7, డిసెంబర్ 2011, బుధవారం

చెరుకు అరెస్టు అక్రమం : హైకోర్టు



 టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ అరెస్ట్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని గురువారం ఆదేశించింది. సుధాకర్ నిర్బంధం అక్రమమని కోర్టు అభిప్రాయపడింది. కాగా న్యాయస్థానం తీర్పుపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. పీడీయాక్ట్ కింద చెరుకు సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తరువాత దాన్ని నాసా కిందకు మార్చారు. ఈ నెల 6న ప్రభుత్వం సుధాకర్ కు 12  నెలల నిర్భంధం విధిస్తూ జీవో వెలువరించింది.
ఒక పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిపై నాసా చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని కోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి బెయిల్ మంజూరు చేసింది. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ గోపాల్‌రెడ్డి, జస్టిస్ కాంతారావుతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చింది. చెరుకు సుధాకర్‌పై పెట్టిన కేసుకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి విజయం సాధించిన తెలంగాణ అడ్వకేట్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పు ప్రజాసామ్య విజయమని వర్ణించింది. కిరణ్ సర్కార్‌కు ఇది చెంపపెట్టులాంటి తీర్పని అన్నారు. హైకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

6, డిసెంబర్ 2011, మంగళవారం

ఉద్యమనేతకు 12 నెలల నిర్భంధం


టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు డా. చెరుకు సుధాకర్‌ను మరో 12 నెలలు జైలులో ఉంచాలని ప్రభుత్వం జీవో నం. 5431ని జారీ చేసింది. చెరుకు సుధాకర్ పీడీ యాక్ట్‌పై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణను పూర్తి చేసింది. చెరుకు సుధాకర్ హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 ప్రకారం మరో 12 నెలలు జైలులో ఉంచాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత నెల 3 న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడి నుండి వరంగల్ జైలుకు తరలించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను విడుదల చేయాలని తెలంగాణ నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ 48 గంటలపాటు నిరాహారదీక్ష చేశారు. అయినప్పటికి ప్రభుత్వం ఆయనను విడుదల చేయకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొదట పీడీ యాక్టు కింద అరెస్టు చేసి తరువాత నాసా కిందకు మార్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకే సీమాంధ్ర ప్రభుత్వం నిరంకుశంగా నిర్భందించిందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా దీనికి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

23, నవంబర్ 2011, బుధవారం

మూడో రోజూ తెలంగానం


అధిక ధరలు, నల్లధనం, ప్రత్యేక తెలంగాణ నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలు మూడోరోజు కూడా ప్రారంభం

అయిన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. గురువారం ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టాయి. తెలంగాణ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక తెలంగాణ నినాదాలతో లోక్ సభ, రాజ్యసభల్లో గందరగోళం నెలకొంది. సభా కార్యక్రమాలకు సజావుగా కొనసాగేందుకు అవకాశం లేకపోవటంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడ్డాయి. మొదట కేసీఆర్, విజయశాంతి తెలంగాణ నినాదాలు చేయడంతో వెంటనే కాంగ్రెస్, టీడీపీ నేతలు తెలంగాణ నినాదాలు ప్రారంభించారు.

19, నవంబర్ 2011, శనివారం

వైఎస్ బాటలోనే కిరణ్ : హరీష్‌రావు


తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన మైనింగ్, గిరిజన యూనివర్సిటీలు, సైనిక్ స్కూళ్లను ముఖ్యమంత్రి సీమాంధ్ర

 ప్రాంతానికి తరలించారని విమర్శించారు. సమైక్యం అంటూ తెలంగాణ నిధులను తరలించుకుపోతున్న నేతలకు బుద్ధి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మార్గమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.
నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ నిధులను కడప జిల్లాకు తరలిస్తే, ముఖ్యమంత్రి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకు తెలంగాణ నిధులను తరలిస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ నిధులను తరలిస్తూనే కలిసి ఉందామని కథలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణకు వచ్చిన వాటిని తెలంగాణలోనే  ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

18, నవంబర్ 2011, శుక్రవారం

తెలంగాణపై ఎస్సార్సీ వేయం : ఏఐసీసీ


తెలంగాణ సమస్యను, ఎస్సార్సీతో ముడిపెట్టలేమని ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ స్పష్టం చేశారు. రెండు అంశాలను వేరుగా చూడాలని అన్నారు. ఎస్సార్సీ పరిధి నుంచి తెలంగాణను వేరుగా చూస్తున్నామన్నారు. వనరులు, సాధ్యాసాధ్యాల్ని రాష్ట్రాల ఏర్పాటుకు కమిషన్ ప్రతిపాదనలు ఇస్తుందని ఆయన అన్నారు. దేశంలోని చిన్న రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడమే తమ అభిమతమని ఆయన మీడియాతో అన్నారు.
తెలంగాణ సమస్యను ఏఐఐసీసీ ప్రత్యేకంగా పరిగణిస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయట్లేదని ఆయన స్ఫష్టం చేశారు. యూపీ విషయంలో రెండో ఎస్సార్సీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

14, నవంబర్ 2011, సోమవారం

రాజీనామాలు ఇప్పుడు అప్రస్తుతం : ఎర్రబెల్లి


తాము చేసిన రాజీనామాలు ఆమోదించమని స్పీకర్ వద్దకు తామొక్కరమే వెళ్లడం సరికాదని తెలంగాణ

 టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  టీడీఎల్పీ కార్యాలయంలో సీనియర్ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజీనామాల విషయం ప్రస్తుతానికి అనవసర అంశమని అన్నారు. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు మాత్రం అసెంబ్లీకి హాజరు కామన్నారు.
కాంగ్రెస్ తెలంగాణ లీడర్లు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని అంతర్గతంగా ఏమి ఒప్పందం చేసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం టెండర్ల విషయంలో సీఎం స్వయంగా కాగితాలు మారుస్తూ టీఆర్‌ఎస్‌కు టెండర్ దక్కే విధంగా చేశాడని, దీనిని ప్రజల దృష్టికి తీసుకు అందరం రాజీనామాలు చేసి కలిసి ఉద్యమిద్దామంటే , తెలంగాణ కోసం పార్టీ పెట్టిన కేసిఆర్ ఎందుకు కలిసిరావడం లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు.

13, నవంబర్ 2011, ఆదివారం

పరకాల ప్రభాకర్ కు దేహశుద్ది


విశాలాంధ్ర మహాసభ పేరుతో గత కొన్నాళ్లుగా సదస్సులు నిర్వహిస్తున్న మాజీ ప్రజారాజ్యం పార్టీ నేత, జర్నలిస్టు పరకాల ప్రభాకర్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. దీంతో పోలీసులు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, పరకాల ప్రభాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు చంద్రశేఖర్‌ను గోల్కోండ పోలీస్ స్టేషన్‌కు, పరకాలను బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు.  శుక్రవారం బషీర్ బాగ్ లో, అంతకుముందు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో పరకాల నిర్వహించిన సదస్సులు వివాదాస్పదం అయ్యాయి.
తెలంగాణలో సమైక్యాంధ్ర వాదన వినిపించి ప్రజలను ఒప్పిస్తానని, దానికి సహకరించే దమ్ము తెలంగాణ నేతలకు ఉందా ? అని పరకాల ప్రభాకర్ సవాల్ విసిరారు. దీనికి స్పందించిన చంద్రశేఖర్ తన నియోజక వర్గం అయిన వికారాబాద్‌కు వచ్చి తెలంగాణ వాదం లేదని ఒక్కరితో అనిపించినా తాము ఉద్యమం చేయడం మానేస్తామని సవాల్ విసిరారు. ఏబీఎన్ ఆంద్రజ్యోతి చానల్‌లో జరిగిన చర్చల్లో వీరి మధ్య ఈ చర్చ చోటు చేసుకుంది. దీంతో  ఏకీభవించిన పరకాల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నుంచి బయలుదేరుదామని ఒప్పందం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఏబీఎన్ కార్యాలయానికి చేరుకున్న ఇద్దరు వికారాబాద్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. బయట ఉన్న తెలంగాణవాదులు అనూహ్యంగా  పరకాల ప్రభాకర్ పై దాడి చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కొద్దిరోజుల క్రితం ప్రొఫెసర్ జయశంకర్ అబద్దాల కోరు అని పరకాల వాదించారు. దీంతో తెలంగాణ వాదులు దాడికి సిద్దపడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తెలంగాణ వారు సమావేశాలు, సభలు పెట్టుకుట్టామంటే అనుమతులు ఇవ్వని పోలీసులు, ప్రభుత్వం పరకాలకు అనుమతులు ఎందుకు ఇస్తున్నారని టీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టేలా చర్చలు పెడుతున్న పరకాలకు అనుమతులు ఇప్పించి ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందని విమర్శించారు.

పరకాల ఓ పిచ్చి కుక్క


పీఆర్పీలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ.. బీజేపీలో ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ.. ఇప్పుడేమో విశాలాంధ్ర తిరుగుతూ పరకాల ప్రభాకర్ తెలంగాణపై ఓ పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నారని జయశంకర్ సెంటర్ నేత, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాలాంధ్ర కోసం ఇంట్లో కుటుంబ సభ్యులనే ఒప్పించలేని వ్యక్తి తెలంగాణ ప్రజలను ఒప్పిస్తాను అనడం సిగ్గు చేటని అన్నారు.  ప్రొ.జయశంకర్ చెప్పినవి అబద్ధాలు అని నిరూపించినా, తెలంగాణకు వనరుల దోపిడీ జరగలేదని చూపించినా ఉద్యమం నుంచి తప్పుకుంటామని తేల్చి చెప్పారు. ఒక వేళ పరకాల ప్రభాకర్ చెప్పినవి అబద్ధాలు అయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లగడపాటి, రాయపాటి లాంటి వాళ్ల డబ్బు సంచులకు ఆశపడి తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శించారు.

12, నవంబర్ 2011, శనివారం

కళ్లులేని కబోది ప్రధాని : కేసీఆర్


‘‘ప్రజా ఉద్యమాల మీద, ప్రజాస్వామిక మౌలిక విలువల మీద ప్రధానికి గౌరవం లేదు. తెలంగాణ ప్రజల

 ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండి కూడా చూడలేని కబోది ప్రధాని మన్మోహన్ సింగ్’’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు విమర్శించారు. తెలంగాణపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై పై విధంగా ఆయన స్పందించారు.
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్  తెలంగాణ ప్రజల కోపాన్ని రుచిచూస్తుందని హెచ్చరించారు. అన్నిరకాలు పోరాటాలు చేద్దాం. దానికి నేను అండగా ఉంటా. తెలంగాణను సాధించుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రధాని వ్యాఖ్యలను తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం తప్పుపట్టారు. కాంగ్రెస్ కు ఖతం కరో అనే నినాదంతో తాము తెలంగాణ ప్రజల్లోకి వెళ్తామని, అసలు తెలంగాణ సమస్య నిన్న, మొన్నటిది అన్నట్లు ప్రధాని మాట్లాడుతున్నారని విమర్శించారు.

శాంతి, ఏకాభిప్రాయం, తెలంగాణ : ప్రధాని


తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తున్నామని, అంతకంటే ముందు తెలంగాణలో

 శాంతియుత వాతావరణం ఏర్పడాలని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. శనివారం మాల్దీవుల నుండి తిరిగివస్తూ ఆయన ప్రత్యేక విమానంలో మీడియాతో మాట్లాడారు. ”తెలంగాణ చాలా సంక్లిష్టమైన సమస్య. ఏకాభిప్రాయం రావాలని మేం కోరుకుంటున్నాం. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పరిష్కారం అత్యుత్తమమని భావించేలా వుండాలనుకుంటున్నాం. కేవలం తెలంగాణ ఇస్తామని అంగీకరించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేం. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో కల్లోలానికి, అశాంతికి దారి తీస్తుంది.” అని ప్రధాని పేర్కొన్నారు. 
                 తెలంగాణపై కేంద్రం ఏం ఆలోచిస్తున్నదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఈ సమస్యకు తగిన పరిష్కారం కోసం, అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా వుండేలా ఆచరణాత్మక పద్ధతులు, మార్గాలను అన్వేషించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మొత్తానికి మన్మోహన్ మాటలు చూస్తే కాంగ్రెస్ తెలంగాణ సమస్యను నానబెట్టేందుకే సిద్దమయిందని, సీమాంధ్ర పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ అధిష్టానాన్ని బాగానే మేనేజ్ చేస్తున్నారని తేలిపోయింది.

నాగం రాజీనామా ఆమోదం


తెలంగాణ కోసం రాజీనామా చేసిన తెలంగాణ నగారా సమితి నేత,  ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి, మరో టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే  నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిల రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీపై తిరగబడిన ఎమ్మెల్యేలే.
తన రాజీనామాను ఆమోదించాలని, స్పీకర్ ఎందుకు ఆమోదించలేదో ప్రశ్నించాలని డిమాండ్ చేస్తూ నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ హైకోర్టులో మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపలే ఆయన రాజీనామాని స్పీకర్ ఆమోదించారు. ప్రసన్న కుమార్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ కోరింది. దానిని స్పీకర్ తోసిపుచ్చారు.
కాంగ్రెస్ ను వీడి జగన్ పార్టీ వైపు వెళ్లిన 26 మంది ఎమ్మెల్యేల గురించి మాత్రం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిని బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నట్లు తేలిపోయింది.

11, నవంబర్ 2011, శుక్రవారం

రెండో ఎస్సార్సీ అంటే మెరుపు సమ్మె


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండో ఎస్సార్సీ అంటే మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్య క్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులంతా ఉద్యోగులతో కలిసి రావాలని ఆయన డిమాండ్ చేశారు. కొంత మంది తెలంగాణ ప్రజా ప్రతినిధుల వైఖరి వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుందని ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో సకల జనుల సమ్మెను విరమిస్తేనే తెలంగాణ గురించి స్పష్టమయిన ప్రకటన చేస్తామని గులాం నబీ ఆజాద్ సూచించారని, ఆయన విన్నపం మేరకు తాము సకల జనుల సమ్మెను విరమించామని, మళ్లీ తెలంగాణ విషయంలో మోసం చేస్తే సమ్మె చేసేందుకు వెనకడుగు వేయమని హెచ్చరించారు.
దీంతో పాటు  చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించిన బీజేపీ, రెండో ఎస్సార్సీని వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ నేత బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ అంటూ కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని మండిపడ్డారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూర్‌లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి డీకే అరుణను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తెలంగాణ ద్రోహి అయిన డీకే అరుణ వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున తెలంగాణవాదులు నినాదాలు చేశారు. దీంతో రచ్చబండ రసాభాసగా మారింది. 

ఎస్సార్సీ కాలం చెల్లిన మందు : నారాయణ


రెండో ఎస్‌ఆర్‌సి అనేది అవుట్ డేటెడ్ మెడిసిన్ వంటిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.

 విజయవాడలో ఆయన తెలంగాణ అంశంపై మాట్లాడారు. రెండో ఎస్సార్సీయే కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పడానికి ఇన్ని కమిటీలు ? ఇంత కాలయాపన అవసరమా ? అని ఆయన ప్రశ్నించారు.  కాంగ్రెస్‌ది శాడిస్ట్‌ లక్షణమని, అందుకే రాష్ట్రాన్ని ఫుట్‌బాల్‌ ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండో ఎస్‌ఆర్‌సి కాంగ్రెస్ పార్టీ విధానమే అయితే రాష్ట్రంలో మీ పుట్టి మునగడం ఖాయమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల సాయంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.ఈ రాష్ట్రం ఏమైపోయినా సరే కాంగ్రెస్‌ను ఎలా బతికించుకోవాలనేదే ఆ పార్టీ నేతల యోచనగా వుందని అన్నారు. అనిశ్చితి వున్న చోట అభివృద్ధి అసాధ్యమని, కాంగ్రెస్‌ చేసిన రాజకీయ తప్పిదానికి ఆపార్టీ సర్వనాశనం కాక తప్పదన్నారు. తెలంగాణ అంశం వెంటనే తేల్చాలని అన్నారు.

9, నవంబర్ 2011, బుధవారం

కాంగ్రెస్ నోట మళ్లీ ఎస్సార్సీ మాట


తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నోట పాతపాట మరోసారి విన్పించింది. కొత్తగా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ (ఎస్‌ఆర్‌సి) ఒక్కటే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్‌ పార్టీ సూచన ప్రాయంగా వెల్లడించింది. ఢిల్లీలో ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ, బోఫాల్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరు సింగ్‌లు ఒకేసారి ఈ ప్రకటన చేయడం  రాష్ట్రంలో కలకలం సృష్టించింది.                                                                                   దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈనెల 10వ తేదీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం తెలంగాణకు సంబంధించి ఒక ప్రకటన చేస్తారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌ ప్రకటించిన మరునాడే రషీద్‌ అల్వీ ఈ ప్రకటన చేయడం విశేషం. తెలంగాణ సమస్య కూడా ప్రత్యేక కమిషన్‌ ద్వారానే పరిష్కార మవుతుందని రషీద్‌ అల్వీ అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్రాల ఏర్పాటు కోసం డిమాండ్లు వస్తున్న నేప థ్యంలో ప్రత్యేక కమిషన్‌ను నియమించడమొక్కటే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ప్రత్యేక కమిషన్‌ వేయాలి. తెలంగాణ సమస్య కూడా ఇలాంటి కమిషన్‌ ద్వారానే పరిష్కారమవుతుంది. దేశంలో చాలా చోట్ల చిన్న రాష్ట్రాల డిమాండ్‌ వుంది. చిన్న రాష్ట్రాల డిమాండ్‌ దృష్ట్యా ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు అవసరం వుంది. నేను చిన్న రాష్ట్రాల పట్ల కాంగ్రెస్‌ పార్టీ విధానాన్ని చెపుతున్నాను. అందులో మార్పు వుండదు అని ఆయన పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. కేవలం ఒక రాష్ట్రాన్ని దృష్టిలో వుంచుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరగదని స్పష్టంచేశారు. దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం అవసర మన్నారు. అయితే తెలంగాణకు ఇదే సూత్రం వర్తిస్తుందా అన్న అంశంపై రషీద్‌అల్వీ స్పష్టత ఇవ్వలేదు.
తెలంగాణ సమస్య భిన్నమైనదేమీ కాదు. కాకపోతే క్లిష్టమైనది. అంతేగాకుండా ఈ సమస్య చాలా కాలంగా కొనసాగుతున్నది. ఈ అంశాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ పార్ట్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ చూస్తున్నారు. ఈ విషయం గురించి ఆయననే అడిగితే మంచిది. కాకపోతే చిన్నరాష్ట్రాల సమస్య అంతా ఒక్కటేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని ఆయనన్నారు. భోపాల్‌లో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్‌ మాట్లాడుతూ, తెలంగాణతోపాటు చిన్న రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్‌ వైఖరి స్పష్టంగా వుందని చెప్పారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి రెండవ ఎస్సార్సీ ఒక్కటే పరిష్కారమార్గమని ఆయనన్నారు. సమయానుకూలంగా ఎస్సార్సీని ఏర్పాటు చేయడం అవసరమన్నారు.

6, నవంబర్ 2011, ఆదివారం

కోమటిరెడ్డిపై కేసు


మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్లగొండ పోలీసులు 309 సెక్షన్‌కింద ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యింది. అయితే తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ప్రభుత్వం ఆత్మహత్యాయత్నం కేసుపెట్టడాన్ని టీఆర్‌ఎస్ శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఖండించాడు.
ఇంత దుర్మార్గపు చర్యకు పాల్పడిన ప్రభుత్వంలో హోంమంత్రిగా తెలంగాణ ఆడబిడ్డ సబితా ఇంద్రారెడ్డి పని చేయడం తగదన్నారు. ఉద్యమంలో ఉన్నామనే తెలంగాణ మంత్రులు జానారెడ్డి, తదితరులు ఈ కేసు విషయమై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తిసుకునే ప్రభుత్వంలో పనిచేయడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. ప్రజాసామ్యాన్ని ఈ ప్రభుత్వం పోలీసు రాజ్యంగా మార్చిందని ఆరోపించారు.
                                                 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఏడోరోజుకు చేరుకుంది. కోమటిరెడ్డి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. ఉపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమంగా ఉంది. మూత్ర పిండాల నొప్పితో బాధ పడుతున్నారు. పొటాషియం లెవల్స్ దారుణంగా పడిపోయాయి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జగిత్యాల మాజీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శంచారు. కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణ వల్లే కోమటిరెడ్డి దీక్ష చేపట్టారని అన్నారు. తెగించి కొట్లడితేనే తెలంగాణ వస్తుందని జీవన్‌రెడ్డి అన్నారు. నిమ్స్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మేనేజ్‌మెంట్‌లో తెలంగాణ కాంగ్రేస్ నేతలు పడవద్దని సూచించారు

31, అక్టోబర్ 2011, సోమవారం

కోమటిరెడ్డి ‘దీక్షాస్త్ర్రం’


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టనున్నారు. నల్గొండలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో ఆయన చేపట్టనున్న దీక్ష నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు సోమవారం పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయని నేపథ్యంలో కోమటిరెడ్డి తన మంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామాలను సమర్పించారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్టోబర్‌ 2వ తేదీ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్షను కొనసాగిస్తామని ప్రకటించినప్పటికీ సకల జనుల సమ్మె కారణంగా దీక్షను వాయిదా వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై రోడ్‌ మ్యాప్‌ను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఈయన దీక్షా కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు హాజరు కానున్నారు. కోమటిరెడ్డి దీక్ష నేపథ్యంలో నల్గొండ, మునుగోడు, నకిరేకల్‌తో పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి సుమారు లక్షల మందికి పైగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, తెలంగాణ వాదులు తరలి వచ్చేలా ఆయన అనుచర గణం అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిమగ్నమైంది.
నిరాహార దీక్షకు తెలంగాణ జెఎసి, టిఆర్‌ఎస్‌, సుమారు 140కి పైగా ప్రజా, ఉద్యోగ సంఘాల జెఎసిలు ఇప్పటికే మద్దతును ప్రకటించాయి. ఈ దీక్షకు పోలీస్‌ శాఖ పది రోజుల పాటు అనుమతినిచ్చింది.  కోమటిరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామాను సమర్పించి ఆమోదింప చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసన సభ్యులు జిల్లాలో రెండు వర్గాలుగా చీలిపోయారు. ఆమరణ దీక్షను విరమించుకోవాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరినప్పటికి కోమటిరెడ్డి పట్టించుకోలేదు.

28, అక్టోబర్ 2011, శుక్రవారం

బాబూ నీది బినామీ బతుకు : కేసీఆర్

చంద్రబాబు నీది బినామీ బతుకు, బినామీలను పెట్టుకుని బతకాల్సిన ఖర్మ నాకు పట్టలేదు.
దోచుకున్న సొమ్ము, దాచుకున్న ఆస్తులు నా దగ్గర లేవు. దమ్ముంటే అవినీతి మీద చర్చకు రా అంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు టీడీపీ అధినేత  చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గురువారం టీఆర్‌ఎస్ పై, తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
తాను నమస్తే తెలంగాణ దిన పత్రికలో రూ.4 కోట్లు, టీ న్యూస్‌లో రూ. 55 లక్షలు పెట్టుబడులు పెట్టానని తెలిపారు. ఈ డబ్బంతా మాజీ ఎంపీ వినోద్ తమ్ముని వద్ద అప్పు తీసుకున్నానని స్పష్టంచేశారు. తనకు ఉన్నది 24 ఎకరాల భూమేనని, హైదరాబాద్, కరీంనగర్‌లో ఒక ఇళ్లు మాత్రమే ఉందని తెలిపారు. తాను పెట్టిందంతా పూర్తిగా  వైట్ మనీ అని, నమస్తే తెలంగాణ ఎండీకి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు బయట వ్యాపారాలు ఉంటే ఆయన వ్యక్తిగతమని,  దానికి మేం ఏం చేయాలని  ప్రశ్నించారు. బాబులా నల్లధనంతో పెట్టుబడులు పెట్టలేదని విమర్శించారు.
గత ఐదారు రోజులుగా చంద్రబాబు తొట్టిగ్యాంగ్ కారు కూతలు కూస్తుందని,   చంద్రబాబు ఇంటి పేరు నమ్మక ద్రోహం, ఒంటి పేరు నయవంచన, అసలు పేరు కుంభకోణం అని ధ్వజమెత్తారు.   బాబు  అవినీతిపై పుంకానుపుంఖాలుగా పుస్తకాలు వచ్చాయని చెప్పారు. అడుగుదీసి అడుగెస్తే బాబుది బినామీ బతుకు అని అన్నారు. నమస్తే తెలంగాణ పత్రికను చూసి తెలంగాణకు ఒక పత్రిక ఉండొద్దు, మీ బండారం బయటపడొద్దని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు ఆత్మలు అమ్ముకుని బాబు బూటు పాలీష్ చేస్తున్నారని ఆరోపించారు.
యూపీఏలో మంత్రిగా ఉన్నప్పుడు పోలవరంపై సోనియాకు ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. పోలవరంపై నిరంతరం కొట్లాడేది టీఆర్‌ఎస్ పార్టీ అని తెలిపారు. పోలవరంపై హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లాం అని తెలిపారు. టెండర్లు వేసే అలవాటు బాబుకు ఉందన్నారు. చంద్రబాబు ఫోటో పక్కన అన్నాహజారే ఫోటో చూస్తే దయ్యాలు నవ్వుతాయని అన్నారు.

27, అక్టోబర్ 2011, గురువారం

చంద్రబాబు రాజకీయ వ్యభిచారి

కాంగ్రెస్  అన్యాయాలు చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహరెడ్డి విరుచుకుపడ్డారు.
 చంద్రబాబు ముఖ్యమంత్రితో కుమ్మకై తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు.  కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే  బాబును తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. అవినీతి, అక్రమాలు భయటపడుతాయని రహస్యంగా చిదంబరంను కలిసి బాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని అన్నారు. 
చంద్రబాబు ప్రభుత్వ కాలంలో రైతుల అష్టకష్టాలు పడ్డారని, రైతుల నడ్డి విరించింది చంద్రబాబే అని నాయిని ఆరోపించారు. మళ్లీ చంద్రబాబే రైతులపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. తెలంగాణలో చంద్రబాబు పర్యటిస్తే జరుగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని  హెచ్చరించారు. చందాలు వసూలు చేయకుండా చంద్రబాబు పార్టీని నడుపుతున్నారా అని నాయిని ప్రశ్నించారు.
మరోవైపు చంద్రబాబుకు దమ్ముంటే కేసీఆర్ ఆస్తులపై బహిరంగ చర్చలకు రావాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చర్చకు వస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ టీడీపీ నేతలకు దమ్ముంటే బాబును చర్చలకు తీసుకురవాలన్నారు. తామే జూబ్లీ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతుల వంకతో బాబు తెలంగాణ అడుగుపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు దళిత కార్డు అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పప్పెట్ షో ఆడిస్తుంటే ఒక బ్రోకర్, ఒక జోకర్, ఒక పిట్టల దొరలా ఆడుతున్నారన్నారు.

20, అక్టోబర్ 2011, గురువారం

గొంగట్లో తింటూ వెంట్రుకల గురించా ?

‘గొంగడిలో కూర్చోని తింటూ వెంట్రుకలు వస్తున్నాయి’ అంటే ఎలా ?, ప్రస్తుతం మనం ఉన్నది
పెట్టుబడిదారి వ్యవస్థలోనే, ముందు తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక తెలంగాణ అనే విషయం గురించి మాట్లాడవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ప్రజలు మమేకమై పోరాడుతుంటే మందకృష్ణ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు.
తెలంగాణ కోసం చారిత్రాత్మక ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు అండగా నిలవకుండా మంత్రి జానారెడ్డి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ లతో కుమ్మక్కయి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  ఉద్యమం చల్లారిందని సీమాంధ్ర నేతలు హేళన చేస్తుంటే, కేకే వంటి వారు సానుకూల సంకేతాలు అందాయని అవగాహన లేని వ్యాఖ్యలు చేయడంతో ఉద్యమంలో అలజడి నెలకొంటోందన్నారు.
సమయాన్ని బట్టి ఉద్యమ పంథా మార్చాలని పరిస్థితుల దృష్ట్యా ఎత్తుగడలు కూడా మార్చాలని సూచించారు. 2004, 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.గ్రామస్థాయిలో ఉద్యమం జరుగుతోంటే రెండో ఎస్సార్సీ గురించి మాట్లాడమడడమంటే ‘పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడమే’ అని అన్నారు.వస్తున్నాయంటే ఎలా? ప్రస్తుతం పెట్టుబడిదారి వ్యవస్థలోనే ఉన్నామని, రాష్ట్రం సాధించుకున్న తర్వాత సామాజిక తెలంగాణపై చర్చించాలి.’ అని సూచించారు.

విచారణకు సోనియాపై పిటీషన్



తెలంగాణ ప్రజలను సోనియా గాంధీ మోసం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను పాటియాలా కోర్టు విచారణకు స్వీకరించింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్ అనే న్యాయవాది రెండు రోజుల క్రితం పాటియాల కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రోజు పిటిషనర్ వాదిస్తూ సాక్ష్యాలను, అమరవీరుల కుటుంబాల తల్లిదండ్రులను కోర్టులో ప్రవేశపెడుతానని తెలిపారు. మొత్తం 14 అభియోగాలతో నమోదైన పిటిషన్‌ను కోర్టు విచారించింది. కేసును నవంబర్ 15కు వాయిదా వేసింది.
ఢిల్లీకి టీఎన్‌జీవో నేతలు ?
తెలంగాణలో జరుగుతున్న సకల జనుల సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సమ్మె విరమణ కోసం టీఎన్‌జీవో నేతలను చర్చలకు ఢిల్లీకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. . ప్రధాని, ముఖ్యనేతలతో చర్చలకు ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తమతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలంగాణ ఎన్జీవో నేతలు తెలిపారు. ఉద్యోగులపై రైల్వే యాక్ట్ కింద నమోదైన కేసుల వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించినట్లు వారు చెప్పారు. తమని ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్తుంది అని వస్తున్న వార్తల గురించి తెలియదు అని ఉద్యోగులు తెలిపారు.
సకల జనుల సమ్మె కొనసాగుతుందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్ తెలిపారు. సమ్మె సందర్భంగా తమ ప్రాంత ఉద్యోగులపై పెట్టిన కేసుల వివరాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేశామని ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో సమావేశం తర్వాత స్వామిగౌడ్ విలేకరులతో మాట్లాడారు.

28, సెప్టెంబర్ 2011, బుధవారం

తెలంగాణతో కర్నూలు, అనంతపురం !


తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా చర్చలు జరుపుతోందా ? ముస్లింలు అధికంగా గల కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని ఎంఐఎం పార్టీ పట్టుబడుతుందా ? ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తో మంగళవారం ఎఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్  ఓవైసీ భేటీ అయ్యారా ? అవును ఈ ప్రశ్నలన్నింటికీ కేసీఆర్ తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ, బుధవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.

గతం నుండి రాయలసీమ నేతలు టీజీ వెంకటేష్, జేసీ దివాకర్ రెడ్డిలు తెలంగాణతో కలిపే రాయలసీమను ఉంచాలని, తాము కోస్తాంధ్ర కలిసి ఉండే ప్రసక్తిలేదని అంటున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపడం మూలంగా తెలంగాణకు 147 అసేంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలు సమంగా ఉంటాయి. దీనినే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలుస్తోంది. అయితే ఆంధ్ర ప్రాంతంతో కలిసేందుకు మిగతా సీమ జిల్లాలయిన కడప, చిత్తూరులు సిద్దపడతాయా ? అన్నదే ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో పాటు తెలంగాణ జిల్లాల ప్రజలు సీమ జిల్లాలను కలుపుకునేందుకు అంగీకరిస్తారా ? అన్నది ప్రశ్నార్ధకమే. అయితే రాష్ట్రం  ఇచ్చే ముందు కేంద్రం తనను చర్చలకు పిలుస్తుందని అన్నారు. తలకాయ తెగిపడినా హైదరాబాద్‌ లేని తెలంగాణను అంగీకరించబోమని కేసీఆర్‌ స్పష్టం చేశారు

28, ఆగస్టు 2011, ఆదివారం

రోశయ్య ఆడిన ‘దొంగాట’



కేంద్రం ప్రకటించిన తెలంగాణను అప్పుడు ముఖ్యమంత్రిగా  ఉన్న రోశయ్య అడ్డుకున్నాడా ? తెలంగాణ కొరకు రాష్ట్ర అసేంబ్లీలో తీర్మానం చేసి పంపాలన్న అధిష్టానం సూచనలను పక్కకు పెట్టి తీర్మానం చేయించలేనని తన వ్యూహంలో భాగంగానే అడ్డుకున్నాడా ?  ఒకసారి అసేంబ్లీలో తీర్మానం చేస్తే తెలంగాణ ఏర్పాటు అవుతుందని సుధీర్ఘ రాజకీయ అనుభవం  ఉన్న రోశయ్య గ్రహించాడా ?  అప్పటికి కేవలం అఖిలపక్ష తీర్మానం చేయించి ఢిల్లీకి పంపిన రోశయ్య డిసెంబరు 9న కేంద్రం తెలంగాణను ప్రకటించగానే సీమాంధ్రలో మొదలయిన ఉద్యమంపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపి తిరిగి డిసెంబరు 23న తెలంగాణపై కేంద్రం యూ టర్న్ తీసుకునేలా పథకం వేశాడా ?
అవును ..పైన అనుమానించిన ప్రశ్నలన్నీ అక్షరాల నిజం. కావాలని చెప్పాడా ? లేక తనను అసమర్ధునిగా భావించిన రాష్ట్ర ప్రజలకు తాను అపర చాణక్యుడిని అని చాటుకునేందుకు చెప్పాడా ? సీమాంధ్రలో తన ఇమేజ్ ను పెంచేందుకు చెప్పాడా ? అన్న విషయం పక్కన పెడితే తెలంగాణ రాకుండా రోశయ్య వేసిన పాచిక మాత్రం చాలా గట్టిదే. దీనికి తెరవెనుక చంద్రబాబు సహకారం ఉండి ఉంటుందన్న దానిలోనూ  ఎలాంటి అనుమానాలు ఉండనక్కర లేదు. అయితే ఇన్ని రోజులకు అప్పుడు జరిగిన విషయాన్ని రోశయ్య ఆంధ్రజ్యోతి ఛానల్  ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో వెల్లడించాడు.
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం కోసం 11 రోజులుగా కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టడంతో ఎప్పటి నుండో తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అందుకే దీనిని సోనియాగాంధీ జన్మదిన కానుకగా ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యను తీర్మానం చేసి పంపాలని సూచించింది. అయితే అసేంబ్లీలో తీర్మానం ఒక్కసారి చేస్తే ఎప్పటికయినా ముప్పేనని గ్రహించిన రోశయ్య కేవలం అఖిలపక్ష తీర్మానంతో సరిపెట్టారు. తరువాత తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు.
రాష్ట్రాన్ని విడగొట్టిన ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా జీవితకాలంలో తనకు సీమాంధ్రలో మచ్చ వస్తుందని, భవిష్యత్ తరాలు తనను ఎలా గౌరవిస్తాయోనని భావించిన రోశయ్య మొత్తానికి గొప్పగానే చక్రం తిప్పాడు. మెల్లగా తాను ఆడిన ‘దొంగాట’ను బయటపెట్టాడు.
 తెలంగాణ ప్రజలను మోసంచేసిన రోశయ్య తెలంగాణలో వందలమంది విద్యార్థల  ఆత్మహత్యలకు కారకుడయ్యాడు. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి కాల్పులు జరిపించి తెలంగాణ విద్యార్థులను పొట్టన పెట్టుకుంటే రోశయ్య వెన్నుపోటు పొడిచి తన పని కానిచ్చాడు. మోసం చేసేవాన్ని నమ్మొచ్చు కాని నమ్మించి మోసం చేసేవాన్ని అసలు నమ్మొద్దు జాగ్రత్త మిత్రులారా ? తెలంగాణ  ఉద్యమంలో రాళ్లుంటాయ్..సీమాంధ్ర ముళ్లుంటాయ్. జై తెలంగాణ జై జై తెలంగాణ

27, ఆగస్టు 2011, శనివారం

గర్జించిన ‘గద్వాల’: మార్మోగిన తెలంగాణం


సీమాంధ్ర ముఖ్యమంత్రి పర్యటన తమకు అవసరం లేదని గద్వాలలో తెలంగాణ వాదులు, విద్యార్థులు భారీగా ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు పెట్టినా, కళాశాలలకు తాళాలు వేసినా, తెలంగాణ వాదులను అరెస్టు చేసినా, మంత్రి డీకే అరుణ హెచ్చరించినా  అన్నింటినీ దాటుకుని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి సభలో యువకులకు ఉద్యోగాలు ప్రకటించగానే మా ఉద్యోగాలు మేము చేసుకుంటామని, సీమాంధ్ర పాలన అక్కరలేదని నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలమూరు జిల్లాకు యువ కిరణాలు పథకం కింద రాబోయే మూడేళ్లలో 70 వేల ఉద్యోగాల వస్తాయని చెప్పడంతో  సభలో ఒక్కసారిగ విద్యార్థులు జై తెలంగాణ మా తెలంగాణలో మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం అంటు ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుతగలడంతో వారిని పక్కకు తప్పించండి వారికి ఈ జిల్లాకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేనట్టుంది అంటు నిరసనల మద్యనే తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా  గద్వాల్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం గోబ్యాక్ అంటు నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15మంది విద్యార్థులు కిరోసిన్ డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఉద్రిక్తల నడుమనే ముఖ్యమంత్రి గద్వాల్ చేరుకున్నారు.
తెలంగాణవాదులు సీఎం పర్యటనను వ్యతిరేకిస్తుండటంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ముందస్తుగా విద్యార్థులను, తెలంగాణవాదులను అదుపులోనికి తీసుకున్నారు. విద్యార్థులు బయటకు రాకుండా కళాశాల గేట్లకు తాళాలు వేసారు. 

25, ఆగస్టు 2011, గురువారం

తెలంగాణ ప్రెస్ క్లబ్ ప్రారంభం

తెలంగాణ జిల్లాలలో మొదటి సారిగా మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ తాలూకా  తెలకపల్లి మండలంలో  పత్రికా విలేకరులం అందరం  తమ ప్రెస్ క్లబ్ కు ‘తెలంగాణ ప్రెస్ క్లబ్’ అని నామకరణం చేసి ప్రారంభించాం. బుధవారం దీనిని జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక ఆర్డీఓ మధుసూధన్ నాయక్, డీ ఎస్ పీ జోగు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాబయ్య, పత్రికా మిత్రులు భరత్, విజయ్, శ్రీరాములు ,బాలరాజు, శంకర్, చిలుక శేఖర్ రెడ్డి, రమేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.    జై తెలంగాణ జై జై తెలంగాణ 



21, ఆగస్టు 2011, ఆదివారం

తెలంగాణ ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలి


ఒక వ్యక్తి కోసం రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూసి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘాల నేతలు విఠల్, పాపారావులు అన్నారు. తెలంగాణ కోసం చనిపోయిన 600 మంది అమరవీరుల ఆశయ సాధన కోసం తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక వ్యక్తి కోసం 27 మంది రాజీనామాలు చేస్తుంటే, నాలుగున్నర కోట్ల ప్రజల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎందుకు రాజీనామా చేయటం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ బిడ్డలైతే సెప్టెంబర్ 17న తెలంగాణ జెండాలు ఎగురవేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతి పరుడని, ధనవంతుడని తెహల్కా ఏనాడో చెప్పిందని గుర్తు చేశారు.
జగన్‌పై సీబీఐ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆయన కోసం 27 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుంటే, తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకపోవడం సిగ్గుచేటని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ మండిపడ్డారు.

సీమాంధ్ర పత్రికల విష ప్రచారం షురూ

తెలంగాణ ఉద్యమం చల్లబడిందని సీమాంధ్ర పత్రికలు తమ విష ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించాయి. ఆదివారం సాక్షి దినపత్రిక ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కొద్ది సేపటికే అదే వార్తను కాపీ చేసిన సూర్య దినపత్రిక తన నెట్ ఎడిషన్ లో ఉన్నది ఉన్నట్లుగా అచ్చుకొట్టింది. 
                     తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేయాలని తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బతిమాలుతుంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు సిగ్గుతప్పి జారుకుంటున్నారు. 15౧౫ రోజులు పదవులకు దూరంగా ఉన్న మంత్రులు అదేదో జీవిత సర్వస్వం కోల్పోయినట్లు 14౧౪ఎఫ్ రద్దు చేయగానే చంకలు గుద్దుకుంటూ విధుల్లో చేరిపోయారు. తెలంగాణ ప్రజలరా తిరగబడండి. నేతలను తరిమికొడితేనే సిగ్గొస్తుంది. ఇంటి దొంగలతోనే మనకు ఇక్కట్లు తస్మాత్ జాగ్రత్త.



16, ఆగస్టు 2011, మంగళవారం

పదవి లేకుండా బతకలేo

పదవి లేకుండా బతకలేమని  తెలంగాణ మంత్రులు నిరూపించారు. ప్రజల ఆకాంక్షలకన్నా తమకు పదవులే ముఖ్యమని చాటుకున్నారు. లగడపాటి, కావూరి చెప్పిన మాటలను తెలంగాణ మంత్రులు  నిజం చేసి చూపించారు. కాంగ్రెస్  స్టీరింగ్ కమిటీలో తాము తీసుకున్న నిర్ణయాన్ని తామే అతిక్రమించారు.
తెలంగాణ ప్రాంత మంత్రులు.. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు.  ఒక కోమటిడ్డి వెంకట్‌ రెడ్డి మినహా మిగతా అందరూ హాజరయ్యారు.  మరో మంత్రి శంకర్‌రావు తాను అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అనుమతి తీసుకున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి సూచన మేరకు మంత్త్రులు పదవులు అనుభవించేందుకే కట్టుబడ్డారు.  తెలంగాణ కోసం పదవులు త్యాగం చేస్తామని బీరాలు పలికిన మంత్రులు ఉద్యమం తీవ్ర దశలో ఉన్న తరుణంలో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు.
మరోవైపు   స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న మంత్రి  జానాడ్డి కూడా కేబినెట్ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొనటం తెలంగాణవాదుల్లో ఆగ్రహాం కలిగిస్తోంది. తెలంగాణ విషయంలో మంత్రులకు మొదటి నుంచి చిత్తశుద్ధి లేదు. ప్రజలు గ్రామాలలో తిరగనిచ్చే పరిస్థతిలేకనే పదవులకు దూరమని ప్రకటించినా  ఇళ్లకు ఫైళ్లు తెప్పించుకుని విధులు నిర్వహించారు. ప్రస్తుతం సోనియా అనారోగ్య కారణాలను చూపి తిరిగి విధుల్లో చేరారు. దీనిపై భగ్గుమంటున్న తెలంగాణ వాదులు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఓట్లు వేసేది తెలంగాణ ప్రజలు అన్నది గుర్తుంచుకోవాలని తెలంగాణకు ద్రోహం చేసిన మంత్రులకు భవిష్యత్ లో మిగిలేది రాజకీయ సన్యాసమేనని అన్నారు.

12, ఆగస్టు 2011, శుక్రవారం

14ఎఫ్‌ను తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు


14ఎఫ్‌ను తొలగిస్తూ శుక్రవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా  విడుదలైంది. 14 ఎఫ్ రద్దుతో ఇక హైదరాబాద్ ఫ్రీజోన్ కాకుండా ఆరో జోన్ పరిధిలోకి రానుంది. ఆరో జోన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఎస్‌ఐ రాతపరీక్షలకు ముందు రోజే కేంద్రం 14ఎఫ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.  సీఎం కార్యాలయంకు సమాచారం అందినట్లు అధికారులు ప్రకటించారు.
14ఎఫ్‌ రద్దుకోసం గత కొన్నేళ్లుగా తెలంగాణలో  ఆందోళనలు సాగుతున్నాయి. గత కొంతకాలంగా అవి తీవ్ర రూపం దాల్చాయి. దీంతో కేంద్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది.  ఈ నెల 13, 14న రాష్ట్రంలో ఎస్సై రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే  14ఎఫ్‌ రద్దు చేయనిదే పరీక్షలు  రాసేది లేదని తెలంగాణ వాదులు పట్టుబట్టారు.  ఈ నేపథ్యంలో కేంద్రం తొందరగా స్పందించి పరీక్షలకు ముందే ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే అసేంబ్లీ తీర్మానం చేయడంతో నిర్ణయం తొందరగా వెలువడింది.
తెలంగాణ ప్రజల చారిత్రక విజయం
14ఎఫ్ తొలగింపు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేయటం తెలంగాణ ప్రజలు సాధించిన చారిత్రక విజయం అని తెలంగాణ విద్యార్థి, రాజకీయ, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఇదే స్ఫూర్తితో తెలంగాణను కూడా సాధించుకుంటామని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు, రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల, నాయకుల ఐక్యతకు నిదర్శనమని అని నాగం జనార్ధనరెడ్డి అన్నారు.  తెలంగాణ సాధించేవరకు ఈపోరాటం కొనసాగుతుందని తెలిపారు.

6, ఆగస్టు 2011, శనివారం

వురి కొయ్యకు వేలాడిన వీరుడా
వుద్యఃమం సంగతి మరిచావా ?
చావే సమస్యకు పరిష్కారమనుకుంటే
నాలుగున్నర కోట్ల వురితాళ్ళు వొకే చోట పెనవేద్దాం
నేతలు చస్తే తెలంగాణ వస్తుందనుకుంటే
తెలంగాణ నేతలందర్ని పాతరేద్దాం
కానీ యిది సమస్యకు పరిష్కారం కాదని నీకు తెలుసు
m tech చదివిన నీవే చావు పరిష్కారమనుకుంటే
తెలంగాణ ప్రజలు యేమై పోవాలి
నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులు యేం కావాలి
తెలంగాణ తల్లికి గర్భశోకం మిగిలిస్తావా
తెలంగాణ సాయుధ పోరాటంలో
ఖాశీం రజ్వీలు వున్నారు
షోయబుల్లాఖాన్ లు వున్నారు
పోరాటం మన పుట్టుక..పోరాటం మన వూపిరి
జైపాల్ రెడ్డిని తరమడానికి
దానం, ముఖేష్ లాంటి ద్రోహులను గెంటడానికి
దామోదర రాజనర్సింహ, యెర్రబెల్లి, దేవేందర్ గౌడ్ లను దునుమాడేందుకు,
తెలంగాణను యెచ్చిడి చేస్తున్న చిదంబరంలను దించేందుకు
వోటు అనే వజ్రాయుధం మనకు వుంది
తెలంగాణ పోరులో నువ్వు కోరుకున్నట్లు
aaKhari అమరుడివి నువ్వేకావాలి
మరే వీరుడు నేలకు వొరగొద్దు

మిత్రులరా తెలంగాణ మన జన్మహక్కు
దాన్ని పోరాడి సాధించుకుందాం జై తెలంగాణ జై జై తెలంగాణ
.....సందీప్ రెడ్డి కొత్తపల్లి @telangana jai www.thovva.blogspot.com

19, జులై 2011, మంగళవారం

seemandhra media siggupadu

తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న ఈ సమయంలో సైతం రాజధాని హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యార్థులలో క్రేజ్ తగ్గడం లేదు. మంగళవారం మెడిసిన్ కౌన్సిలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఉస్మానియా, ఎస్వీ, ఆంధ్రా తదితర అనుబంధ నాలుగు మెడికల్ కళాశాలలో జరుగుతున్నాయి. అయితే విద్యార్థులు చాలామంది ఉస్మానియా మెడికల్ కళాశాలలో చేరేందుకే ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిన ఈ సమయంలో తెలంగాణలోని చాలా మంది విద్యార్థులు విజయవాడ, గుంటూరు, చెన్నై తదితర కళాశాలలో చదవడానికి మక్కువ చూపుతున్నారన్న నేపథ్యంలో మెడికల్ కౌన్సెలింగ్ పైనా ఆ ప్రభావం ఉంటుందని పలువురు భావించారు.

అయితే మెడికల్‌లో టాప్ 20లోని పదహారు మంది విద్యార్థులు ఉస్మానియా మెడికల్ కళాశాలలోనే జాయిన్ అయ్యారు. విజయవాడకు చెందిన మెడికల్ టాప్ ర్యాంకర్ హిమజ సైతం ఉస్మానియాలో జాయిన్ అయింది. ఉస్మానియాలో ఫ్యాకల్టీ బావుంటుందన్న అభిప్రాయంతోనే వారు ఉస్మానియాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ బాగా అభివృద్ధి చెంది హాస్పిటల్స్ బాగా డెవలప్ అయిన నేపథ్యంలో ఉస్మానియాలో చదువుతేనే బావుంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. కాగా ఉస్మానియా తర్వాత ఆంధ్రా మెడికల్ విశ్వవిద్యాలయానికి విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తున్నారు.