30, జూన్ 2012, శనివారం

నల్లమలలో నేను !



ఓ పాత్రికేయ మిత్రుడి కోరిక మేరకు చెంచుల గురించి ఓ కథనం రాసేందుకు తమ్ముడు శివతో కలిసి చాన్నాళ్ల తర్వాత నల్లమలకు శనివారం ఉదయమే బయలుదేరా. మన్ననూరులో పాత్రికేయ మిత్రుడు అంజన్న చేరిక..  అక్కడే టిఫిన్..అక్కడి నుండి నల్లమలకు ప్రయాణం. వెళ్తుంటే దారిలో అటవీ అధికారులు, డీఎఫ్ఓ పలకరింపు.. .ఆ తరువాత ఫరహాబాద్ వ్యూ పాయింట్ కు వెళ్లేదారిలో చెక్ పోస్ట్. అది  తెరిచే ఉంది.

రయ్యిన టూ వీలర్ అడవిలోకి దూసుకెళ్లింది. గార్డులెవ్వరూ లేరు కదా ముందుటే చెబుదామని కొంచెం ముందుకు వెళ్లాం. వెంటనే వెనకనుండి కేకలు..అరుపులు. వెనక్కిరాగానే కొడతాడా అన్నట్లుగా గార్డు మీదకే వస్తున్నాడు. ఎందుకు అంత కోపం అని రూంలోకి వెళ్లి అప్పాపూర్ కు వెళ్తున్నామని చెప్పాం. అప్పాపూర్ కే వెళ్లి రావాలి..అలా కాదని ఫరహాబాద్ వ్యూ పాయింట్ కు వెళ్లారో గార్డు బెదిరింపులు.

 అంతలోనే అంతకుముందు కలిసిన డీఎఫ్ఓ టిఫిన్ చేయడానికే అక్కడికే వచ్చారు. బయట ఆయనతో మా మాటలు మొదలు కాగానే గార్డు మా వైపు చూడడం మానేశాడు. మల్లాపూర్ పెంట పరిస్థితి అడిగితే అది వదిలేసి ‘‘అప్పాపూర్ లో పిల్లలు బడికి రావడం లేదని, అక్కడ ఎవరూ లేరు ..చెంచులు అక్కడ ఎందుకు ఉండడం..పాఠశాల అంతా పశువుల పేడతో నిండింది’’ అని డీఎఫ్ఓ అన్నాడు. అంతే అప్పాపూర్ స్వరూపం అప్పుడే కొంత కళ్ల ముందు మెదులు తుండగానే బండి అడవిలోకి దూసుకెళ్లింది.  ఆరేళ్ల క్రితం అప్పాపూర్ కు ఓ మూడు సార్లు వెళ్లా. అప్పుడు చెంచులు అడవిలోనే ఉండేవారు ఇప్పుడు వారంతా అటవీశాఖలో ఉద్యోగులయ్యారు. కొంచెం చురుగ్గా ఉండే యువకులను అధికారులు అటవీ వాచర్లుగా మార్చేశారు. ఇక అడవి అంతటా వారే.


 దట్టమయిన అడవి. అడవిలో నాలుగు కిలోమీటర్లు వెళ్లగానే ఫరహాబాద్ కు బండి మళ్లే మలుపులో అడవి కోళ్ల స్వాగతం..ఆ తరువాత మరో నాలుగు కిలోమీటర్లు పుల్లాయపల్లి ఇంకా రెండు కిలోమీటర్లు ఉందనగానే .. గుంపులు..గుంపులుగా జింకలు...ఫోటో తీసుకుందామనే లోపే చెట్లచాటుకు మాయం. చలికాలమా అనిపించేలా ఉదయం 9 గంటలకు చల్లటిగాలి...నల్లమల ఎందుకో ఈ సారి కొత్తగా అనిపించింది. గతంలో కంటే కొత్తగా..మరింత చిక్కగా...డీఎఫ్ఓ శంకరన్ పుణ్యమే ఇది.

మన్ననూరు దాటాక శ్రీశైలం రహదారిలో కనిపించే ప్రతి అటవీ బోర్డులు, గార్డ్ వాచ్ రూం లు,  ఫరహాబాద్ వ్యూ పాయింట్ వద్ద నిర్మించిన గది, ఇతర ప్రతి అభివృద్ధి అంతా శంకరన్ శ్రమ ఫలితమే. ఎక్కడో తమిళనాడుకు చెందిన ఆయన కుటుంబం సికింద్రాబాద్ లో స్థిరపడ్డా ఆయన పుట్టింది మాత్రం ..రెండో ప్రపంచ యుద్ద సమయంలో బర్మాలో జన్మించారు. ఆయన అచ్చంపేట డీఎఫ్ఓగా రావడం నల్లమల చేసుకున్న పుణ్యం. ఆయన వచ్చాకే స్వేచ్చగా నల్లమల అడవుల్లో తిరిగ స్మగ్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఈనాడులో పనిచేస్తున్నప్పుడు ఆయనను కలిసిన సమయాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నా.

నలుగురు చెంచు మహిళలు వెనక ఏదయినా వాహనం వస్తుందా అని అడిగారు. రావడం లేదు ఎక్కడి కెళ్తున్నారు అని ప్రశ్నించాం. పుల్లాయపల్లి అని చెప్పారు. మరి కొంత ముందుకు వెళ్లగానే  ఓ వ్యక్తి చేతిలో గొడ్డలితో మీదకు వస్తున్నట్లే అనిపించాడు. అంతలోపే మా బండి అతడిని దాటేసింది. పుల్లాయపల్లి గుడిసెలు..ఆ తరువాత అప్పాపూర్ దారి కొంత దెబ్బతింది. మరో మూడు కిలోమీటర్లు వెళ్లగానే అప్పాపూర్ కనిపించింది. ఛాన్నాళ్ల తరువాత వెళ్తున్నా అక్కడి వాతావరణం అడుగు పెట్టగానే అర్ధం అయింది.

పెంట అంతా స్మశాన నిశ్శబ్దం. మెల్లగా ముందుకు వెళ్తే అరుగుమీద నల్లమూతుల వెంకటయ్య పడుకుని ఉన్నాడు. పక్కనే ఇల్లు అలుకుతూ అమ్మాయి. ఏకాదశి కదా చెంచులు శివభక్తులు అందుకే అలుకుతున్నారు. వెంకటయ్యతో మాట కలిపి మాట్లాడుతుండగానే తోకల ఈదయ్య, గురువయ్యలు వచ్చి చేరారు. ఈదయ్య వచ్చి ‘‘మీడియా వాళ్లు చాలామంది వచ్చి వెళ్తున్నారు. కానీ ఎవరూ మా వ్యవసాయం గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ 30 ఎకరాల పట్టాభూమి ఉంది. బోర్లు వేయిస్తే వ్యవసాయం చేసుకుంటాం’’ అని అడిగాడు. ఇంత వరకు ఎవరూ అడగని ప్రశ్న.

ఆశ్చర్యం ఇక్కడ ఇంతకు ముందు వ్యవసాయం చేసేవారా అని అడిగా..అవును మా నాన్న వాళ్లు చేసేవారు..బోర్లు వేయిస్తే మేమూ చేసుకుంటాం ఐటీడీఏ వాళ్లు మేం కొంత భరిస్తేనే వాళ్లు కొంచెం భరిస్తాం అంటున్నారు అన్నాడు. అందరూ కలిసివస్తే ఓ సారి  పీఓ దగ్గరికి వెళదాం అన్నాడు మిత్రుడు అంజన్న. ఇలా మాట్లాడుతూనే ఉన్నాం.
 50 ఇళ్లున్న పెంటలో మమ్మల్ని కలిసింది...మేం కలిసి మాట్లాడేందుకు లభించింది వారిద్దరేనా అనిపించింది. వారితో మాట్లాడుతున్నా అడవిలో గొడ్డలితో కనిపించిన అతను వచ్చాడు.

అడవిలో కనిపిస్తే సమాధానం చెప్పకుండా వస్తారా ? మనిషి కనిపిస్తే ఆగి ఎక్కడికెళ్తున్నారో చెప్పరా ? అంత బలుపా మీకు ? అంటూ అరుస్తూనే ఉన్నాడు. వెన్నులో సన్నటి వణుకు ఎందుకు అరుస్తున్నాడో అర్ధంకాలే. చెంచులు నచ్చచెబుతున్నా అతడు వినడం లేదు. తరువాత తెలిసింది అతను కూడా అటవీశాఖలో చేరిన వాచర్ అని.

అక్కడి నుండి ఒకతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని తెలిస్తే వెళ్లాం అతడు లేడు. పక్క గుడిసె బాగుంటే ఓ ఫోటో తీశా..మా పర్మిషన్ లేకుండా మా గుడిసె ఫోటో తీస్తావా అని కొంచెం మోడ్రన్ గా ఉన్న ఓ చెంచు మహిళ గద్దించింది. నా పక్కన అతన్ని అడిగే తీశానని అతన్ని చూయించా..ఇంకే మనకుండా ఇంట్లోకి వెళ్లింది. అన్ని ఇళ్లూ పరిశీలిస్తూ వెళ్తుంటే ఓ చెట్టుకు కట్టిన చీర ఊయలలో చిన్న పాప తనని తనే ఊపుకుంటోంది. ఆ పక్కనే కుక్కలకు అన్నం పెడితే ఎద్దు వచ్చి తింటోంది దీంతో కుక్కలన్నీ ఎద్దు మీదకు వెళ్లాయి. కొమ్ములతోనే ఎద్దు వాటిని బెదిరిస్తోంది.

మెల్లగా ఆశ్రమ పాఠశాల వద్దకు వెళ్లాం..పాఠశాల ముందు అంతా పేడతో నిండింది. ఇప్పుడు పశువులన్నీ అడవిలోకి వెళ్లినట్లుంది. పాఠశాలలో ఎలాంటి సందడి లేదు. నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాల అయినా ఉపాధ్యాయులు ఎవరూ లేరు. తినడానికి వచ్చే విద్యార్థులకు అన్నం వండిపెట్టారు. ఉపాధ్యాయుల గురించి అడిగితే..అక్కడి వాళ్లు ఇంకా పాఠశాల మొదలుకాలేదని సెలవిచ్చారు.

బయటకు వచ్చాం. అక్కడ ఐదుగురు పిల్లలు. రాళ్లను గోటీలలా గుండ్రంగా తయారు చేసి వాటితోనే ఆడుతున్నారు. వెంబడున్న వారికి థ్యాంక్స్ చెప్పి బయలుదేరాం..మద్యలో పుల్లాయపల్లి. పుల్లాయపల్లికి వెళ్లగానే ఇంటిబయట ఓ కుటుంబం. తల్లి వండుతోంది. తండ్రి నించున్నాడు. పిల్లలు అన్నం పెట్టుకుని కూరకోసం వెయిటింగ్. మమ్మల్ని చూడగానే దూరంగా ఉన్న అటవీ వాచర్లు దగ్గరికి వచ్చారు. వచ్చిన ఇద్దరు మేం మాట్లాడుతున్న గురువయ్య, ఆయన తమ్ముడి కొడుకులే. గురువయ్య కూతురు మూతినిండా పుళ్లయ్యాయి. మందులు తీసుకోలేదా అని అడిగాం నిన్ననే మన్ననూరు వెళ్లి వచ్చామని సమాధానం. అడవిలో పులులున్నాయా ? అని వాచర్లను అడిగాం ఉన్నాయని చెప్పారు. పులులు మనుషుల మీదకు వస్తాయా ? అని గురువయ్యను అడిగాం. రావు..నరుడు నా కంట పడవద్దని పులి ప్రతిరోజూ సూర్యనమస్కారం చేస్తుందని చెప్పాడు.


ఇంటి ముందు దూరంగా అందంగా మర్రిచెట్టు. ఇంటి పక్క చెట్టుకింద రోలు ..రోకలి. అక్కడి బయలుదేరగానే పక్కనే ఉన్న అటవీ గార్డు వాచ్ రూం ముందు మరో వాచర్ ఆపేశాడు. ఆగండి అని సైగ చేశాడు. ఏంటి అని అడిగాం చెప్పడానికి నోరు తిరగడం లేదు. అర్ధమయింది సారా తాగాడు. జేబులోనుండి ఫోన్ తీశాడు. మీ వాళ్లకు చెప్పే వచ్చాం అని చెప్పాం. లేదు ఆగండి అన్నాడు. అర్ధమయింది ఫోటో తీస్తాడని..ఫోటో తీస్తావా అని అడిగాం ..అవును మీకు ఇబ్బంది ఉండదు..నాకూ ఉండదు అని చెప్పాడు. ఫోటో తీయగానే వెళ్లొచ్చా అని అడిగాం..ఆ వెళ్లు అని తలూపాడు. కొంచె ముందుకు రాగానే ఇంతకు ముందు కనిపించిన చోటే జింకలు. ఫోటో తీసుకుందామనే లోపు మళ్లీ పారిపోయాయి. ఫరహాబాద్ చెక్ పోస్టు వద్దకు వచ్చి రెండు ఫోటోలు దిగగానే కెమెరా బ్యాటరీ లో అని వస్తోంది. హమ్మయ్య పని అయిపోయింది అని తారు రోడ్డుమీదెక్కి మన్ననూరు వచ్చేశాం.











24, జూన్ 2012, ఆదివారం

A MUST READ STORY !


First Rank in State in Secondary School Examination
First Rank in University in Plus Two
First Rank in IIT Entrance Examination
First Rank in All India IIT Computer Science
First Rank in IAS Entrance Examination
First Rank in IAS Training Institute
On passing out from IIT Chennai Mr. Narayanaswamy was offered scholarship by the
prestigious Massachusetts Institute of Technology , USA .. He who came from a
middle class family believed that he had a moral obligation to give something in return
for the lakhs of rupees the government spent on him as an IIT student. He had the
intelligence and conviction to realize that this money came also from the poorest of
the poor – who pay up the excise duty on textiles when they buy cloth, who pay up customs,
excise and sales tax on diesel when they travel in a bus, and in numerous other ways
indirectly pay the government. So he decided to join IAS hoping he could do something
for the people of this country. How many young men have the will power to resist such
an offer from USA ? Narayanaswamy did never look at IAS as a black money spinner as
his later life bears testimony to this fact.
After a decade of meritorious service in IAS, today, Narayanaswamy is being forced
out of the IAS profession. Do you know why?
A real estate agent wanted to fill up a paddy field which is banned under law.
An application came up before Narayanaswamy who was sub collector the,
for an exemption from this rule for this plot of land. Upon visiting the site he
found that the complaint from 60 poor families that they will face water logging
due to the waste water from a nearby Government Medical College if this paddy field
was filled up was correct. Narayanswamy came under intense political pressure but
he did what was right – refused permission for filling up the paddy field. That was his
first confrontation with politicians.
Soon after his marriage his father-in-law closed down a public road to build compound
wall for his plot of land. People approached Narayanaswamy with complaint.
When talking with his own father-in-law did not help, he removed the obstructing wall
with police help. The result, his marriage broke up.
As district Collector he raided the house of a liquor baron who had defaulted Rupees 11 crores
payment to government and carried out revenue recovery. A Minister directly telephoned him
and ordered to return the forfeited articles to the house of the liquor baron.
Narayanswamy politely replied that it is difficult. The minister replied that Narayanaswamy will suffer.
In his district it was a practice to collect crores of rupees for earthen bunds meant for poor farmers,
but which were never constructed. A bill for rupees 8 crores came up before Narayanaswamy.
He inspected the bund. He found it very weak and said that he will pass the bill after the rainy season
to ensure that the bund served the purpose. As expected the earthen bund was too weak to stand
the rain and it disappeared in the rain. But he created a lot of enemies for saving 8 crores public money.
The net result of all such unholy activities was that he was asked to go on leave by the government.
Later such an illustrious officer was posted as “State Co-Ordinator, Quality Improvement Programme for Schools”.
This is what the politician will do to a honest officer with backbone – post him in the most
powerless position to teach him a lesson. Since he found that nothing can be achieved for the people
if he continued with the State Service he opted for central service. But that too was denied on some technical ground.
What will you do when you have a brilliant computer career anywhere in the world you choose with the backing
of several advanced technical papers too published in international journals to your credit?
When you are powerless to do anything for the people, why should you waste your life as the Co-Ordinator for a Schools Programme?
Mr. Narayanaswamy is on the verge of leaving IAS to go to Paris to take up a well paid United Nations assignment.
The politicians can laugh thinking another obstacle has been removed. But it is the helpless people of this
country who will lose – not Narayanaswamy. But you have the power to support capable and honest bureaucrats
like Narayaswamy, G.R.Khairnar and Alphons Kannamthanam who have suffered a lot under self seeking
politicians who rule us. You have even the power to replace such politicians with these kind of people dedicated
to the country. The question is will you do the little you can do NOW? At least a vote or word in support of
such personalities?
THINK ABOUT IT , Ladies and Gentlemen , and PLEASE DO SHARE THIS WITH YOUR FRIENDS !

20, జూన్ 2012, బుధవారం

కొత్తపల్లి జయశంకర కోటి దండాలు

కొత్తపల్లి జయశంకర కోటి దండాలు
వెలిగించారు ఊరూరా ఉద్యమ దీపాలు
సీమాంధ్ర పాలకులా దుర్మార్గాలు 
తన్ని తరిమేసే మెదళ్లకు నేర్పారు ఓనమాలు "2"

పారేటి నీళ్లున్నా..పనిచేసే సత్తువున్నా
ఆరేటి బతుకులా ఆకలి చావులు చూసి
అరవై ఏండ్ల ఆంధ్రుల పాలన మాకొద్దంటూ
వారంలో ఒకరోజు ఉపవాసమున్నారూ "కొత్తపల్లి"

ఆనాడు శంకరుడు లోకమందకారమైతే
జడలో చంద్రుని దాల్చి లోకాన వెలుగునిచ్చే
ఈనాడు తెలంగాణ ఆగమై పోతుంటే
చంద్రశేఖరునితో పోరు నడిపిన గురునివి "కొత్తపల్లి"

ఆ జన్మ బ్రహ్మచర్యం అమ్మ తెలంగాణ కోసం
ఆగని కన్నీళ్ల ఒడవని ముచ్చట చేసి
ఆకాశానికేగినా ఆచార్య దేవరా
అర్పిస్తాం తెలంగాణ సాధించి జోహార్లు "కొత్తపల్లి"

జోహర్ ఆచార్య జయశంకర్ కు
మొదటి వర్ధంతి సంధర్భంగా

మిత్రుడు సింగమోళ్ల విజయ్ అనుమతితో

సందీప్ రెడ్డి కొత్తపల్లి

14, జూన్ 2012, గురువారం

అవినీతిపై ఓ బ్రహ్మండమయిన పిట్ట కథ !


A little Indian Boy wanted Rs50, so he prayed 4 weeks, but nothing happened.
Finally he decided 2 write a letter 2 God requesting Rs50.
When post office staff received a letter addressed 2 God, they forwarded it 2 the President.
President was so amused, she instructed her secretary 2 send the little boy Rs 20.
As she thought Rs50 would be a lot of
money for him.

The little boy was delighted with Rs20 & decided 2 write a thank u note 2 God.
‘Dear God, Thank u very much 4 sending d money. However,
I noticed dat u ev sent it through ‘Rashtrapati Bhavan’ (Through Government Building) & those corrupt donkeys ate my 30 rupees! :D ’
Hope U Will Share It Too !

12, జూన్ 2012, మంగళవారం

ముగ్గురు స్నేహితుల కథ !

ఒక ఊరిలో ఓ మిరప కాయ, ఓ ఉల్లిపాయ, ఓ మంచుముక్క ముగ్గురూ మంచి స్నేహితులు. 

ఒకనాడు ఆ ముగ్గురు ఈతకి వెళ్ళారు. అక్కడ నీళ్ళలో మునిగి మంచుముక్క కరిగిపోయింది. దీంతో తమ స్నేహితుడు పోయాడని ఏడుస్తూ వస్తున్న మిగిలిన ఇద్దరిలో ఒక మిర్చి బండివాడు  వెంటాడి, ఆ మిరప కాయని పిండి లో ముంచి, నూనెలో వేసి హత్య చేశాడు.

దీంతో భయపడి  ఏడుస్తూ ఉల్లిపాయ దేవుడి వద్దకు వెళ్లింది. నా స్నేహితులిద్దరూ చనిపోయారు. వారి కోసం నేను ఏడ్చి ఏడ్చీ అలిశాను. మరి  నా కోసం ఎవరు  ఏడుస్తారు,స్వామీ?" అని అడుగగా ఆ స్వామి "ఉల్లీ, ఇక నుంచీ నిన్ను నీ సంతతిని చంపినవారే ఏడ్చేదరు," అని వరమిచ్చాడట.

6, జూన్ 2012, బుధవారం

ఓ నిజమయిన స్నేహితుడి కథ !



సైన్యంలో ఇద్దరు ప్రాణ స్నేహితు లున్నారు. యుద్ధం జరుగుతుండగా తూటా తగిలి వాళ్ళలో ఒకరు నేలకొరిగిపోయాడు. తన స్నేహితుణ్ణి ఆ స్థితిలో చూసేసరికి మరో సైనికుడికి గుండెను పిండేసే బాధ. అతను ఓ కందకంలో దాక్కున్నాడు. తలపై నుంచి దూసుకుపోతున్న తూటాలు. ఎటు చూసినా తుపాకీ చప్పుళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆ సైనికుడు తన లెఫ్టినెంట్‌ని ఈ విధంగా అడిగాడు.
”సర్‌, నేను అక్కడికెళ్ళి మా మిత్రుణ్ణి తీసుకు వస్తాను.”
”వెళ్ళిరా. కాకపోతే నువ్వక్కడికి వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. మీ స్నేహితుడు ఇప్పటికే చనిపోయి ఉండవచ్చు. లేదా నీ ప్రాణాలే పోవచ్చు” అన్నాడా లెఫ్ట్‌నెంట్‌.
అతని సలహాను లక్ష్యపెట్టకుండా సైనికుడు ముందుకెళ్ళి పోయాడు. ఎలాగోలా మిత్రుని చేరుకోగలిగాడు. అతన్ని తన భుజం మీదకు ఎత్తుకుని వాళ్ళు దాక్కున్న కందకం వైపుకి తీసుకొచ్చాడు. ఇద్దరూ వచ్చి అక్కడ పడ ిపోగానే ఆ ఆఫీసరు దెబ్బతిని పడి ఉన్న సైనికుణ్ణి పరీక్షించాడు. అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు. అతన్ని మోసుకు వచ్చిన మిత్రుడి వైపు జాలిగా చూశాడు.
”నేను ముందే చెప్పాను దీని వల్ల ఏమీ ప్రయోజనం లేదని. ఇప్పుడు చూడు నీ స్నేహితుడేమో చనిపోయాడు. నీకు తగిలిన గాయాలూ అలాంటివే” అన్నాడు.
”కానీ నాకు తృప్తిగా ఉంది సర్‌. అసలు మీ దృష్టిలో ప్రయోజనం అంటే అర్ధం ఏమిటి?
”మరి నీ స్నేహితుడు చనిపోయాడుగా”
”నే నక్కడికి వెళ్ళేటప్పుటికి బతికే ఉన్నాడు సర్‌. వాడు నోరు తెరిచి నువ్వు వస్తావని నాకు తెలుసురా! అన్న ఒక్క మాటచాలు నాకు,” అదే నా దృష్టిలో గొప్ప ప్రయోజనం!!