణ విరామం లేని పోరాటం చేసింది. ఎందరో బిడ్డలు బలిదానాలు చేశారు. శ్రీకాంత చారితో మొదలయిన బలిదానాలు ..నిన్న రాయల తెలంగాణ అన్న వార్తల వరకు కొనసాగాయి. ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా సీమాంధ్ర విషపు మీడియా వార్తలు చదివి తెలంగాణ బిడ్డలు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకోవడం మాత్రం ఆపలేదు. తెలంగాణకు క్యాబినెట్ ఆమోదం వచ్చిన ఇప్పటి నుండి అయినా తెలంగాణ బిడ్డలు గుండెదిటవు చేసుకుని వచ్చే తెలంగాణలో బంగారు భవిష్యత్ ను చూసుకోవాలని కోరుకుందాం. ఇక బిల్లు రాష్ట్రపతికి వెళ్లిన నేపథ్యంలో అది అక్కడి నుండి అసేంబ్లీకి రావడం..తిరిగి పార్లమెంటుకు వెళ్లి ఆమోదం పొందడం అనే రెండు అడుగులు మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు అప్రమత్తంగా ఉందాం. తెలంగాణ సాధించుకుందాం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అమరుల ఆశయాలను సాధిద్దాం..జయశంకర్ సార్ లక్ష్యాలను చేరుకుందాం

జై తెలంగాణ

మీ సందీప్ రెడ్డి కొత్తపల్లి

5, నవంబర్ 2013, మంగళవారం

శబరిమల యాత్ర - తెలంగానం

యాడికొయ్యినా మనకు తెలంగాణ యాదే ఉంటది. వెయ్యి మంది బలిదానాలు మనను ఒక్క తాన నిల్వనిస్తయా
..తెలంగాణను ఒక్క మాట అననిస్తయా. అందుకే మాల వేసుకుని శబరిమల వెళ్లినా యాది మాత్రం తెలంగాణ మీదనే ఉంటది. పోత పోత ఎర్మేలి కాడ చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి వచ్చిన మేస్త్రి కండ్లవడ్డడు. మన పానం ఊకుంటదా. ఏంది అన్నా మీ తాన సమైక్యాంధ్ర నంట గద ఎట్లుంది అని గెలుకుతి. మనోడు గుడ్క ఏమీ తడుముకోలే. పన్లేనోళ్లు నాలుగు దినాలు లొల్లి వెట్టిండ్రు. ఇప్పుడు ఎవడూ పత్తలేడు అని జెప్పిండు. ఆ జోలి ఇని నా కడుపు సల్లవడ్డది.

ఇంగ పంబల తానం జేసి కొండ ఎక్కవడ్తిమి. మనోళ్లు జర ముందల్నే పొయ్యిండ్రు. శరంగుత్తి ఆల్ కాడ శరం గుచ్చి టెంకాయలు కొట్టి అల్సట తీసుకునేందుకు కూసున్నరు. అంతే చిత్తూరాయిన పోరడు పాపం నాయకులు నేర్పిన నాలుగు మాటలు ఇన్నంటుంది. సమైక్యాంధ్ర అంటున్నడంట. మనం పోంగనే మనోళ్లు మనకు అంటిచ్చిండ్రు. అన్న ఈన సమైక్యాంధ్ర అంటున్నడు అని. నేను మొదలు వెట్టిన నీ సమైక్యం నీ తాననే ఉండని..  మా తెలంగాణ మేం ఏలుకుంటం అని అన్న. ఎప్పుడన్న రావాలన్పిస్తే మా ఇంటికి రా బువ్వ వెట్టి తోల్త అని జెప్పిన. మీరు గుడ్క
రాండ్రి తిరుపతిల మా దేవున్ని సూతురు అనవట్టె. అరె ఇప్పుడె సమైక్యం అంటివి అప్పుడే మీ దేవుడు ఎట్లయితడు రా బై అని మా బాలస్వామి అందుకున్నడు. మనోడు నోరు తెర్వలె.

మెల్లగ టెంకాయ గొట్టొచ్చి తెలంగాణ పాట వెట్టుకున్న. అదేంది దేవుని కాడికొచ్చి తెలంగాణ పాటలు వెట్టినవ్...అయ్యప్ప పాటలు వెట్టు అనవట్టె చిత్తూరాయిన. అరె బాబు మాకు దేవుడయినా ..దయ్యవయినా తెలంగాణనే. నీకు ఇష్టం లేకుంటే ఈన్నుంచి పో అని గట్టిగనే అన్న. మళ్ల మనోడు నోరు తెర్వలే. మెల్లగా మేం మళ్ల బాటవట్టినం. సన్నిదానం దగ్గరికోయినంక ఓ తాన కూసున్నం. పక్కనే ఓ అయ్యగారు (విజయవాడకు చెందిన బ్రాహ్మణుడు) వచ్చి శెల్ల ఏసుకోని పడుకున్నడు.

ఏం అయ్యగారు చానమంది వచ్చినట్లుంది అయ్యగార్లు (కింద పంబ నదిల మా పక్కననే తానం జేసిండ్రు) అని జోలి మొదలయింది. ఏంది మీ తాన సమైక్యం కథ అని అడిగినం. తెలంగాణ వచ్చేసింది గద ఇంగెక్కడి సమైక్యాంధ్ర. ఆల్రెడీ నిర్ణయం అయిపోయినంక ఇంగేముంటది అనవట్టె. అదేంది అయ్యగారు మీ తాన బాగ లొల్లి జేస్తుండ్రు గద ..మీడియాల ఒక్కటే సూపుతుండ్రు అని అడిగినం. మీడియా పేరు ఎత్తంగనే అయ్యగారికి మండింది. అసలు మీడియాను ఎవడండీ నమ్మేది. కృష్ణా నదిల నీళ్లు తగ్గినప్పుడు దానిలో ఇళ్లు కట్టుకుంటారు. వర్షాకాలం నీళ్లు వచ్చి ఇండ్లు మునగంగనే మునిగిపోయారని, ఇళ్లు కొట్టుకుపోయారని వార్తలు ఏస్తరు. అసలు అందులోకి వెళ్లేది ఎందుకు ? మునిగేది  ఎందుకు ?

తెలంగాణ ఇస్తే నేనేమన్న పౌరోహిత్యం మానేసి ఇంకో పని చేస్తనా..ఇదే పని గద చేసేది. పెద్దోళ్లు ఆడిస్తున్న నాటకం. లేనోడు అడుక్కు తింటున్నాడు..ఉన్నోడు దోచుకు తింటున్నాడు. అటు ఇటుగాని మధ్య తరగతి వాడు ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతున్నడు అని అన్నడు. ఈ సారి జగన్ దొంగ అని తెల్సినా వాడికే ఓటెస్తరు...ఇక వచ్చేసారి చెప్పలేం. టీడీపీ జనం నమ్మట్లేదు అని అన్నడు. అయ్యగారి మాటలతో మాకు అందరికీ సంతోషం అయింది.

ఇక రాత్రికి దర్శనం చేసుకుని, పొద్దున్నే నెయ్యాభిషేకం చేయించుకుని తిరుగుబాట పట్టాం. శరంగుత్తి ఆల్ దగ్గరకు వచ్చే సరికి పక్కన్నే అర్చన  (మనవాళ్లు ఎవరయినా చనిపోతే అక్కడ ఓ పది రూపాయలు ఇస్తే వారి పేరు చెప్పి ఓ టపాకాయ్ పేలుస్తారు. అడవి జంతువులు భక్తుల దారిలోకి రాకుండా టపాకులు పేలుస్తారు. అయితే దానిని ఈ విధంగా మార్చి ఆలయానికి ఆదాయ మార్గంగా మార్చుకున్నారు) స్టాల్ కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి జోహార్ తెలంగాణ అమర వీరులకు ..జై తెలంగాణ అని చెప్పించాను. ఆయన తెలంగాణ అని మరో రెండు సార్లు ఉచ్చరించాడు. తెలంగాణ పదం వినగానే ఆయన మొఖం వెలిగిపోయింది. పక్కనే ఉన్న కేరళ అయ్యప్ప స్వాములతో మళయాళంలో తెలంగాణ గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు. తెలంగాణ వారికి అర్చన చెప్పించుకున్నాడు అని వారికి చెప్పడం మాకు అర్ధమయింది. శబరి మల వెళ్లే తెలంగాణ వారంతా ఈ సారి అమర వీరులకు ఇలాగే అర్చన చేయిస్తారని కోరుకుంటున్నాను. శరంగుత్తి ఆల్ తో పాటు పైన గుడి ఎదురుగా లైన్ల పక్కన కూడా ఇలా చెప్పే అర్చన కేంద్రం ఉంటుంది. ఎవరూ మర్చిపోవద్దని విజ్ఞప్తి.

24, అక్టోబర్ 2013, గురువారం

దూడను చీకమంటడు..బర్రెను..?! సోయి తప్పిన సెంద్రబాబు..!!

ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం 28 రాష్ట్రాలున్నాయి. ఇప్పుడు 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కాబోతుంది. కానీ ఇంతవరకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా రెండు రాష్ట్రాలలో అధికారం దక్కించుకున్న దాఖలాలు లేవు. కాకపోతే మిగతా రాష్ట్రాలలో ఒకటో ..రెండో స్థానాలు దక్కించుకున్నాయి తప్పితే ప్రభావం చూపడం..ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకున్న చరిత్ర కూడా లేదు. కానీ చరిత్రలో చేయని పనులే చేయడం..చరిత్ర హీనుడిగా మిగలడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే అలవాటుగా ఉన్నట్లుంది.

ఈ రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లు
ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్న ఆయనకు రాష్ట్ర విభజన విషయంలో ఓ ఖచ్చితమయిన అభిప్రాయం లేదు. ఎదుటి పార్టీలు విభజనను రాజకీయ అవకాశవాదంగా వాడుకుంటున్నాయి అనే దుగ్ద.. రాష్ట్రాన్ని ఇలా విభజిస్తారా ? ఇక్కడ పెద్ద మనుషులు లేరా ? తెలుగు జాతి మధ్య చిచ్చుపెడతారా ? అని ఆరోపించడం తప్పితే తనయితే ఎలా విభజిస్తాడు ? తనయితే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు ? అని మాత్రం చెప్పడు. అప్పటికి తానేదో రాజకీయ ప్రయోజనాలకోసం అస్సలు వెంపర్లాడడం లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు.

తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత కూడా తాను సమైక్య వాదిని అన్న వైఎస్ జగన్ కంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ అన్ని ప్రాంతాలను సమానంగా చూడకుండా తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా పనిచేస్తూ నిస్సిగ్గుగా నిధులు దోచుకుపోతున్నకిరణ్ కంటే.. వ్యతిరేకం కాదంటూనే తెలంగాణకు వీలయినంత ఎక్కువ నష్టం చేసే చంద్రబాబునాయుడు, జయప్రకాష్ నారాయణ వంటి వారి మూలంగానే ఎక్కువ నష్టం. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే సీమాంధ్ర ప్రయోజనాలు, సీమాంధ్ర సమస్యలు బయటపెట్టకుండా, వాటికి పరిష్కారాలు కోరకుండా తెలంగాణ గురించి ప్రకటనలు చేసే దిగ్విజయ్ సింగ్ ను చంద్రబాబు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేత విమర్శలు చేయిస్తాడు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిలిపేయాలని పయ్యావుల కేశవ్ తో పిల్ లు వేయిస్తాడు.

వీలయినన్ని ఎక్కువ సమస్యలు సృష్టించేందుకు తన వంధిమాగధులయిన మీడియా యాజమాన్యాల చేత తెలంగాణ విభజన మూలంగా సీమాంధ్రులు కోల్పోతున్న వాటిని భూతద్దంలో పెట్టి చూయించి ప్రచారం చేయిస్తాడు. కానీ తెలంగాణ ఇన్నాళ్లు కోల్పోయిన దాని గురించి మాట్లాడడు. వెయ్యి మంది బలిదానాల గురించి ఒక్క నాడు మాట్లాడని చంద్రబాబు అరవై రోజుల కృత్రిమ ఆందోళనను భూతద్దంలో చూయించే తన తరపు మీడియాతో కలిసి గుండెలు బాదుకుంటాడు. లేని సమైక్య భావనను తట్టి లేపేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. నంది ఎప్పుడూ పంది కాదు. తెలంగాణ ఉద్యమం నంది లాంటిది..సీమాంధ్ర ఉన్మాదం పంది లాంటిది. చంద్రబాబు నాయుడు లాంటి  నేతలు మన రాష్ట్రంలో ప్రముఖులుగా చెలామణికావడం, జయప్రకాష్ నారాయణ లాంటి వారు మేధావులు అని ఫీలవ్వడం నిజంగా దురదృష్టం.

ఒకవైపు తెలంగాణకు మద్దతు అంటూనే మరో వైపు సీమాంధ్ర గురించి మాట్లాడడం దూడను చీకమనడం..బర్రెను తన్నమనడం సామెతను గుర్తుకుచేస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు విభజన మూలంగా ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిజాయితీగా పోరాడి సాధించుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్ లో బాబుకు సీమాంధ్రలో మంచి భవిష్యత్ ఉంటుంది. తెలంగాణలో జనం అభిమానం కూడా కాస్త మిగులుతుంది. ఇప్పుడు సమైక్య నినాదం ఎత్తుకుని జగన్ తాత్కాలికంగా లాభపడవచ్చు. కానీ జగన్ కు భవిష్యత్ ఉండదు. చంద్రబాబు కూడా జగన్ దారినే నమ్ముకుంటే నట్టేట్లో మునగడం ఖాయం.

23, అక్టోబర్ 2013, బుధవారం

పిల్ల జమిందార్ .. పిల్లి మొగ్గలు


సమైక్య సభ విజయవంతానికి పిల్ల జమిందార్ వైఎస్ జగన్ అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. సభ ప్రకటించి
వారం కావస్తున్నా సీమాంధ్ర జనంలో అనుకున్న స్పందన లభించడం లేదని జగన్ బాబు ఆందోళన చెందుతున్నాడు. మందు, వాహనాలు, డబ్బులు ఏమయినా ఇవ్వండి. ఎలాగయినా జనాలను మాత్రం హైదరాబాద్ కు తరలించాలని సీమాంధ్రలోని అన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్ లకు టార్గెట్లు పెట్టాడట. ఇక పై-లిన్ తుపాను నేపథ్యంలో విజయనగరం - శ్రీకాకుళం జిల్లాలను ఈ సభ నుండి మినహాయించారు. ఇప్పుడు వాటన్నింటిని వదిలేసి అన్ని జిల్లాలను అందులో చేర్చారు. ఇక పైలిన్ తరువాత ఇప్పుడు అల్పపీడనంతో వర్షాలు కురుస్తుండడంతో అసలు సభ పరిస్థితి ఏంటా అని పికరు చేస్తున్నారట. ఈ నెల 26న జరగనున్న ఈ సభకొరకు ఒక్క విశాఖపట్నం నుండే నాలుగు రైళ్లు ఏర్పాటు చేశారట. మొత్తం అన్ని ప్రాంతాల నుండి ఎనిమిది రైళ్లు అనుకున్నాఇప్పుడు వాటిని రెట్టింపు చేసినట్లు తెలుస్తోంది. ఇంత చేసి ఇతర వాహనాలు పెట్టినా 50 వేల మంది కూడా కావడం లేదట.

ఇలా సభ విజయవంతం చేయడం ఎలా అని మదనపడుతుంటే ఈ వర్షాలు ఇలా అడ్డంకిగా మారడంతో ఎలా చేయాలా ? అని జగన్ కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి కేంద్రంలో వేగంగా ప్రక్రియలు జరిగిపోతుంటే ఈ సభతో ఉన్న ప్రయోజనం ఏంటని ప్రశ్నలు వస్తున్నా ..కిందపడ్డా మీది చేయి నాదే..అన్నట్లు ..తెలంగాణ ఎలాగు వస్తుందని అందరికీ తెలుసు..కాకపోతే సీమాంధ్రలో ఓట్ల మైలేజీ పెంచుకునేందుకు ఈ సభను భారీగా నిర్వహించి ఆకట్టుకోవాలని భావిస్తున్నాడట. ఇక తెలంగాణలో మిగిలిఉన్న కొందరు నేతలను పిలిచి 2014 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతాయని, సీమాంధ్రలో ఎలాగూ మనమే గెలుస్తాం కాబట్టి జనాలను తీసుకువస్తే మీకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెడతానని ఎరవేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎట్టి పరిస్థితులలోనూ సమైక్య సభను అడ్డుకుంటాం అని ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించడంతో అడ్డుకుంటే నరికేస్తాం అంటూ మాజీ ఎమ్మెల్సీ రెహమన్ రెచ్చిపోయాడు. దీంతో లోటస్ పాండ్ లో ఉండి రంకెలు వేయడం కాదు బయటకు వచ్చి చెప్పు ఆ మాటలు అని ఉస్మానియా విద్యార్థులు సవాల్ విసిరారు. మొత్తానికి ఈ సభ నిర్వహణ సీమాంధ్రలో జగన్ కు జీవన్మరణ సమస్యగా మారడంతో అనవసరంగా ఎందుకు రెచ్చిపోయానా అని ఈ పిల్ల జమిందార్ లోపటింట్లో కుమిలిపోతున్నాడని తెలుస్తోంది. రుతుపవనాల సాకుతో ఈ సభ వాయిదా వేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కూడా తెలుస్తోంది.


తొవ్వ ..అంబటాళ్ల ముచ్చట్లు


- పికరు జేస్తున్న పిల్ల జమిందార్. కిందపడ్డా మీది చెయ్యి నాదే. లేని సమైక్యం కోసం ఆరాటం. సమైక్య సభపై జగన్ ఆందోళన. పైసల గురించి గాదు ప్రజలను పట్టుకరాండ్రి..పార్టీ నేతలకు గట్టిగా ఆదేశాలు ! సాక్షి ఛానల్  మన ఇంటి దొంగలకూ జనాలను తెమ్మని డబ్బుల పంపిణీ ?

 సోయి తప్పిన సెంద్రబాబు. సీమాంధ్ర చుట్టూ ఆత్మగౌరవ యాత్ర. తెలంగాణ విభజనపై. పయ్యావులతో పిటీషన్లు. సోమిరెడ్డితో సెటైర్లు.

- రాష్ట్రాన్ని ముంచెత్తిన తుపాను. పత్తి పంటకు పానగండం.ఎడతెరిపి లేని వర్షం. అల్గు పారుతున్న చెరువులు, కుంటలు.

22, అక్టోబర్ 2013, మంగళవారం

జగన్ సభ.. ఇంటి దొంగల మీద కన్నేయండి

జైలు నుండి వచ్చిన తరువాత మాట దప్పె.. మడ్మదిప్పె బాబు సమైక్యం పేరుతోని పెడ్తున్న ఈడ్కోలు సభకు సీమాంధ్ర నుండి సభకు జనం తీస్కరావాల్నంటే కుదురదని, అంతమంది జనం ఆడ్నుండి రారని తెలిసి తెలంగాణల ఉన్న తన పార్టీ నేతల మీద కన్నేసిండు. సోమవారం అళ్లను పిల్సుకోని సమైక్యసభకు జనాలను తోల్కరమ్మని పురమాయించిండంట. అయితే ఇప్పటికే పార్టీని ఇడ్సిన ప్రముఖ నేతలకు బదులు రెండో తరా నేతలకు ఈ పని అప్పజెప్పిండంట.

ముక్కెంగ మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ పరిధిలోని ఐజ, శాంతినగర్, ఇటిక్యాల, మానవపాడు మండలాలలో, అచ్చంపేట పరిధిలోని అమ్రాబాద్ మండలంలో సీమాంధ్రులు స్థిరపడి ఉన్నారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల, రంగారెడ్డి జిల్లాలో స్థిరపడ్డవారు. నల్లొండ జిల్లా కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాలలో, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ప్రాజెక్టుల కింద స్థిరపడ్డ సీమాంధ్రులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయి.

ఏ దిక్కూ లేక అక్క మొగుడే దిక్కని జగన్ పంచననే పడిఉన్న తెలంగాణ నాయకులం అని చెప్పుకునే కొందరు నేతలు నలుగురిని తీసుకోని పోయి తెలంగాణల సమైక్యవాదం ఉందనిపించే ప్రయత్నాలు జరుగుతున్నయి. ఇక సీమాంధ్ర మైకులకు తెలంగాణ అంటె ఎంత పేమనో మనందరికి తెల్సిందే. అందుకే ఒక్కడు వోయిన లచ్చమందికి సమానం జెయ్యనీకె సూస్తడు. కాబట్టి తెలంగాణల ఉన్న జగన్ వంధిమాగధులకు జర్రంత మంచిగ నచ్చజెప్పి జనాన్ని కూడగట్టె పనులు మానుకోమని కోరండ్రి. పట్నంల జగన్ సభ పెట్టుకుంటె ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఇక్కడి జనాలను తీసుకపోవడమే తప్పు. సీమాంధ్ర నుండి తప్పి కొడితె 25 నుండి 30 వేల మందిని తరలించే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ నాటకానికి తెరలేపారు. ఎక్కడికక్కడ ఉన్న తెలంగాణ వాదులు, తెలంగాణ జేఏసీ ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక మొదలు పెడితె బాగుంటుంది.

11, అక్టోబర్ 2013, శుక్రవారం

కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నుండి తప్పుకుంటే ?!

తెలంగాణకు అడ్డం కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడం కేసీఆర్ కు ఇష్టం లేదు. తెలంగాణ ఇస్తే కేసీఆర్ కు కలెక్షన్లు కావని భయం. అందుకే సీమాంధ్రులను రెచ్చగొడుతున్నాడు. తద్వార సీమాంధ్రలో ఆందోళనలు పెంచి తెలంగాణ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

డబ్బులు వసూలు చేసుకునేందుకు కేసీఆర్ ఉద్యమం చేస్తున్నాడు ?! 
పదవి రానందుకే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ముందుకు తెచ్చాడు ?!
కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో కోట్లు వెనకేసుకున్నాడు ?!
హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులు భయపడేలా చేస్తున్నాడు కేసీఆర్ ?!
వారికి భద్రతలేక తెలంగాణ ఇస్తామంటే భయపడుతున్నారు ?!

ఇవి తరచూ సీమాంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణలో ఉన్న తెలంగాణ వ్యతిరేకులు, సీమాంధ్ర తొత్తులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేసీఆర్ ను ఉద్దేశించి తరచూ చేసే వ్యాఖ్యలు ఇవి. అసలు తెలంగాణ ఉద్యమాన్ని ఇంతవరకూ తీసుకువచ్చింది కేసీఆర్. కేవలం ప్రజాస్వామ్య పద్దతిలో పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యం అని ఆచార్య జయశంకర్ చూపిన మార్గంలో సాగిపోయారు. పార్టీ మొదలు పెట్టిన నాడే ఆయన "రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది..తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది"...సీమాంధ్రులకు భరోసా కోసం.. మీ కాలికి ముల్లు గుచ్చితే నా పంటితో తీస్తా అని అభయం ఇచ్చాడు కేసీఆర్. బతకనీకె వచ్చినోళ్లతో మాకు బాధలేదు...దోచుకోనికె వచ్చినోళ్లతోనే పంచాయితీ. అని ఇలా చాలా విషయాలలో కేసీఆర్ మొదటి నుండి చాలా క్లియర్ గా తెలంగాణ ఉద్యమ ఉద్దేశాలను తేల్చిచెప్పారు.

ఈ క్రమంలో ఎంపీగా ఎన్నికయిన కేసీఆర్ 2004లో కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. దానికి రాజీనామా చేశారు. ఆ తరువాత మళ్లీ తెలంగాణ కోసం రెండు సార్లు రాజీనామా చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమాన్ని భూస్థాపితం చేయడానికి వైఎస్ చేయని కుట్ర లేదు. 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేసి కేసీఆర్ మానసిక స్థైర్యం మీద దెబ్బకొట్టే ప్రయత్నం  చేశాడు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో తెలంగాణ కొరకు రాజీనామా చేసిన వారిని గెలవనీయకుండా చేసి ఉద్యమం లేదనే పరిస్థితిని తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఇక 2009 ఎన్నికల్లో తెలంగాణకు పోవాలంటే పాస్ పోర్ట్ అని తన మనసులో ఉన్న విషాన్ని కక్కేశాడు. 

2004లో అధికారంకోసం వైఎస్ టీఆర్ఎస్ పంచనజేరి అధికారం వచ్చాక తెలంగాణ ఉద్యమాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నిస్తే..2009లో అదే అధికారం కొరకు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణకు మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజగురువు రామోజీరావు, ఈనాడు పత్రిక సూచనతో అధికారం ఖాయం అని భావించి టీఆర్ఎస్ ను పురిట్లోనే ముంచేందుకు విఫలయత్నం చేశాడు. 46 స్థానాలలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు 36 స్థానాలలో పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా తన పార్టీ నేతలకు బీ ఫాం లు ఇచ్చి నంగనాచి కబుర్లు చెప్పాడు. చంద్రబాబు ఎంత మోసగాడో ఇది ఓ పెద్ద ఉదాహరణ. 

బాబు మోసంతో టీఆర్ఎస్ భారీగా నష్టపోవడం, ఆ తరువాత కొన్నాళ్లకే వైఎస్ మరణం పక్కనబెడితే కేసీఆర్ వెంటనే తెలంగాణ కొరకు తీసుకున్న ఆమరణ దీక్ష మూలంగా తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు డిసెంబరు 7, 2009న మద్దతు ఇచ్చిన తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు డిసెంబరు 10, 2009న అంటే కేవలం మూడురోజులకే పిల్లిమొగ్గలు వేశారు. కేంద్రం తెలంగాన ప్రకటించగానే చంద్రబాబు ఇంత పెద్దనిర్ణయం ఎవరికీ
చెప్పకుండా ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. ఇక చిన్నజీవి చిరంజీవి సమైక్య నినాదం ఎత్తుకున్నాడు. ఇక అప్పటి నుండి తెలంగాణల తెలుగుదేశం జెండా ఎక్కడికక్కడ పీకుకుంటూ వస్తున్నా ఇంకా బానిస భావాలు పోని నేతలు చంద్రబాబును నమ్ముకుంటూ వస్తున్నారు. 2009 తరువాత తెలంగాణ ఉద్యమం, విద్యార్థులు, తెలంగాణ కొరకు ఆత్మబలిదానాలు చేసుకున్నవారు ఇలా అడుగు అడుగునా కేసీఆర్ అందరికీ అండగా నిలిచారు.

కేసీఆర్ నే టార్గెట్ చేసి నిత్యం విమర్శించే తెలంగాణ వ్యతిరేక బ్యాచ్ ఎన్నడూ తెలంగాణ కొరకు పోరాడింది లేదు. ఓ లాఠీదెబ్బ తిన్నది లేదు..తూటాలను అడ్డుకున్నది లేదు. సీమాంధ్ర పెట్టుబడిదారుల తొత్తులు అయిన ఈ బ్యాచ్ ల ఉద్దేశం అంతా ఒక్కటే కేసీఆర్ మీద ఆరోపణల బురద చల్లి తెలంగాణ జనం కేసీఆర్ ను నమ్మకుండా చేయడం.. తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని కనుమరుగు చేయడం. 

ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల ఒక్క అడుగుదూరంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులలో కూడా కేసీఆర్ మీద విమర్శలు మానడం లేదు. కేసీఆర్ కొన్ని సార్లు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కానీ ఆయిన చేసిన దానికి..జరిగిన ప్రచారానికి ఏ మాత్రం పొంతన లేదు. సీమాంధ్ర పత్రికలన్నీ ఎవడు ఎప్పుడు కేసీఆర్ మీద బురదజల్లుతాడా అన్నట్లు ఎదురు చూసిన సంధర్భాలు ఉన్నాయి. అసలు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉంటె ? ఒకవేళ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నుండి తప్పుకుంటే ? ఈ విమర్శకులంతా తెలంగాణ ఉద్యమాన్ని నెలరోజుల్లో చాపచుట్టి..అసలు తెలంగాణ ఉద్యమం అనేదే ఈ ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు. కేసీఆర్ అనే మనిషే ఈ రాష్ట్రంలో లేడు. అని సీమాంధ్ర పత్రికలతో పాఠ్యపుస్తకాలు రచించి ప్రచారం చేయగల సమర్ధులు. ఇది నూటికి వెయ్యిశాతం వాస్తవం. అవునా ? కాదా ?
 



10, అక్టోబర్ 2013, గురువారం

చంద్రబాబుకు ఢిల్లీల ఏం పని ..టీడీపీకి టీ నేతలు విడాకులివ్వాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమయ్యే సమయం దగ్గరకొస్తున్న వేళ..అమరుల త్యాగాలు ఫలిస్తున్న వేళ
సీమాంధ్ర రాబందులు ఒక్కటవుతున్నాయి. భిన్న స్వరాలు వినిపించిన దోపిడీ ముఠాలు..దోపిడీ కోటలు కూలే సమయం వచ్చే సరికి భుజాలు తడుముకుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మోడీ ఆంధ్రప్రదేశ్ కు వస్తానంటే అనుమతివ్వని చంద్రబాబు..మోడీని సాకుగా చూపి ఎన్జీఏకు మద్దతు ఉపసంహరించుకున్న చంద్రబాబు నిస్సిగ్గుగా ఇప్పుడు తెలంగాణను అడ్డుకునేందుకు మోడీ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయనతో గడిపిన క్షణాలను తెలుగు, జాతీయ మీడియాలో భారీ ప్రచారం చేసుకునేందుకు తహతహలాడుతున్నాడు.

తెలంగాణ ఖాయమనుకున్న పరిస్థితుల్లో తెలంగాణకు పూర్తి అండగా ఉన్న బీజేపీని వెనక్కి లాగేందుకు ఢిల్లీలో దీక్ష నాటకం మొదలు పెట్టాడు. తెలుగుజాతి పేరు జెప్పి తెలంగాణను అడ్డుకునే కుట్రలకు తెరలేపాడు. గతంలో తెలంగాణను అడ్డుకున్నది నేనే అని సిగ్గువిడిచి చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు. గతంలో బాబుకు సహకరించిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నాలలో బిజీగా గడుపుతున్నాడు. మొన్నటిదాక తెలంగాణ అన్న ఆయన ఇప్పుడు సీమాంధ్ర సమస్యలను పరిష్కరించిన తరవాతనే తెలంగాణ అని చంద్రబాబు నినాదం ఎత్తుకున్నాడు.

అవకాశం దొరికితే తెలంగాణనే రాకుండా చేయడం..అంతవరకు సాధ్యం కాకుంటే  హైదరాబాద్ ను తెలంగాణకు కాకుండా చేయడం ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు కార్యాచరణ కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా తెలంగాణ తెలుగుదేశం నేతలు మానం ..అభిమానం వదిలేసి చంద్రబాబు చుట్టూ గింగిరాలు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీకి మద్దతు, సీమాంధ్ర ఎంపీలతో సహకరించేలా చేస్తాం అని బీజేపీ అధిష్టానానికి ఆశపెట్టి వచ్చే శీతాకాల సమావేశాలలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా చేసేలా పథకం రచిస్తున్నారు.

ఢిల్లీ కేంద్రంగా దీక్ష నాటకం మొదలు పెట్టిన చంద్రబాబు ఇతర రాష్ట్రాల పార్టీలకు ఇంతకుముందు తనకు ఉన్న పరిచయాలతో తన బలం ఇదని బీజేపీకి ప్రదర్శిస్తున్నాడు చంద్రబాబు. 2009లో రాజీనామాల డ్రామాతో తెలంగాణను అడ్డుకుని వెయ్యిమంది బలిదానాలకు కారణం అయిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే ప్రయత్నాలలో ఉన్నాడు. తెలంగాణ సమాజం ఈ కుట్రలను అడ్డుకునేందుకు సిద్దం కావాలి. తెలంగాణ వస్తున్న తరుణంలో నోటికాడి కూడా జారిపోకుండా చూసుకోవాలి. చంద్రబాబుతో బహిరంగంగా ఇంతవరకు జై తెలంగాణ అనిపించలేని తెలుగుదేశం నేతలు ఆ పార్టీలో ఉండి ఏం సాధిస్తారు.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలను నిలదీయండి. చంద్రబాబు దీక్ష సీమాంధ్ర సమస్యల పరిష్కారం కోసమే అయితే.."తెలంగాణ ఇవ్వండి..సీమాంధ్ర సమస్యలు పరిష్కరించండి" అనే నినాదంతో దీక్ష కొనసాగించమని డిమాండ్ చేయండి. లేకపోతే తెలుగుదేశం పార్టీకి తెలంగాణ నేతలు విడాకులివ్వాలి. తెలంగాణల ఆ పార్టీని భూస్థాపితం చెయ్యాలి.


8, అక్టోబర్ 2013, మంగళవారం

తెలంగాణ వాదులకు హెచ్చరిక..విజ్ఞప్తి !

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని, అరవై ఏళ్ల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందని సంబరాల్లో ఉన్న

తెలంగాణ వాదులకు హెచ్చరికతో కూడిన విజ్ఞప్తి. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లేదు. సీమాంద్ర పెట్టుబడిదారులతో, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరిగిన ఒప్పందం మేరకు తొమ్మిది జిల్లాల తెలంగాణను ఇచ్చి..హైదరాబాద్ ను ఢిల్లీ తరహా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణకు సంబంధించి క్యాబినెట్ నోట్ లో లేని అంశాలు ఇవి. తెలంగాణ వాదులు ఇప్పుడే తిరగబడి ఈ కుట్రను అడ్డుకోకుంటే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అత్యున్నత స్థాయిలో బహిరంగ రహస్యంగా ఉన్న ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవిగా తెలుస్తున్నాయి

- హైదరాబాద్ ను ఢిల్లీ తరహా ప్రత్యేక రాష్ట్రం చేయడం.
- 40 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక రాష్ట్రం. కేంద్రం చేతిలో రక్షణ బాధ్యతలు.
- హెచ్ ఎం డీ ఎ పరిధి అంతా ఈ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి.
- ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం ఉంది కాబట్టి ఎంఐఎం నుండి అభ్యంతరం లేదు.
- సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆస్తుల అక్రమాలు బయటపడకుండా ఉన్నతస్థాయిలో జరిగిన ఒప్పందం.
- తెలంగాణ వచ్చినా సీమాంధ్ర పెట్టుబడిదారులకు ఎలాంటి భయం అక్కర్లేదు.
- తెలంగాణ ఇచ్చినా సరే హైదరాబాద్ మా పరిధిలో ఉంచాలని వచ్చిన డిమాండ్ మేరకు కాంగ్రెస్ అభయహస్తం.
- హైదరాబాద్ లో భారీ అక్రమాలతో, ప్రభుత్వ అండతో ఆస్తులు కూడగట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, రాజగురువు రామోజీరావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, చిరంజీవి ఇలా ఇతర సీమాంధ్ర పెద్దలుగా చలామణి అవుతున్న..ఆక్రమణ దారులు, భూకబ్జా దారులు అంతా కూడబలుక్కుని కేంద్రంతో రాసుకున్న ఒప్పందం ఇది.
- హైదరాబాద్ లో జగన్ దీక్ష అంతా కాంగ్రెస్ స్కెచ్..ఢిల్లీలో చంద్రబాబు దీక్ష కూడా కాంగ్రెస్ స్కెచ్
- హైదరాబాద్ తో కూడిన తెలంగాణకే తమ మద్దతు అని బీజేపీ చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంకోసం బీజేపీని ఒప్పించేందుకే గత కొన్నాళ్లుగా చంద్రబాబు ఢిల్లీకి తీర్ధయాత్రలు చేస్తున్నారు. తాజా దీక్ష కూడా దాని కోసమే.
- సీమాంధ్రలో ఆందోళనలు, అల్లర్లు అన్నీకాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్నవే.
- ముఖ్యమంత్రి గాండ్రింపులు, అధిష్టానం వ్యతిరేక వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్నవే.
- దిగ్విజయ్ సింగ్ పదవి మాత్రం శాశ్వతమా..అధిష్టానమే నిర్ణయం మార్చుకోవాలి అని ముఖ్యమంత్రి గట్టిగా మాట్లాడడం ఒప్పందంలో భాగమే. ఇంత అన్నా కాంగ్రెస్ ఇంతవరకు ఏమీ అనలేదు. ముఖ్యమంత్రిని కూడా మార్చం అని గట్టిగా చెబుతోంది. ఇక ముఖ్యమంత్రి మీద డీజీపీ వ్యాఖ్యలు చేస్తే ఏకంగా డిగ్గీరాజా లైన్లోకి వచ్చాడు అంటే కాంగ్రెస్ వ్యవహారం అర్ధం చేసుకోవచ్చు.
- మీడియా వర్గాలలో, మీడియా యాజమాన్యాలలో ఈ వార్త ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. కానీ ఎవ్వరూ దీనిని ఓ వార్తగా చూడడం లేదు. ఎందుకంటే తెలంగాణలో వ్యతిరేకత ఇప్పుడే వస్తుందని కావొచ్చు ? లేదా భవిష్యత్ కార్యాచరణ ఇప్పటి నుండే మొదలు పెడతారన్న అనుమానం కావచ్చు ?
- ఏదీ ఏమయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న ప్రకటన ఎంత నిజమో..సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం చేస్తారన్నది కూడా అంతే నిజం అని తెలుస్తోంది. తెలంగాణ వాదులు ఇప్పుడే మేల్కొని కాంగ్రెస్ నేతల మీద గట్టిగా పోరాడకుంటే తెలంగాణ ఇచ్చినా ఒకటే..ఇవ్వకపోయినా ఒకటే.

29, సెప్టెంబర్ 2013, ఆదివారం

సకల జనభేరి with నారన్



సరిగ్గా 22 దినాల కింద ఐద్రవాద్ ల సమైక్య సభ. ఒకడు గొంతు గోస్తన్నడు..ఇంకొంతమంది సమైక్యం అంటు తెలంగాణ అన్న బాల్ రాజ్ మీద దాడి జేసిండ్రు. 50 వేల మంది ఉన్న సమైక్యసభల తెలంగాణ అన్నందుకు చంద్రశేఖర్ (చేగో) మీద దాడి చేశారు. ఖబడ్దార్ అన్న కానిస్టేబుల్ శ్రీను, శ్రీశైలంల మీద దారుణంగా దాడిచేశారు. అసలేం జరుగుతుంది ఐద్రవాద్ ల. తెలంగాణ గడ్డమీద తెలంగాణ వాదుల మీద దాడి. మనగడ్డపై మన అస్తిత్వం కొరకు ఆరాటం. బుర్ర ఖరాబయింది. పానం దిగులువడ్డది. తెలంగాణ స్వేఛ్చా వాయువులు పీల్చేకునే వేల సీమాంధ్ర పెట్టుబడి దారి రాబందులు విషం చిమ్ముతున్నాయి. అసలు ఐద్రవాద్ ల మనకు తిరిగే హక్కే లేదా అన్న అనుమానం.

ఇంతట్లనే సకల జనభేరి. సభకు ఎట్లనన్న పోవాలె.  అట్లనే జయశంకర్ సార్ విగ్రహం తయారయింది తెచ్చుకోవాలె అని అనుకున్న. ఆదివారం పొద్దుగాళ్ల బామ్మర్ధి నారన్ రెడ్డి కలిసి పట్నం ప్రయాణం. నేరుగా రాజేంద్రనగర్ శివరామాచారి స్టూడియో. అక్కడ్నే బిక్ష చేసుకుని జయశంకర్ సార్ విగ్రహం తీసుకుని సకల జనభేరి సభకు బాటవట్టినం. జయశంకర్ సార్ మరణించినప్పుడు ఆయన దినాల నాడు విగ్రహం పెట్టాలె అనుకున్నం. అప్పటికి విగ్రహం పూర్తికావడానికి ఇబ్బంది ఉండె. అట్లనే వాయిదా పడుతూ వస్తుంది. ఓ మంచి సమయం కావాలని చూస్తున్న తెలంగాణ ప్రకటన వచ్చింది. జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయిన రోజున


ఆయన విగ్రహం మా ఊళ్ల పెట్టాలని ఆలోచన.

రాజేంద్ర నగర్ నుండి బహదూర్ పుర, సిటీ కాలేజ్, అఫ్జల్ గంజ్, ఉస్మానియా ఆసుపత్రి, బేగం బజార్, మొజాంజాహి మార్కెట్, అబిడ్స్, నాంపల్లి కలెక్టరేట్ మీదంగ ముందలికి పోయి వాహనం దిగినం. జనం పల్చగ కనిపిస్తున్నరు. నారన్ కు నాకు బుగులు తీసుకున్నది. జనం కనిపిస్తలేరని. సభకు జయశంకర్ సార్ విగ్రహం తీసుకుపోవాల్నా ? వద్దా ? అక్కడికి తీసుకెళ్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్..ప్రచారం తప్ప ఇంకేమీ ఉండదని వాహనంలనే పెట్టినం. నిజాంకాలేజి దగ్గరయితుంటె జనం కనిపించవట్టిండ్రు. మనసుల మెల్లగ సంతోషం మొదలయింది.  (మధ్యాహ్నం 3.30) వీఐపీ గేటుకాడ లోపల్కి తోలాలె అని పోలీసోల్ల తోని తెలంగాణ వాదుల పంచాయితి. మెల్లగా ముందుకు


పోయి గోడ దుంకి లోపలికి పోయినం. ఆ తరువాత ఇంకో గోడ దూకి నిజాం కళాశాల జనసంద్రంలోకి పోయినం. అయినా కూడా జనం తక్కువనే ఉన్నరని మైదానంల తిరిగిన. ఆ మూలకు పోయి ఈ మూలకు వచ్చెటాలకు బయిటికి పోనికె జాగలేదు. లాభం లేదని మల్ల గేటు దుంకి నిజాం కాలేజీ వీఐపీ గేటు దిక్కు పోయినం. సభకు వచ్చినం గానీ ఫోటోలు తీసుకోనికే కెమెరా లేదు. అంతట్లనే ఓ తెలంగాణవాది(సిద్దిపేట)ని అడిగి ఇద్దరం ఓ ఫోటో దిగి మెయిల్ పెట్టమని అడిగనం.

ఇక అక్కడి నుండి మీదకొస్తే తెలంగాణ రేడియో జాకీల హంగామా, కరపత్రాల పంపిణీ, ఆ పక్కనే సమైక్యవాదులను ప్రశ్నించిన చంద్రశేఖర్ ( చేగో) ఫ్లెక్సీ. అటు ఇటు తిరుగుతుంటె తెలంగాణ ఫేస్ బుక్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి కనిపించాడు. పరిచయం చేసుకుంటే నర్సింహ..పీహెచ్ డీ చేస్తున్నానని చెప్పాడు. ఒక్క ఫోటో తీసి మెయిల్ పెట్టమన్నా..తీశాడు. ఆడ్నుంచి మెల్లగ నిజాం కాలేజీ బయటకు వచ్చి వీఐపీ గేటు ముందల నిలవడ్డం. రోడ్డు దాటి ఎల్బీస్టేడియం దిక్కువోతె ఎమ్మార్పీఎస్ సభ్యులు భారీ ఎత్తున తప్పెట్లతోని ఉర్రికొస్తుండ్రు. మనసుల సెప్పలేనంత సంతోషం. ఎగిరి గంతేయాలన్నంత ఉత్సాహం. ఒకరి మొఖాలు ఒకరం సూసి నిండుగా నవ్వుకున్నం. ఆ పక్కనే ఒంటెల మీద యాత్ర. వెనక భారీ డీజే. వందలకొదీ యువకులు తెలంగాణ నినాదాలతో డాన్సులు.

వ్యవసాయశాఖ కమీషనర్ కార్యాలయం ముందుకుపోయినం. నలుగురు చిన్నపిల్లలు. వాళ్ల తండ్రులు. ఇతరులు. మొత్తం పదిమంది దాంక ఉంటరు. హైదరాబాద్ లో పనిచేసే ఉద్యోగులు అని ..పక్కా హైదరాబాదీలని అర్ధం అవుతుంది. నోట్లో పాన్..హైదరాబాద్ యాస..ఆంధ్రా ఉద్యోగుల వివక్షను ..అవహేళనను  అనుభవించారని అర్ధం అవుతుంది. జోరుగా...దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తున్నారు.

పిఠాపురం మీదిరా..హైదరాబాద్ మాదిరా


పెద్దాపురం మీదిరా హైదరాబాద్ మాదిరా
బాడ్కవ్ ల బాడ్కవ్ సీఎం బాడ్కవ్
లుచ్చామె లుచ్చా సీఎం లుచ్చా
అబీ అబీ క్యా హోగయా ..అశోక్ బాబు మర్గయా

జర్ర ఇటు పక్క దిర్గంగనే..డీజేల తెలంగాణ పాట రీమిక్స్

అయ్యోనివా ..అయ్యోనివా...అయ్యోనివా
అయ్యోనివా.. నువ్వు అవ్వోనివా ..తెలంగాణోనికి తోటి పాలొనివా
ఇస్సుంట రమ్మంటే ఇల్లంత నాదంటవా
తిన్నింటి వాసాలు లెక్కెడ్తవ

రాజిగ వొరె..రాజిగ వొరె..రాజిగ వొరె..
రాజిగ వొరె..రాజిగ తెలంగాణ రాజిగ
గజ్జెలు గజ్జెలు రెండు గజ్జలో రాజన్న
సేను వాయె సెలుక వాయె గజ్జెలో రాజన్న

కడపునిండ సంతోషం
తల్లికడుపుల కలియతిరుగుతున్న ఆనందం
వాగు ఉష్కెల దొమ్మరిగంతేసింత ఆనందం
ఆడ్నుంచి మల్ల నిజాం కాలేజీలకు పరుగు. సభ వెనుక వైపుకు.
సాక్షిల పనిచేసే పాత్రికేయమిత్రుడు వర్దెల్లి వెంకటేశ్వర్లు చాలా రోజుల తరువాత కలిశాడు.
సాధక, బాధకాలు..క్షేమ సమాచారాలు తెలుసుకున్నంక
సభ కుడివైపుకు వెళ్లాం. కోదండరాం సార్ ప్రసంగం

తెలంగాణ అంటే న్యాయం
తెలంగాణ అంటే స్వేఛ్చ

మా తెలంగాణ మాకొచ్చె సమయంల కుట్రలు చేయడం మానుకోండి
కాంగ్రెస్ పార్టీ నాన్చుడు దోరణి మానుకుని రెండు ప్రాంతాల మధ్యల విధ్వేశాలు రేగకముందే
తెలంగాణ ఏర్పాటు కార్యక్రమం పూర్తి చేయండి
మా మంచితనం చేతగాని తనం అనుకోవద్దు

ఆ వెంటనే దేశపతి శ్రీనివాస్

సమైక్యాంధ్రోళ్లకు తెలంగాణ గాదు హైద్రవాద్ గావాలే
ఈడ రింగురోడ్డు సుట్టు ఆళ్ల భూములు గావాలే..జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ల ఆస్తులు గావాలె
మీకు పాతబస్తీ వద్దు..అడ్డగుట్ట వద్దు..వారాసిగూడ మురికి వద్దు

ఒక తలపై రూమీ టోపి ..ఒక తలపై గాంధీ టోపి
క్యాభాయ్ అని అటాడొకడు.. ఏమోయని అటాడొకడు
కులాలు మతాలు వేరయినా మనమంతా భాయి భాయి
రిమ్ జిమ్ హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్

ఆ తరువాత కేసీఆర్


తెలంగాణ ఏనుగులాక ..అంతా అయిపోయింది. తోక ఒక్క ఒక్కటె ఇర్కవట్టింది.
దీన్ని ఎంతమంది ఏకమయినా ఆపలేరు.. ఏమీ పీకలేరు
ఆంధ్రబాబు సెంద్రబాబు టర్నింగులెన్ని ? జగన్ పార్టీ సమన్యాయం ఏంది ?
న్యాయమే లేదురా అంటే సమన్యాయం ఏంది ?
ఆరిపోయే దీపానికి ఎల్తురెక్కువ..కిరణ్ పరిస్థితి గుడ గంతె
నాకు దెల్సిన లెక్క పకారం ఆరు తారీకున అవుట్
ఇగ డీజీపీ పీజులు హైకోర్టు కట్ జేసింది

ప్రసంగం కొనసాగుతుండంగనే మెల్లగ బయటకు వచ్చినం
నిజాం కళాశాల వీఐపీ గేటు ముందు రాత్రి (8.30) రోడ్డు మీద కూసోని
స్క్రీన్ మీద కేసీఆర్ ప్రసగం వినుకుంట జనం భారీ గా ఉన్నరు.
మెల్లగ బండి కాడికొయ్యి ఇంటికొచ్చేటాల్లకు రాత్రి 11.30









29, జనవరి 2013, మంగళవారం

సీల్డ్ కవర్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తాడా !


“ప్రధానమంత్రిని, సోనియాగాంధీని కేసీఆర్ దూషించారని, ఆయన మాటలు విని సిగ్గుపడుతున్నామని అంటున్న నేతలు అసలు ఆయన మాటల్లో తప్పేముందో చెప్పాలి. ఉన్న మాట అంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉలికి పడుతున్నారని” టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. చప్రాసీకి ఉన్న ఆలోచన ప్రధానికి లేదు అన్నారని దానిలో తప్పేముంది ? అందులో వ్యక్తిగత దూషణ  ఏముంది ? అని అన్నారు. ఈ దేశంలోని పౌరులందరూ సమానమేనని, చప్రాసీలంటే కాంగ్రెస్ నేతలకు చులకనా అని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల మనసుల్లో మెలుగుతున్నవేనని, షిండే, ఆజాద్ ప్రకటన తెలంగాణ ప్రజల గుండెల్లో మంటపెట్టిందని, అది అనుభవించిన వారికి తెలుస్తుందని ఆయన అన్నారు. సీల్డ్ కవర్ సీఎం అయిన కిరణ్ కేసీఆర్ విమర్శిస్తాడా ? స్థానిక ఎన్నికలు పెట్టే ధైర్యం లేని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నిస్తాడా ? దమ్ముంటే మున్సిపత్, పంచాయతీ ఎన్నికలు పెట్టు అని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
సోనియాగాంధీ రాచి రంపాన పెడుతుంది అన్నారు అందులో తప్పేముంది అని ప్రశ్నించారు. ఇందిగాంధీ హయాంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కాల్పులు జరిపి 369 మంది తెలంగాణ బిడ్డలను పొట్టన బెట్టుకున్నాడని అదే విషయం కేసీఆర్ చెప్పారని అన్నారు. కేసీఆర్ ఓ ప్రాంతానికి నేత అని అంటున్న నేతలకు 2004 లో కేసీఆర్ ఇంటికి వచ్చి గులాం నబీ ఆజాద్ పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు ? అన్నది గుర్తులేదా ? వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ కు ప్రాణం పోసింది కేసీఆర్ కాదా అని అన్నారు. ఆ రోజు ఈ చిన్న నేత కేసీఆర్ ఇంటికి ఎందుకు వచ్చారు. ఎందుకు ప్రశ్నించలేదు అని అన్నారు. కేసీఆర్ ఏమయినా కోల్ స్కాంకు పాల్పడ్డాడా ? కామన్వెల్త్ కుంభకోణానికి పాల్పడ్డాడా ? 2జి స్కాంకు పాల్పడ్డాడా ? కేవలం తెలంగాణ ప్రజలకోసం తెలంగాణ అడుగుతున్నాడు. మా హక్కుల గురించి మాట్లాడితే, మా అన్యాయం గురించి మాట్లాడితే మీకు సంస్కారం, సంస్కృతి గుర్తొస్తుందా ? అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ ను వేధించేందుకు కేసులు అని అంటున్నారని అన్నారు.
తెలంగాణ గురించి రాజీనామా చేయమంటే తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి చుట్టూ చేరి కేసీఆర్ మీద కేసులకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 2009 ఎన్నికల్లో తెలంగాణలో ఎన్నికలు ముగియగానే నంధ్యాల సభలో వైఎస్ తెలంగాణకు వెళ్లాలంటే వీసా కావాలని, పాస్ పోర్ట్ కావాలని వైఎస్ అన్నాడు. ఈ దేశంలో ఉన్న తెలంగాణకు వీసా, పాస్ పోర్ట్ తీసుకువెళ్లాలన్న వైఎస్ ది దేశద్రోహం కాదా ? ఆరోజు వైఎస్ మీద కేసులు ఎందుకు పెట్టలేదు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు అని అన్నారు. అయితే ముఖ్యమంత్రి కుట్రలో తెలంగాణ మంత్రులు భాగస్వాములు కావడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పూ లేదని, కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల తరపున మాట్లాడిందని అందులో ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం లేదని అన్నారు.

4, జనవరి 2013, శుక్రవారం

సీమాంధ్ర మైకులకు పక్షవాతమెందుకో ?


''జనవరి 1 నుండి నా రాజీనామ అమలులో ఉంటుంది. నాకు అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో గానీ, ఎంపీ పదవితో గానీ ఎలాంటి సంబంధం లేదు. జనవరి నుండి నా రాజీనామా అమలులో ఉంటుంది"

కాంగ్రెస్ ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు మాట్లాడిన మాటలు ఇవి. కానీ జనవరి 1 వ తేదీ దాటి నాలుగు రోజులు గడిచినా తాను ఇచ్చిన మాటపై కావూరి కనీసం నోరు కూడా తెరవడం లేదు. తెలంగాణ అంటే తొడగొట్టి మాట్లాడే ఈ పెద్ద మనిషికి తాను ఇచ్చిన వాగ్ధానం గురించి తెలియదా ? ఆయన ఎలాగూ స్వార్ధపరుడు వదిలేద్దాం. మరి సీమాంధ్ర ఛానళ్ల మైకులు, సీమాంధ్ర పత్రికల పెన్నులు ఎందుకు మూగబోయాయో అర్ధం కావడం లేదు. వాటికి ఎందుకు పక్షవాతం వచ్చిందో ఎవరికీ అర్ధం కాదు. ఓ ప్రజా ప్రతినిధి ...అందునా ఎంపీ ఓ ఛాలెంజ్ చేశాక..దాని గడువు దాటాక ఇంతవరకు ఈ పత్రికలు ఆ మాటకు ఎందుకు కట్టుబడ లేదని ఎందుకు ప్రశ్నించవు ?

ఇదే తెలంగాణ చెందిన కేసీఆర్ లేక హరీష్ రావు, కేటీఆర్ లేక మరే ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు అయినా ఇలా ఛాలెంజ్ చేసి మాటతప్పితే ఈ సీమాంధ్ర మైకులు ఇలాగే ఊరుకునేవా ? వెంటబడి మరీ వేధించేవి. దానికి సమాధానం చెప్పినా వ్యతిరేక వార్తలు గుప్పించేవి. నిజంగా ఈ సీమాంధ్ర మీడియాకు సిగ్గుంటే తెలంగాణ సమస్య ఇన్నాళ్లు నలుగుతూ వచ్చేదా ? అందుకే మిత్రులారా బివేర్ ఆఫ్ సీమాంధ్ర మీడియా..బివేర్ ఆఫ్ సీమాంధ్ర నేతలు
జై తెలంగాణ ...జై జై తెలంగాణ