11, అక్టోబర్ 2013, శుక్రవారం

కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నుండి తప్పుకుంటే ?!

తెలంగాణకు అడ్డం కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడం కేసీఆర్ కు ఇష్టం లేదు. తెలంగాణ ఇస్తే కేసీఆర్ కు కలెక్షన్లు కావని భయం. అందుకే సీమాంధ్రులను రెచ్చగొడుతున్నాడు. తద్వార సీమాంధ్రలో ఆందోళనలు పెంచి తెలంగాణ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

డబ్బులు వసూలు చేసుకునేందుకు కేసీఆర్ ఉద్యమం చేస్తున్నాడు ?! 
పదవి రానందుకే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ముందుకు తెచ్చాడు ?!
కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో కోట్లు వెనకేసుకున్నాడు ?!
హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులు భయపడేలా చేస్తున్నాడు కేసీఆర్ ?!
వారికి భద్రతలేక తెలంగాణ ఇస్తామంటే భయపడుతున్నారు ?!

ఇవి తరచూ సీమాంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణలో ఉన్న తెలంగాణ వ్యతిరేకులు, సీమాంధ్ర తొత్తులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేసీఆర్ ను ఉద్దేశించి తరచూ చేసే వ్యాఖ్యలు ఇవి. అసలు తెలంగాణ ఉద్యమాన్ని ఇంతవరకూ తీసుకువచ్చింది కేసీఆర్. కేవలం ప్రజాస్వామ్య పద్దతిలో పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యం అని ఆచార్య జయశంకర్ చూపిన మార్గంలో సాగిపోయారు. పార్టీ మొదలు పెట్టిన నాడే ఆయన "రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది..తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది"...సీమాంధ్రులకు భరోసా కోసం.. మీ కాలికి ముల్లు గుచ్చితే నా పంటితో తీస్తా అని అభయం ఇచ్చాడు కేసీఆర్. బతకనీకె వచ్చినోళ్లతో మాకు బాధలేదు...దోచుకోనికె వచ్చినోళ్లతోనే పంచాయితీ. అని ఇలా చాలా విషయాలలో కేసీఆర్ మొదటి నుండి చాలా క్లియర్ గా తెలంగాణ ఉద్యమ ఉద్దేశాలను తేల్చిచెప్పారు.

ఈ క్రమంలో ఎంపీగా ఎన్నికయిన కేసీఆర్ 2004లో కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. దానికి రాజీనామా చేశారు. ఆ తరువాత మళ్లీ తెలంగాణ కోసం రెండు సార్లు రాజీనామా చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమాన్ని భూస్థాపితం చేయడానికి వైఎస్ చేయని కుట్ర లేదు. 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేసి కేసీఆర్ మానసిక స్థైర్యం మీద దెబ్బకొట్టే ప్రయత్నం  చేశాడు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో తెలంగాణ కొరకు రాజీనామా చేసిన వారిని గెలవనీయకుండా చేసి ఉద్యమం లేదనే పరిస్థితిని తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఇక 2009 ఎన్నికల్లో తెలంగాణకు పోవాలంటే పాస్ పోర్ట్ అని తన మనసులో ఉన్న విషాన్ని కక్కేశాడు. 

2004లో అధికారంకోసం వైఎస్ టీఆర్ఎస్ పంచనజేరి అధికారం వచ్చాక తెలంగాణ ఉద్యమాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నిస్తే..2009లో అదే అధికారం కొరకు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణకు మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజగురువు రామోజీరావు, ఈనాడు పత్రిక సూచనతో అధికారం ఖాయం అని భావించి టీఆర్ఎస్ ను పురిట్లోనే ముంచేందుకు విఫలయత్నం చేశాడు. 46 స్థానాలలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు 36 స్థానాలలో పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా తన పార్టీ నేతలకు బీ ఫాం లు ఇచ్చి నంగనాచి కబుర్లు చెప్పాడు. చంద్రబాబు ఎంత మోసగాడో ఇది ఓ పెద్ద ఉదాహరణ. 

బాబు మోసంతో టీఆర్ఎస్ భారీగా నష్టపోవడం, ఆ తరువాత కొన్నాళ్లకే వైఎస్ మరణం పక్కనబెడితే కేసీఆర్ వెంటనే తెలంగాణ కొరకు తీసుకున్న ఆమరణ దీక్ష మూలంగా తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు డిసెంబరు 7, 2009న మద్దతు ఇచ్చిన తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు డిసెంబరు 10, 2009న అంటే కేవలం మూడురోజులకే పిల్లిమొగ్గలు వేశారు. కేంద్రం తెలంగాన ప్రకటించగానే చంద్రబాబు ఇంత పెద్దనిర్ణయం ఎవరికీ
చెప్పకుండా ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. ఇక చిన్నజీవి చిరంజీవి సమైక్య నినాదం ఎత్తుకున్నాడు. ఇక అప్పటి నుండి తెలంగాణల తెలుగుదేశం జెండా ఎక్కడికక్కడ పీకుకుంటూ వస్తున్నా ఇంకా బానిస భావాలు పోని నేతలు చంద్రబాబును నమ్ముకుంటూ వస్తున్నారు. 2009 తరువాత తెలంగాణ ఉద్యమం, విద్యార్థులు, తెలంగాణ కొరకు ఆత్మబలిదానాలు చేసుకున్నవారు ఇలా అడుగు అడుగునా కేసీఆర్ అందరికీ అండగా నిలిచారు.

కేసీఆర్ నే టార్గెట్ చేసి నిత్యం విమర్శించే తెలంగాణ వ్యతిరేక బ్యాచ్ ఎన్నడూ తెలంగాణ కొరకు పోరాడింది లేదు. ఓ లాఠీదెబ్బ తిన్నది లేదు..తూటాలను అడ్డుకున్నది లేదు. సీమాంధ్ర పెట్టుబడిదారుల తొత్తులు అయిన ఈ బ్యాచ్ ల ఉద్దేశం అంతా ఒక్కటే కేసీఆర్ మీద ఆరోపణల బురద చల్లి తెలంగాణ జనం కేసీఆర్ ను నమ్మకుండా చేయడం.. తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని కనుమరుగు చేయడం. 

ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల ఒక్క అడుగుదూరంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులలో కూడా కేసీఆర్ మీద విమర్శలు మానడం లేదు. కేసీఆర్ కొన్ని సార్లు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కానీ ఆయిన చేసిన దానికి..జరిగిన ప్రచారానికి ఏ మాత్రం పొంతన లేదు. సీమాంధ్ర పత్రికలన్నీ ఎవడు ఎప్పుడు కేసీఆర్ మీద బురదజల్లుతాడా అన్నట్లు ఎదురు చూసిన సంధర్భాలు ఉన్నాయి. అసలు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉంటె ? ఒకవేళ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నుండి తప్పుకుంటే ? ఈ విమర్శకులంతా తెలంగాణ ఉద్యమాన్ని నెలరోజుల్లో చాపచుట్టి..అసలు తెలంగాణ ఉద్యమం అనేదే ఈ ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు. కేసీఆర్ అనే మనిషే ఈ రాష్ట్రంలో లేడు. అని సీమాంధ్ర పత్రికలతో పాఠ్యపుస్తకాలు రచించి ప్రచారం చేయగల సమర్ధులు. ఇది నూటికి వెయ్యిశాతం వాస్తవం. అవునా ? కాదా ?
 



4 కామెంట్‌లు:

  1. ఇప్పటి పరిస్తుతులలో కేసిఆర్ ఉద్యమం నుంచి తప్పుకున్నా ఉద్యమం ఆగదు!తెలంగాణా ప్రజల రక్తంలో తెలంగాణావాదం జీర్ణించుకుపోయేలా చేశాడు కేసిఆర్!

    రిప్లయితొలగించండి
  2. మన అస్థిత్వాన్ని..ఆత్మగౌరవాన్ని కాపాడుకునేలా పోరుబాట పట్టించడం కేసీఆర్ గొప్పతనమే కదా

    రిప్లయితొలగించండి