22, అక్టోబర్ 2013, మంగళవారం

జగన్ సభ.. ఇంటి దొంగల మీద కన్నేయండి

జైలు నుండి వచ్చిన తరువాత మాట దప్పె.. మడ్మదిప్పె బాబు సమైక్యం పేరుతోని పెడ్తున్న ఈడ్కోలు సభకు సీమాంధ్ర నుండి సభకు జనం తీస్కరావాల్నంటే కుదురదని, అంతమంది జనం ఆడ్నుండి రారని తెలిసి తెలంగాణల ఉన్న తన పార్టీ నేతల మీద కన్నేసిండు. సోమవారం అళ్లను పిల్సుకోని సమైక్యసభకు జనాలను తోల్కరమ్మని పురమాయించిండంట. అయితే ఇప్పటికే పార్టీని ఇడ్సిన ప్రముఖ నేతలకు బదులు రెండో తరా నేతలకు ఈ పని అప్పజెప్పిండంట.

ముక్కెంగ మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ పరిధిలోని ఐజ, శాంతినగర్, ఇటిక్యాల, మానవపాడు మండలాలలో, అచ్చంపేట పరిధిలోని అమ్రాబాద్ మండలంలో సీమాంధ్రులు స్థిరపడి ఉన్నారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల, రంగారెడ్డి జిల్లాలో స్థిరపడ్డవారు. నల్లొండ జిల్లా కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాలలో, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ప్రాజెక్టుల కింద స్థిరపడ్డ సీమాంధ్రులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయి.

ఏ దిక్కూ లేక అక్క మొగుడే దిక్కని జగన్ పంచననే పడిఉన్న తెలంగాణ నాయకులం అని చెప్పుకునే కొందరు నేతలు నలుగురిని తీసుకోని పోయి తెలంగాణల సమైక్యవాదం ఉందనిపించే ప్రయత్నాలు జరుగుతున్నయి. ఇక సీమాంధ్ర మైకులకు తెలంగాణ అంటె ఎంత పేమనో మనందరికి తెల్సిందే. అందుకే ఒక్కడు వోయిన లచ్చమందికి సమానం జెయ్యనీకె సూస్తడు. కాబట్టి తెలంగాణల ఉన్న జగన్ వంధిమాగధులకు జర్రంత మంచిగ నచ్చజెప్పి జనాన్ని కూడగట్టె పనులు మానుకోమని కోరండ్రి. పట్నంల జగన్ సభ పెట్టుకుంటె ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఇక్కడి జనాలను తీసుకపోవడమే తప్పు. సీమాంధ్ర నుండి తప్పి కొడితె 25 నుండి 30 వేల మందిని తరలించే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ నాటకానికి తెరలేపారు. ఎక్కడికక్కడ ఉన్న తెలంగాణ వాదులు, తెలంగాణ జేఏసీ ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక మొదలు పెడితె బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి