26, డిసెంబర్ 2012, బుధవారం

చంద్రబాబే వెళ్లాలి ..ముక్కు గిల్లి రావాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సమస్య మీద ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే వ్యూహాత్మకంగా ఈ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరపున ప్రతినిదులు తప్ప పార్టీల రాష్ట్ర అధ్యక్షులు వెల్లడం లేదు. కేవలం దాటవేత ధోరణి రాజకీయ ప్రయోజనాలు తప్ప వీరు  వెళ్లకుండా ఉండడానికి ఎలాంటి కారణాలు లేవు.

పాదయాత్ర ప్రారంభానికి ముందు కేంద్రం వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టాలని ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేవలం తమ పార్టీని ఇరుకున్న పెట్టేందుకే కేంద్రం ఈ అఖిలపక్ష సమావేశం పెట్టిందని పిల్లిమొగ్లు వేస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు తెలంగాణ సమస్య పరిష్కారం పట్ల చిత్తశుద్ది ఉంటే అఖిలపక్ష సమావేశానికి ఢిల్లీ వెళ్లి అక్కడ పట్టుబట్టి కాంగ్రెస్ అభిప్రాయం చెప్పాలని, తమ పార్టీ అభిప్రాయం చెబుతామని బైఠాయించాలి. అంతేగాని ఇక్కడ ఏదో మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాలని అడిగిన తెలంగాణ జేఏసీ ప్రతినిధులు తెలంగాణకు జై అనాలని కోరితే జై కొట్టని చంద్రబాబు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తాడు అనుకోవడం వట్టి భ్రమ.

ఇక పార్లమెంటులో సమైక్య జెండాను ఎత్తుకొని మానుకోట రాళ్ల ఆగ్రహం చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు బాటలోనే ఉంది. వీరికి తెలంగాణకు అనుకూలమని చెప్పి ఓట్లు దండుకునే ఆలోచన తప్పితే ఈ సమస్యను తేల్చి చెప్పాలని డిమాండ్ చేసే బాధ్యతను ఏమాత్రం గుర్తించడం లేదు. తెలంగాణలో వైఎస్ పెంచి పోషించిన పెంపుడు గుర్రాలు ఇప్పుడు వీరికి వంత పాడుతున్నాయి. కొంతమందిని అయితే ప్రబావితం చేయగలరు కాని అందరినీ ప్రభావితం చేయలేరన్న సత్యాన్ని వీరు గుర్తించాలి,

ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తప్ప ఎమ్మెల్యేలు, మంత్రులు అస్సలు తెలంగాణ సమస్యను గుర్తించడం లేదు. ఎంత సేపు ముఖ్యమంత్రి తమ నియోజకవర్గాలకు ఇచ్చే నిధులు, తమకు వచ్చే లాభాల ఆలోచన తప్పితే వీరికి మరో ఆలోచన లేదు. ఇప్పటికే కాలం దాటిపోయింది. అదును దాటినంక ఆలోచన చేసినా ఫలితం ఉండదు. రాజకీయ పార్టీలు తెలంగాణ వైపా ? సీమాంధ్ర వైపా ? ఆ పార్టీలకు వంత పాడుతున్న నేతలు ప్రజల పక్షమా ? లేక సీమాంధ్ర పాలకులు విసిరే ఎంగిలి మెతుకుల పక్షమా ? అలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.

17, డిసెంబర్ 2012, సోమవారం

ఉరికొయ్యలు అమరులకు ఉయ్యాలలు



ఉరికొయ్యలు అమరులకు ఉయ్యాలలు
మీ చితి మంటలు నేతల చలిమంటలు
స్వార్ధపరుల సంపి మనం సాధిద్దం తెలంగాణ ''ఉరికొయ్యలు'' (2)

ఎల్బినగర్ చౌరస్తల శ్రీకాంతుని తొలి మరణం
ఎన్ సీసీ గేటు ముందు యాదన్న బలిదానం
ఉస్మానియ క్యాంపస్ ల ఇషాన్ రెడ్డి తొలిముడుపు
పార్లమెంటు చెట్టుకింద యాదన్న వాంగ్మూలం
ప్రజాస్వామ్య దేశానికి జరిగినట్టి అవమానం ''ఉరికొయ్యలు''

మండుతున్న గుండెలపై చంద్రబాబు పాదయాత్ర
ఎండుతున్న డొక్కలపై షర్మిలదే ప్రస్థానం
మన ఆస్తులు దోచుకున్న జగన్ బాబు జైలు యాత్ర
ఎవడొచ్చిన ఆగుతుంద తెలంగాణ జైత్రయాత్ర
జై తెలంగాణ జై జై తెలంగాణ ''ఉరికొయ్యలు"

మాతృభూమి విముక్తి పోరాటంలో అసువులు బాసిన
తెలంగాణ అమరులకు అశృతర్పణాలతో ఈ పాట అంకితం

సందీప్ రెడ్డి కొత్తపల్లి

21, నవంబర్ 2012, బుధవారం

ఈ ‘షర్మిల’ ఏ ‘వీసా’తో ?


మయసభల ద్రౌపదిలా మీ అయ్య శాసనసభల నవ్విన ఎకిలి నవ్వులు ఇంకా మా కండ్లల్ల మెదులుతనే ఉన్నయి..అధికారం కోసం మా పంచన చేరి..తెలంగాణ డిమాండును ఢిల్లీ పెద్దలకు చెప్పి ఎన్నికల్ల గెలిచినంక పొత్తు పెట్టుకున్న పార్టీని చిలువలు పలువలు చేసి అసలు తెలంగాణ ఊసే లేకుండా చేయాలన్న కుటిలయత్నం మాకు ఇంగా గుర్తుంది.

ఏరు దాటినంక తెప్ప తగలేసినట్లు తెలంగాణల ఓట్లు ముగిసినదాంక ఏం మాట మాట్లాడకుండా నంధ్యాల సభల మీ అయ్య మాట్లాడిన మాటలు మా చెవుల్ల మార్మోగుతనే ఉన్నయి. తెలంగాణకు పోవాల్నంటే.. వీసా కావాల్నంట...హైదరాబాద్ వాళ్ల అయ్య జాగీరంట అని అన్న మాటలు మా గుండెల్ని మండిస్తనే ఉన్నయి. అవును హైద్రవాదు..మా అయ్య జాగీరే...ఇయ్యాల మీరు ...మీ కుటుంబం ఏ వీసా మీద తెలంగాణల తిరగుతున్నరు. అయ్య కోసం చచ్చిండ్రని ఓదార్పు కథలు చెప్పిన మీరు...తెలంగాణ కోసం బలయిన వందల అమరుల కుటుంబాల్లో ఒక్కరినయినా ఓదార్చిండ్రా ?

సీమ కథలు చెబితె నమ్మే చిన్నపిల్లలు ఈడ లేరు..తెలంగాణ ల మీరు యాత్రలు చేయొచ్చు కాని మీరు ఎన్నడయితే ఈ ప్రజలను మోసం చేసిండ్రో అప్పుడే తెలంగాణ ప్రజల గుండెల నుండి వేరు పడ్డరు. మీకు ఇక్కడ ఓదార్పు దొరకదు..ఓట్లు రాలవు...మీ అయ్య పెంచిన వంది మాగధులు ఈడ మీ కోసం వెయిట్ జేస్తున్నరు..మీరు వెంట తెచ్చుకున్న కిరాయి సైన్యం ఉండనే ఉంది ఇంగే ముంది పదండి ముందుకు ...పదండి తెలంగాణ అన్నోడిని పక్కకు తోసుకు..

 జై తెలంగాణ జై జై తెలంగాణ

12, నవంబర్ 2012, సోమవారం

ఎంఐఎం భుజం మీద జగన్ తుపాకి..టార్గెట్ తెలంగాణ !



Disappointed with congress party, Asaduddin Owaisi, president of the All India Majlis-e-Ittehad-ul Muslimeen, member of Parliament, Hyderabad, announcing his party withdrawing support to ruling Congress government in state of Andhra Pradesh and UPA led in Center. Photo: Mohammed Yousuf
ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరణ వెనుక అసలు లక్ష్యం ఏంటి ? తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ఎంఐఎం - జగన్ పార్టీలు చేతులు కలుపుతున్నాయా ? తెలంగాణకు మద్దతు ఇవ్వకుండా అధికారం దక్కించుకునేందుకు మజ్లిస్ ను జగన్ వాడుకుంటున్నాడా ? తెలంగాణ రావడం ఇష్టం లేని ఎంఐఎం జగన్ కు వంత పాడుతుందా ? ఇరువురి లక్ష్యం తెలంగాణను అడ్డుకోవడమే కాబట్టి ముందస్తు వ్యూహం ప్రకారం ఒక్కటవుతున్నారా ?

అవును. మజ్లిస్ భుజం మీద తుపాకి పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు జగన్ పన్నాగం పన్నాడు. ఉద్యమంలో గందరగోళం రేపి, రాష్టంలో శాంతి భద్రతలు దెబ్బతీసి, అధికారం చేజిక్కించుకుని తెలంగాణ ఉద్యమాన్ని తండ్రి వైఎస్ లా అణగదొక్కేందుకు జగన్ రంగం సిద్దం చేశాడు. ఎంఐఎం - జగన్ ల ఇద్దరి లక్ష్యం తెలంగాణ రాకుండా అడ్డుకోవడమే కాబట్టి ఇద్దరూ ఒక్కటయ్యారు.

తెలంగాణ మీద ఎలాంటి వైఖరి చెప్పకుండా జగన్ పార్టీ నాన్చుతోంది. తెలంగాణకు అనుకూలమంటే సీమాంధ్రలో ఓట్లు పడవు. అందుకే తెలంగాణ గురించి ఏమీ చెప్పకుండా ఉద్యమాన్ని అణచాలి. అన్న జైల్లో ఉంటే తియ్యని మాటలతో తల్లి విజయమ్మ తెలంగాణలో తిరుగుతుంటే ఇప్పుడు చెల్లెలు షర్మిల కూడ తెలంగాణ గడ్డమీద పాదయాత్రకు వచ్చి సానుభూతి కూడగట్టుకునేందుకు వస్తోంది. తెలంగాణలో ఎంఐఎం అండతో ఓ మోస్తరు స్థానాలు గెలుచుకుంటే సీమాంధ్రలో గెలిచే స్థానాలతో అధికారం అందుకోవచ్చన్నది జగన్ వ్యూహం.

 జగన్ జైలు నుండి బయటకు వస్తే తెలంగాణ మీద ఏదో ఓ వైఖరి చెప్పాలి. జైలులోనే ఉండి కథ నడిపిస్తే కొరకరాని కొయ్యగా ఉన్న తెలంగాణ మీద ఎలాంటి వైఖరి చెప్పకుండా ఎన్నికలకు వెళ్లొచ్చు. ఇక ఓటర్లలోనూ సానుభూతికి సానుభూతి కలిసి వస్తుంది. అందుకే జగన్ జైలులో ఉండే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే పరిస్థితిని ఏర్పరుస్తున్నాడు. కాంగ్రెస్ నుండి ఓ 10 మందిని లాగితే రాష్ట్రంలో ఎన్నికలు ఖాయం. తెలంగాణ వాదులూ తస్మాత్ జాగ్రత్త...బాప్ ఏక్ నంబరి...బేటా దస్ నంబరి..జై తెలంగాణ జై జై తెలంగాణ

10, నవంబర్ 2012, శనివారం

పరకాల పరాభవం..షర్మిల పాదయాత్ర !


ఎక్కడయినా ఓడిన వారు తమ ఓటమికి  కారణాలు సమీక్షించుకుంటారు. దాదాపుగా అక్కడి పత్రికలు కూడా అదే పని చేస్తాయి. ఆ ఓడిన వ్యక్తిపై గెలిచిన వ్యక్తి ఏ విధంగా గెలిచాడు అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అంతా తిరగబడింది. గెలిచిన వ్యక్తి చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచాడని.. ఓడిన వ్యక్తి మాత్రం దాదాపు గెలిచినంత పనిచేసిందని...అసలు అన్ని ఓట్లు తెచ్చుకోవడం నిజంగా గొప్ప అని స్థుతిస్తున్నాయి.

నిజంగా ఒక్క తెలంగాణ విషయంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పత్రికలు ఈ విధంగా స్పందిచడం..ఇలా వార్తలు రాయడం జరగదేమో. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్థి మొగులూరి భిక్షపతి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది.  ఈ ఓటమిని కొండా సురేఖ జీర్ణించుకుందేమో గాని సీమాంధ్ర పత్రికలకు మాత్రం ఇంకా జీర్ణంకాలేదు. పరకాల ఓడితే తెలంగాణ చాపను చుట్టేయాలని చూసిన ఆ పత్రికలు ఘోర పరాభవం చెందాయి. దాని నుండి అవి భయటపడడం లేదు.

ఇది జరిగిన చాన్నాళ్ల తరువాత ఇప్పుడు ఎందుకు చర్చ అంటే పరకాల చెల్లెమ్మ పళ్లికిలిస్తుంది. సీమాంధ్ర పత్రికలు మళ్లీ మొరుగుతున్నాయి. తెలంగాణ ను నిండా ముంచిన తండ్రిని స్తుతిస్థూ అన్న జగన్ ను అధికార పీఠం ఎక్కించేందుకు వైఎస్ తనయ షర్మిల తెలంగాణ లో పాదయాత్రకు పరుగు పరుగునా వస్తోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు కొడిగడుతున్నా పల్లెత్తు మాట మాట్లాడని వారు ఇప్పుడు అమ్మవారి పాదయాత్ర అడుగులకు మడుగులు వత్తేందుకు సిద్దమవుతున్నారు. తెలంగాణ వాదులు ఎక్కడ పాదయాత్రకు అడ్డుపడుతారోనని సురేఖమ్మ గుండెల్లో గుబులు రేగుతోంది. అందుకే టీఆర్ఎస్ భుజం మీద తుపాకి పెట్టి తెలంగాణ వాదులను హెచ్చరిస్తోంది సురేఖమ్మ. షర్మిలమ్మ పాదయాత్రను అడ్డుకుంటే మా సత్తా చూపిస్తామని.

 జగన్ దండయాత్రను మానుకోట అడ్డుకున్న సంగతి గుర్తుకువచ్చి ఉంటుంది. తుపాకీ కాల్పులను కూడా కంకర రాళ్లతో ఎదుర్కొన్న కరడుగట్టిన తెలంగాణ వాదులు గుర్తుకు వచ్చి ఉంటారు. అందుకే పాదయాత్ర కు ముందే అమ్మ సన్నాహక సమావేశాలు మొదలు పెట్టింది. ‘‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు’’ పాదయాత్ర ఇంకా తెలంగాణలోకి రాక ముందే ఈ పరేషాన్ ఎందుకు ? మీ వైఖరిలో స్పష్టత ఉంటే అడ్డుకుంటారన్న అనుమానాలెందుకు ? గుమ్మడి కాయల దొంగ అనకముందే భుజాలు పట్టుకోవడమెందుకు ?


ఇక సోకాల్డ్ సీమాంధ్ర పత్రికలు అప్పుడే భజన మొదలు పెట్టాయి తెలంగాణ అంతటా నేతలు జగన్ పార్టీలోకి చేరడానికి దండలు పట్టుకుని రెడీగా ఉన్నారని..పరకాలలో  వచ్చిన ఓట్లు చూసి ఆ పార్టీలో చేరడానికి ఉత్సుకత చూపుతున్నారని రాసేస్తున్నాయి. అధికారంకోసం దండయాత్రలు చేస్తున్న సీమాంధ్ర పార్టీలకు ఎలా బుద్ది చెప్పాలో తెలంగాణకు తెలుసు. ముందు సురేఖ అంగబలం, అర్ధబలాలను అణగదొక్కి పరకాలలో తెలంగాణ జెండా ఎలా ఎగిరిందో ఈ సీమాంద్ర పత్రికలు ఒక్కసారి నెమరు వేసుకుంటే తెలంగాణలో భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుందో బోధపడుతుంది. జై తెలంగాణ జై జై తెలంగాణ

22, అక్టోబర్ 2012, సోమవారం

మంద కృష్ణ వేలితో మన కన్ను !


                                         
తెలంగాణ సమస్య మీద ఎలాంటి స్పష్టమయిన హామీ ఇవ్వకుండా తెలంగాణలో తన పాదయాత్రను కొనసాగించడం ఎలా ? ఏ విధంగా ముందుకు వెళితే తన యాత్ర కొనసాగుతుంది ? అన్న విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పాచిక పారింది. వ్యూహాత్మకంగా ఎలాంటి గొడవా లేకుండా తెలంగాణలో ప్రవేశించారు. ఎమ్మార్పీఎస్ ను, మంద కృష్ణ మాదిగను ముందుకు పెట్టి చంద్రబాబు తన పంతం పారించుకున్నారు.
చంద్రబాబుకు మంద కృష్ణ కు లింకేంటని ఆశ్చర్యపోతున్నారా ? అసలు లింకు అక్కడే ఉంది. యాత్రకు నెల ముందే తన యాత్రలో ఎదురయ్యే సమస్యలు, జవాబు చెప్పాల్సిన పలు విషయాలను చర్చించి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చాడు. అలాగే తెలంగాణ గురించి కూడా స్పష్టత ఇస్తానని, ఆ ఒక్కటి తేలిస్తే టీడీపీకి ఎదురే ఉండదని, అందుకే చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తున్నాడని తన అనుకూల మీడియాతో పెద్ద హైప్ సృష్టించాడు చంద్రబాబు. బీసీ డిక్లరేషన్ ప్రకటించాడు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాడు. కానీ తెలంగాణ కు మాత్రం మొండి చేయి చూపాడు. యాత్రకు ముందు తెలివిగా అఖిల పక్షం పెట్టాలని  ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఓ లేఖ రాసి చేతులు దులుపుకున్నాడు.
తెలంగాణ నుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటనలు చేయించి అనంతపూర్ నుండి ప్రారంభించి తెలంగాణ కు వచ్చేశారు. ఈ లోపే చంద్రబాబును  యాత్రలో కలుసుకుని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చిన బాబుకు మద్దతు తెలపడం మా ధర్మం అని చెప్పారు. తెలంగాణలోకి రాగానే తెలంగాణ జేఏసీ, ఇతర నేతలు చంద్రబాబు పాదయాత్రకు అడ్డురాకుండా మాదిగ విద్యార్థి నేతలను రంగంలోకి దింపారు. అవసరం అయితే టీడీపీ శ్రేణులతో పనిలేకుండా జేఏసీ నేతలను వీరే ఎదుర్కొనేలా కార్యక్రమం సిద్దం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం శాంతినగర్ వద్ద తెలంగాణ జేఏసీ నేతలను ఎంఎస్ఎఫ్ నేతలు అడ్డుకున్నారు. ఈ వివాదం నేపథ్యంలోనే వారిని వదిలేసి పోలీసులు జేఏసీ నేతలను అరెస్టు చేశారు. మొత్తానికి మంద కృష్ణ మాదిగను అడ్డుపెట్టుకుని తెలివిగా చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టారు. పాదయాత్రలో ఇక ముందు కూడా తెలంగాణ నిరసనలను ఎమ్మార్పీఎస్ మాత్రమే అడ్డుకునేలా కనిపిస్తోంది. మంద కృష్ణ  వేలితో మన కన్ను పొడిచేందుకు బాబు రంగం సిద్దం చేశాడన్న మాట.

8, ఆగస్టు 2012, బుధవారం

ఆ దుందుబి ఎండినా ఈ దుందుబి ప్రవాహం ఆగొద్దు !

తెలంగాణ ఉద్యమంలో అలుపెరగకుండా ఉద్యమిస్తున్న మిత్రుడు విజయ్ మరింత బాధ్యతతో ఉద్యమంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమాభివందనాలతో అన్న సందీప్ రెడ్డి కొత్తపల్లి.

30, జూన్ 2012, శనివారం

నల్లమలలో నేను !



ఓ పాత్రికేయ మిత్రుడి కోరిక మేరకు చెంచుల గురించి ఓ కథనం రాసేందుకు తమ్ముడు శివతో కలిసి చాన్నాళ్ల తర్వాత నల్లమలకు శనివారం ఉదయమే బయలుదేరా. మన్ననూరులో పాత్రికేయ మిత్రుడు అంజన్న చేరిక..  అక్కడే టిఫిన్..అక్కడి నుండి నల్లమలకు ప్రయాణం. వెళ్తుంటే దారిలో అటవీ అధికారులు, డీఎఫ్ఓ పలకరింపు.. .ఆ తరువాత ఫరహాబాద్ వ్యూ పాయింట్ కు వెళ్లేదారిలో చెక్ పోస్ట్. అది  తెరిచే ఉంది.

రయ్యిన టూ వీలర్ అడవిలోకి దూసుకెళ్లింది. గార్డులెవ్వరూ లేరు కదా ముందుటే చెబుదామని కొంచెం ముందుకు వెళ్లాం. వెంటనే వెనకనుండి కేకలు..అరుపులు. వెనక్కిరాగానే కొడతాడా అన్నట్లుగా గార్డు మీదకే వస్తున్నాడు. ఎందుకు అంత కోపం అని రూంలోకి వెళ్లి అప్పాపూర్ కు వెళ్తున్నామని చెప్పాం. అప్పాపూర్ కే వెళ్లి రావాలి..అలా కాదని ఫరహాబాద్ వ్యూ పాయింట్ కు వెళ్లారో గార్డు బెదిరింపులు.

 అంతలోనే అంతకుముందు కలిసిన డీఎఫ్ఓ టిఫిన్ చేయడానికే అక్కడికే వచ్చారు. బయట ఆయనతో మా మాటలు మొదలు కాగానే గార్డు మా వైపు చూడడం మానేశాడు. మల్లాపూర్ పెంట పరిస్థితి అడిగితే అది వదిలేసి ‘‘అప్పాపూర్ లో పిల్లలు బడికి రావడం లేదని, అక్కడ ఎవరూ లేరు ..చెంచులు అక్కడ ఎందుకు ఉండడం..పాఠశాల అంతా పశువుల పేడతో నిండింది’’ అని డీఎఫ్ఓ అన్నాడు. అంతే అప్పాపూర్ స్వరూపం అప్పుడే కొంత కళ్ల ముందు మెదులు తుండగానే బండి అడవిలోకి దూసుకెళ్లింది.  ఆరేళ్ల క్రితం అప్పాపూర్ కు ఓ మూడు సార్లు వెళ్లా. అప్పుడు చెంచులు అడవిలోనే ఉండేవారు ఇప్పుడు వారంతా అటవీశాఖలో ఉద్యోగులయ్యారు. కొంచెం చురుగ్గా ఉండే యువకులను అధికారులు అటవీ వాచర్లుగా మార్చేశారు. ఇక అడవి అంతటా వారే.


 దట్టమయిన అడవి. అడవిలో నాలుగు కిలోమీటర్లు వెళ్లగానే ఫరహాబాద్ కు బండి మళ్లే మలుపులో అడవి కోళ్ల స్వాగతం..ఆ తరువాత మరో నాలుగు కిలోమీటర్లు పుల్లాయపల్లి ఇంకా రెండు కిలోమీటర్లు ఉందనగానే .. గుంపులు..గుంపులుగా జింకలు...ఫోటో తీసుకుందామనే లోపే చెట్లచాటుకు మాయం. చలికాలమా అనిపించేలా ఉదయం 9 గంటలకు చల్లటిగాలి...నల్లమల ఎందుకో ఈ సారి కొత్తగా అనిపించింది. గతంలో కంటే కొత్తగా..మరింత చిక్కగా...డీఎఫ్ఓ శంకరన్ పుణ్యమే ఇది.

మన్ననూరు దాటాక శ్రీశైలం రహదారిలో కనిపించే ప్రతి అటవీ బోర్డులు, గార్డ్ వాచ్ రూం లు,  ఫరహాబాద్ వ్యూ పాయింట్ వద్ద నిర్మించిన గది, ఇతర ప్రతి అభివృద్ధి అంతా శంకరన్ శ్రమ ఫలితమే. ఎక్కడో తమిళనాడుకు చెందిన ఆయన కుటుంబం సికింద్రాబాద్ లో స్థిరపడ్డా ఆయన పుట్టింది మాత్రం ..రెండో ప్రపంచ యుద్ద సమయంలో బర్మాలో జన్మించారు. ఆయన అచ్చంపేట డీఎఫ్ఓగా రావడం నల్లమల చేసుకున్న పుణ్యం. ఆయన వచ్చాకే స్వేచ్చగా నల్లమల అడవుల్లో తిరిగ స్మగ్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఈనాడులో పనిచేస్తున్నప్పుడు ఆయనను కలిసిన సమయాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నా.

నలుగురు చెంచు మహిళలు వెనక ఏదయినా వాహనం వస్తుందా అని అడిగారు. రావడం లేదు ఎక్కడి కెళ్తున్నారు అని ప్రశ్నించాం. పుల్లాయపల్లి అని చెప్పారు. మరి కొంత ముందుకు వెళ్లగానే  ఓ వ్యక్తి చేతిలో గొడ్డలితో మీదకు వస్తున్నట్లే అనిపించాడు. అంతలోపే మా బండి అతడిని దాటేసింది. పుల్లాయపల్లి గుడిసెలు..ఆ తరువాత అప్పాపూర్ దారి కొంత దెబ్బతింది. మరో మూడు కిలోమీటర్లు వెళ్లగానే అప్పాపూర్ కనిపించింది. ఛాన్నాళ్ల తరువాత వెళ్తున్నా అక్కడి వాతావరణం అడుగు పెట్టగానే అర్ధం అయింది.

పెంట అంతా స్మశాన నిశ్శబ్దం. మెల్లగా ముందుకు వెళ్తే అరుగుమీద నల్లమూతుల వెంకటయ్య పడుకుని ఉన్నాడు. పక్కనే ఇల్లు అలుకుతూ అమ్మాయి. ఏకాదశి కదా చెంచులు శివభక్తులు అందుకే అలుకుతున్నారు. వెంకటయ్యతో మాట కలిపి మాట్లాడుతుండగానే తోకల ఈదయ్య, గురువయ్యలు వచ్చి చేరారు. ఈదయ్య వచ్చి ‘‘మీడియా వాళ్లు చాలామంది వచ్చి వెళ్తున్నారు. కానీ ఎవరూ మా వ్యవసాయం గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ 30 ఎకరాల పట్టాభూమి ఉంది. బోర్లు వేయిస్తే వ్యవసాయం చేసుకుంటాం’’ అని అడిగాడు. ఇంత వరకు ఎవరూ అడగని ప్రశ్న.

ఆశ్చర్యం ఇక్కడ ఇంతకు ముందు వ్యవసాయం చేసేవారా అని అడిగా..అవును మా నాన్న వాళ్లు చేసేవారు..బోర్లు వేయిస్తే మేమూ చేసుకుంటాం ఐటీడీఏ వాళ్లు మేం కొంత భరిస్తేనే వాళ్లు కొంచెం భరిస్తాం అంటున్నారు అన్నాడు. అందరూ కలిసివస్తే ఓ సారి  పీఓ దగ్గరికి వెళదాం అన్నాడు మిత్రుడు అంజన్న. ఇలా మాట్లాడుతూనే ఉన్నాం.
 50 ఇళ్లున్న పెంటలో మమ్మల్ని కలిసింది...మేం కలిసి మాట్లాడేందుకు లభించింది వారిద్దరేనా అనిపించింది. వారితో మాట్లాడుతున్నా అడవిలో గొడ్డలితో కనిపించిన అతను వచ్చాడు.

అడవిలో కనిపిస్తే సమాధానం చెప్పకుండా వస్తారా ? మనిషి కనిపిస్తే ఆగి ఎక్కడికెళ్తున్నారో చెప్పరా ? అంత బలుపా మీకు ? అంటూ అరుస్తూనే ఉన్నాడు. వెన్నులో సన్నటి వణుకు ఎందుకు అరుస్తున్నాడో అర్ధంకాలే. చెంచులు నచ్చచెబుతున్నా అతడు వినడం లేదు. తరువాత తెలిసింది అతను కూడా అటవీశాఖలో చేరిన వాచర్ అని.

అక్కడి నుండి ఒకతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని తెలిస్తే వెళ్లాం అతడు లేడు. పక్క గుడిసె బాగుంటే ఓ ఫోటో తీశా..మా పర్మిషన్ లేకుండా మా గుడిసె ఫోటో తీస్తావా అని కొంచెం మోడ్రన్ గా ఉన్న ఓ చెంచు మహిళ గద్దించింది. నా పక్కన అతన్ని అడిగే తీశానని అతన్ని చూయించా..ఇంకే మనకుండా ఇంట్లోకి వెళ్లింది. అన్ని ఇళ్లూ పరిశీలిస్తూ వెళ్తుంటే ఓ చెట్టుకు కట్టిన చీర ఊయలలో చిన్న పాప తనని తనే ఊపుకుంటోంది. ఆ పక్కనే కుక్కలకు అన్నం పెడితే ఎద్దు వచ్చి తింటోంది దీంతో కుక్కలన్నీ ఎద్దు మీదకు వెళ్లాయి. కొమ్ములతోనే ఎద్దు వాటిని బెదిరిస్తోంది.

మెల్లగా ఆశ్రమ పాఠశాల వద్దకు వెళ్లాం..పాఠశాల ముందు అంతా పేడతో నిండింది. ఇప్పుడు పశువులన్నీ అడవిలోకి వెళ్లినట్లుంది. పాఠశాలలో ఎలాంటి సందడి లేదు. నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాల అయినా ఉపాధ్యాయులు ఎవరూ లేరు. తినడానికి వచ్చే విద్యార్థులకు అన్నం వండిపెట్టారు. ఉపాధ్యాయుల గురించి అడిగితే..అక్కడి వాళ్లు ఇంకా పాఠశాల మొదలుకాలేదని సెలవిచ్చారు.

బయటకు వచ్చాం. అక్కడ ఐదుగురు పిల్లలు. రాళ్లను గోటీలలా గుండ్రంగా తయారు చేసి వాటితోనే ఆడుతున్నారు. వెంబడున్న వారికి థ్యాంక్స్ చెప్పి బయలుదేరాం..మద్యలో పుల్లాయపల్లి. పుల్లాయపల్లికి వెళ్లగానే ఇంటిబయట ఓ కుటుంబం. తల్లి వండుతోంది. తండ్రి నించున్నాడు. పిల్లలు అన్నం పెట్టుకుని కూరకోసం వెయిటింగ్. మమ్మల్ని చూడగానే దూరంగా ఉన్న అటవీ వాచర్లు దగ్గరికి వచ్చారు. వచ్చిన ఇద్దరు మేం మాట్లాడుతున్న గురువయ్య, ఆయన తమ్ముడి కొడుకులే. గురువయ్య కూతురు మూతినిండా పుళ్లయ్యాయి. మందులు తీసుకోలేదా అని అడిగాం నిన్ననే మన్ననూరు వెళ్లి వచ్చామని సమాధానం. అడవిలో పులులున్నాయా ? అని వాచర్లను అడిగాం ఉన్నాయని చెప్పారు. పులులు మనుషుల మీదకు వస్తాయా ? అని గురువయ్యను అడిగాం. రావు..నరుడు నా కంట పడవద్దని పులి ప్రతిరోజూ సూర్యనమస్కారం చేస్తుందని చెప్పాడు.


ఇంటి ముందు దూరంగా అందంగా మర్రిచెట్టు. ఇంటి పక్క చెట్టుకింద రోలు ..రోకలి. అక్కడి బయలుదేరగానే పక్కనే ఉన్న అటవీ గార్డు వాచ్ రూం ముందు మరో వాచర్ ఆపేశాడు. ఆగండి అని సైగ చేశాడు. ఏంటి అని అడిగాం చెప్పడానికి నోరు తిరగడం లేదు. అర్ధమయింది సారా తాగాడు. జేబులోనుండి ఫోన్ తీశాడు. మీ వాళ్లకు చెప్పే వచ్చాం అని చెప్పాం. లేదు ఆగండి అన్నాడు. అర్ధమయింది ఫోటో తీస్తాడని..ఫోటో తీస్తావా అని అడిగాం ..అవును మీకు ఇబ్బంది ఉండదు..నాకూ ఉండదు అని చెప్పాడు. ఫోటో తీయగానే వెళ్లొచ్చా అని అడిగాం..ఆ వెళ్లు అని తలూపాడు. కొంచె ముందుకు రాగానే ఇంతకు ముందు కనిపించిన చోటే జింకలు. ఫోటో తీసుకుందామనే లోపు మళ్లీ పారిపోయాయి. ఫరహాబాద్ చెక్ పోస్టు వద్దకు వచ్చి రెండు ఫోటోలు దిగగానే కెమెరా బ్యాటరీ లో అని వస్తోంది. హమ్మయ్య పని అయిపోయింది అని తారు రోడ్డుమీదెక్కి మన్ననూరు వచ్చేశాం.











24, జూన్ 2012, ఆదివారం

A MUST READ STORY !


First Rank in State in Secondary School Examination
First Rank in University in Plus Two
First Rank in IIT Entrance Examination
First Rank in All India IIT Computer Science
First Rank in IAS Entrance Examination
First Rank in IAS Training Institute
On passing out from IIT Chennai Mr. Narayanaswamy was offered scholarship by the
prestigious Massachusetts Institute of Technology , USA .. He who came from a
middle class family believed that he had a moral obligation to give something in return
for the lakhs of rupees the government spent on him as an IIT student. He had the
intelligence and conviction to realize that this money came also from the poorest of
the poor – who pay up the excise duty on textiles when they buy cloth, who pay up customs,
excise and sales tax on diesel when they travel in a bus, and in numerous other ways
indirectly pay the government. So he decided to join IAS hoping he could do something
for the people of this country. How many young men have the will power to resist such
an offer from USA ? Narayanaswamy did never look at IAS as a black money spinner as
his later life bears testimony to this fact.
After a decade of meritorious service in IAS, today, Narayanaswamy is being forced
out of the IAS profession. Do you know why?
A real estate agent wanted to fill up a paddy field which is banned under law.
An application came up before Narayanaswamy who was sub collector the,
for an exemption from this rule for this plot of land. Upon visiting the site he
found that the complaint from 60 poor families that they will face water logging
due to the waste water from a nearby Government Medical College if this paddy field
was filled up was correct. Narayanswamy came under intense political pressure but
he did what was right – refused permission for filling up the paddy field. That was his
first confrontation with politicians.
Soon after his marriage his father-in-law closed down a public road to build compound
wall for his plot of land. People approached Narayanaswamy with complaint.
When talking with his own father-in-law did not help, he removed the obstructing wall
with police help. The result, his marriage broke up.
As district Collector he raided the house of a liquor baron who had defaulted Rupees 11 crores
payment to government and carried out revenue recovery. A Minister directly telephoned him
and ordered to return the forfeited articles to the house of the liquor baron.
Narayanswamy politely replied that it is difficult. The minister replied that Narayanaswamy will suffer.
In his district it was a practice to collect crores of rupees for earthen bunds meant for poor farmers,
but which were never constructed. A bill for rupees 8 crores came up before Narayanaswamy.
He inspected the bund. He found it very weak and said that he will pass the bill after the rainy season
to ensure that the bund served the purpose. As expected the earthen bund was too weak to stand
the rain and it disappeared in the rain. But he created a lot of enemies for saving 8 crores public money.
The net result of all such unholy activities was that he was asked to go on leave by the government.
Later such an illustrious officer was posted as “State Co-Ordinator, Quality Improvement Programme for Schools”.
This is what the politician will do to a honest officer with backbone – post him in the most
powerless position to teach him a lesson. Since he found that nothing can be achieved for the people
if he continued with the State Service he opted for central service. But that too was denied on some technical ground.
What will you do when you have a brilliant computer career anywhere in the world you choose with the backing
of several advanced technical papers too published in international journals to your credit?
When you are powerless to do anything for the people, why should you waste your life as the Co-Ordinator for a Schools Programme?
Mr. Narayanaswamy is on the verge of leaving IAS to go to Paris to take up a well paid United Nations assignment.
The politicians can laugh thinking another obstacle has been removed. But it is the helpless people of this
country who will lose – not Narayanaswamy. But you have the power to support capable and honest bureaucrats
like Narayaswamy, G.R.Khairnar and Alphons Kannamthanam who have suffered a lot under self seeking
politicians who rule us. You have even the power to replace such politicians with these kind of people dedicated
to the country. The question is will you do the little you can do NOW? At least a vote or word in support of
such personalities?
THINK ABOUT IT , Ladies and Gentlemen , and PLEASE DO SHARE THIS WITH YOUR FRIENDS !

20, జూన్ 2012, బుధవారం

కొత్తపల్లి జయశంకర కోటి దండాలు

కొత్తపల్లి జయశంకర కోటి దండాలు
వెలిగించారు ఊరూరా ఉద్యమ దీపాలు
సీమాంధ్ర పాలకులా దుర్మార్గాలు 
తన్ని తరిమేసే మెదళ్లకు నేర్పారు ఓనమాలు "2"

పారేటి నీళ్లున్నా..పనిచేసే సత్తువున్నా
ఆరేటి బతుకులా ఆకలి చావులు చూసి
అరవై ఏండ్ల ఆంధ్రుల పాలన మాకొద్దంటూ
వారంలో ఒకరోజు ఉపవాసమున్నారూ "కొత్తపల్లి"

ఆనాడు శంకరుడు లోకమందకారమైతే
జడలో చంద్రుని దాల్చి లోకాన వెలుగునిచ్చే
ఈనాడు తెలంగాణ ఆగమై పోతుంటే
చంద్రశేఖరునితో పోరు నడిపిన గురునివి "కొత్తపల్లి"

ఆ జన్మ బ్రహ్మచర్యం అమ్మ తెలంగాణ కోసం
ఆగని కన్నీళ్ల ఒడవని ముచ్చట చేసి
ఆకాశానికేగినా ఆచార్య దేవరా
అర్పిస్తాం తెలంగాణ సాధించి జోహార్లు "కొత్తపల్లి"

జోహర్ ఆచార్య జయశంకర్ కు
మొదటి వర్ధంతి సంధర్భంగా

మిత్రుడు సింగమోళ్ల విజయ్ అనుమతితో

సందీప్ రెడ్డి కొత్తపల్లి

14, జూన్ 2012, గురువారం

అవినీతిపై ఓ బ్రహ్మండమయిన పిట్ట కథ !


A little Indian Boy wanted Rs50, so he prayed 4 weeks, but nothing happened.
Finally he decided 2 write a letter 2 God requesting Rs50.
When post office staff received a letter addressed 2 God, they forwarded it 2 the President.
President was so amused, she instructed her secretary 2 send the little boy Rs 20.
As she thought Rs50 would be a lot of
money for him.

The little boy was delighted with Rs20 & decided 2 write a thank u note 2 God.
‘Dear God, Thank u very much 4 sending d money. However,
I noticed dat u ev sent it through ‘Rashtrapati Bhavan’ (Through Government Building) & those corrupt donkeys ate my 30 rupees! :D ’
Hope U Will Share It Too !

12, జూన్ 2012, మంగళవారం

ముగ్గురు స్నేహితుల కథ !

ఒక ఊరిలో ఓ మిరప కాయ, ఓ ఉల్లిపాయ, ఓ మంచుముక్క ముగ్గురూ మంచి స్నేహితులు. 

ఒకనాడు ఆ ముగ్గురు ఈతకి వెళ్ళారు. అక్కడ నీళ్ళలో మునిగి మంచుముక్క కరిగిపోయింది. దీంతో తమ స్నేహితుడు పోయాడని ఏడుస్తూ వస్తున్న మిగిలిన ఇద్దరిలో ఒక మిర్చి బండివాడు  వెంటాడి, ఆ మిరప కాయని పిండి లో ముంచి, నూనెలో వేసి హత్య చేశాడు.

దీంతో భయపడి  ఏడుస్తూ ఉల్లిపాయ దేవుడి వద్దకు వెళ్లింది. నా స్నేహితులిద్దరూ చనిపోయారు. వారి కోసం నేను ఏడ్చి ఏడ్చీ అలిశాను. మరి  నా కోసం ఎవరు  ఏడుస్తారు,స్వామీ?" అని అడుగగా ఆ స్వామి "ఉల్లీ, ఇక నుంచీ నిన్ను నీ సంతతిని చంపినవారే ఏడ్చేదరు," అని వరమిచ్చాడట.

6, జూన్ 2012, బుధవారం

ఓ నిజమయిన స్నేహితుడి కథ !



సైన్యంలో ఇద్దరు ప్రాణ స్నేహితు లున్నారు. యుద్ధం జరుగుతుండగా తూటా తగిలి వాళ్ళలో ఒకరు నేలకొరిగిపోయాడు. తన స్నేహితుణ్ణి ఆ స్థితిలో చూసేసరికి మరో సైనికుడికి గుండెను పిండేసే బాధ. అతను ఓ కందకంలో దాక్కున్నాడు. తలపై నుంచి దూసుకుపోతున్న తూటాలు. ఎటు చూసినా తుపాకీ చప్పుళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆ సైనికుడు తన లెఫ్టినెంట్‌ని ఈ విధంగా అడిగాడు.
”సర్‌, నేను అక్కడికెళ్ళి మా మిత్రుణ్ణి తీసుకు వస్తాను.”
”వెళ్ళిరా. కాకపోతే నువ్వక్కడికి వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. మీ స్నేహితుడు ఇప్పటికే చనిపోయి ఉండవచ్చు. లేదా నీ ప్రాణాలే పోవచ్చు” అన్నాడా లెఫ్ట్‌నెంట్‌.
అతని సలహాను లక్ష్యపెట్టకుండా సైనికుడు ముందుకెళ్ళి పోయాడు. ఎలాగోలా మిత్రుని చేరుకోగలిగాడు. అతన్ని తన భుజం మీదకు ఎత్తుకుని వాళ్ళు దాక్కున్న కందకం వైపుకి తీసుకొచ్చాడు. ఇద్దరూ వచ్చి అక్కడ పడ ిపోగానే ఆ ఆఫీసరు దెబ్బతిని పడి ఉన్న సైనికుణ్ణి పరీక్షించాడు. అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు. అతన్ని మోసుకు వచ్చిన మిత్రుడి వైపు జాలిగా చూశాడు.
”నేను ముందే చెప్పాను దీని వల్ల ఏమీ ప్రయోజనం లేదని. ఇప్పుడు చూడు నీ స్నేహితుడేమో చనిపోయాడు. నీకు తగిలిన గాయాలూ అలాంటివే” అన్నాడు.
”కానీ నాకు తృప్తిగా ఉంది సర్‌. అసలు మీ దృష్టిలో ప్రయోజనం అంటే అర్ధం ఏమిటి?
”మరి నీ స్నేహితుడు చనిపోయాడుగా”
”నే నక్కడికి వెళ్ళేటప్పుటికి బతికే ఉన్నాడు సర్‌. వాడు నోరు తెరిచి నువ్వు వస్తావని నాకు తెలుసురా! అన్న ఒక్క మాటచాలు నాకు,” అదే నా దృష్టిలో గొప్ప ప్రయోజనం!!

27, మే 2012, ఆదివారం

స్నేహితుడా నీకు వందనం !



20 ఏళ్ల తరువాత అపూర్వ కలయిక...మరచిపోని ఊసులు..చెదిరిపోని గుర్తులు..కుటుంబం,  భార్య, పిల్లలు, బాదారా బందీ పక్కనపెట్టి స్నేహితులతో ఓ రోజు. కష్టాలు, కన్నీళ్లు పక్కనపెట్టి ఇష్టమయిన మిత్రులతో..ఇక్కడ పేద లేదు..గొప్ప లేదు..ఎవ్వడయినా ఒక్కటే ..స్నేహానికున్న గొప్పతనమే అది. నాలుగు డబ్బులు సంపాదించడం కాదు నలుగురు మిత్రులను కూడగట్టుకోవడమే గొప్ప. నలుగురితో సంబంధాలు కొనసాగించడమే గొప్ప. స్నేహమే శాశ్వితం..స్నేహమే జీవితం...అందుకే స్నేహితుడా నీకు వందనం..అభివందనం.

25, మే 2012, శుక్రవారం

This Item Only 4r Indian lovers

రూపాయి విలువ వేగంగా పడిపోతున్న నేపథ్యంలో కొందరు ఆవేదనతో  రాసింది ఇది. ఇది ఫేస్ బుక్ లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు. ...
only 4r Indian lovers..

Before 12 months 1 US $ = IND Rs 43

After 12 months, now 1 $ = IND Rs 54.73 (at the time of posting)



Do you think US Economy is booming? No, but Indian Economy is Going Down.



Our economy is in your hands….



INDIAN economy is in a crisis. Our country like many other ASIAN countries, is undergoing a severe economic crunch. Many INDIAN industries are closing down. The INDIAN economy is in a crisis and if we do not take proper steps to control those, we will be in a critical situation.



More than 30,000 crore rupees of foreign exchange are being siphoned out of our country on products such as cosmetics, snacks, tea, beverages, etc… which are grown, produced and consumed here.



A cold drink that costs only 70 / 80 paisa to produce, is sold for Rs.9 and a major chunk of profits from these are sent abroad. This is a serious drain on INDIAN economy.



We have nothing against Multinational companies, but to protect our own interests we request everybody to use INDIAN products only at least for the next two years. With the rise in petrol prices, if we do not do this, the Rupee will devalue further and we will end up paying much more for the same products in the near future.



What you can do about it?



1. Buy only products manufactured by WHOLLY INDIAN COMPANIES.

2. ENROLL as many people as possible for this cause…..



Each individual should become a leader for this awareness. This is the only way to save our country from severe economic crisis. You don’t need to give-up your lifestyle. You just need to choose an alternate product.



All categories of products are available from WHOLLY INDIAN COMPANIES.



LIST OF PRODUCTS



COLD DRINKS:-



DRINK LEMON JUICE, FRESH FRUIT JUICES, CHILLED LASSI (SWEET OR SOUR), BUTTER MILK, COCONUT WATER, JAL JEERA, and MASALA MILK…



INSTEAD OF COCA COLA, PEPSI, LIMCA, MIRINDA, SPRITE



BATHING SOAP:-

USE CINTHOL & OTHER GODREJ BRANDS, SANTOOR, WIPRO SHIKAKAI, MYSORE SANDAL, MARGO, NEEM, EVITA, MEDIMIX, GANGA , NIRMA BATH & CHANDRIKA.



INSTEAD OF LUX, LIFEBUOY, REXONA, LIRIL, DOVE, PEARS, LESANCY, CAMAY, PALMOLIVE, FIAMA DI’WILLS.



TOOTH PASTE:-

USE NEEM, BABOOL, PROMISE, VICO VAJRADANTI, PRUDENT, DABUR PRODUCTS, MESWAK



INSTEAD OF COLGATE, CLOSE UP, PEPSODENT, CIBACA, FORHANS, MENTADENT.



TOOTH BRUSH: -

USE PRUDENT, AJANTA , PROMISE



INSTEAD OF COLGATE, CLOSE UP, PEPSODENT, FORHANS, ORAL-B



SHAVING CREAM:-

USE GODREJ, EMAMI, VICCO



INSTEAD OF PALMOLIVE, OLD SPICE, GILLETE



BLADE:-

USE SUPERMAX, TOPAZ, LAZER, ASHOKA



INSTEAD OF SEVEN-O -CLOCK, 365, GILLETTE



TALCUM POWDER:-

USE SANTOOR, GOKUL, CINTHOL, WIPRO BABY POWDER, BOROPLUS



INSTEAD OF PONDS, OLD SPICE, JOHNSON’S BABY POWDER, SHOWER TO SHOWER



MILK POWDER:-

USE INDIANA, AMUL, AMULYA



INSTEAD OF ANIKSPRAY, MILKANA, EVERYDAY MILK, MILKMAID.



SHAMPOO:-

USE LAKME, NIRMA, VELVETTE



INSTEAD OF HALO, ALL CLEAR, NYLE, SUNSILK, HEAD AND SHOULDERS, PANTENE



MOBILE CONNECTIONS:-

USE BSNL, AIRTEL, RELIANCE



INSTEAD OF VODAFONE, UNINOR, DOCOMO,



Food Items:-

Eat Tandoori chicken, Vada Pav, Idli, Dosa, Puri, Uppuma



INSTEAD OF KFC, MACDONALD’S, PIZZA HUT, A&W



Every INDIAN product you buy makes a big difference. It saves INDIA. Let us take a firm decision today.



BUY INDIAN TO BE INDIAN – We are not against of foreign products.



I AM NOT ANTI-MULTINATIONAL. WE ARE TRYING TO SAVE OUR NATION. EVERY DAY IS A STRUGGLE FOR A REAL FREEDOM. WE ACHIEVED OUR INDEPENDENCE AFTER LOSING MANY LIVES.

MULTINATIONALS CALL IT GLOBALIZATION OF INDIAN ECONOMY. FOR INDIANS LIKE YOU AND ME, IT IS RE-COLONIZATION OF INDIA. THE COLONIST’S LEFT INDIA THEN. BUT THIS TIME, THEY WILL MAKE SURE THEY DON’T MAKE ANY MISTAKES.



WHO WOULD LIKE TO LET A”GOOSE THAT LAYS GOLDEN EGGS”SLIP AWAY?



PLEASE REMEMBER: POLITICAL FREEDOM IS USELESS WITHOUT ECONOMIC INDEPENDENCE



RUSSIA, S.KOREA, MEXICO – THE LIST IS VERY LONG!! LET US LEARN FROM THEIR EXPERIENCE AND FROM OUR HISTORY. LET US DO THE DUTY OF EVERY TRUE INDIAN.



FINALLY, IT’S OBVIOUS THAT YOU CAN’T GIVE UP ALL OF THE ITEMS MENTIONED ABOVE. SO GIVE UP AT LEAST THREE (3) ITEM FOR THE SAKE OF OUR COUNTRY!



We would be sending useless forwards to our friends daily. Instead, please forward this note to all your friends to create awareness…!!



“LITTLE DROPS MAKE A GREAT OCEAN.”



PLEASE TRY TO BE AN INDIAN…..

Every True Indian Pls Share This Post ( Click Share)



THANK YOU…LOVE YOU India…!! ♥♥♥

Let’s Spread this info…!!

15, ఏప్రిల్ 2012, ఆదివారం

పేదింటి పెళ్లికి కేసీఆర్



‘‘తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ిఇస్తానన్న డబ్బు తీసుకోకుండా తమకు తెలంగాణనే ముఖ్యమని చెప్పిన తన పార్టీ కార్యకర్త వెంకటేష్ గౌడ్ కుమార్తె కృష్ణవేణి వివాహానికి’’ కేసీఆర్ ఆదివారం స్వయంగా హాజరయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గం తెలకపల్లిలో ఈ వివాహం జరిగింది. ఇటీవల టీడీపీ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి కృష్ణవేణి వివాహానికి డబ్బులు ఇస్తానన్న్నా ఆమె తిరస్కరించింది. దీంతో స్టేషన్  ఘన్ పూర్ బహిరంగసభలో కేసీఆర్  కృష్ణవేణి ని అభినందించారు. తాను దగ్గరుండి ఆమె వివాహం జరిపించి అత్తవారింటికి పంపిస్తానని మాటిచ్చాడు.
ఈ మేరకు ఆదివారం హాజరయిన కేసీఆర్  కృష్ణవేణి,  బాల్ రాజ్ గౌడ్ ల వివాహానికి హాజరయ్యారు. దంపతులిద్దరినీ ఆశీర్వదించి కృష్ణవేణికి ఓ నెక్లెస్ ను బహుమతిగా అందించారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ భోజనం చేసి వెళ్లారు. మీడియాతో మాట్లాడాలని కోరినా తిరస్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు,  రాజయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్ రావు ఆర్య, పొలిట్ బ్యూరో సభ్యులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నేతలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాల్ రాజ్ తదితరులు హాజరయ్యారు.

2, ఏప్రిల్ 2012, సోమవారం

తెలంగాణ ఆడపడుచు కృష్ణవేణి పెళ్లి 15న

సీమాంధ్రుల అంటకాగుతూ తెలంగాణకోసం రాజీనామా చేసిన నాగం జనార్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ తరపున పోటీ చేసిన హైదరాబాద్ జేసీ బ్రదర్స్ అధినేత మర్రి జనార్ధన్ రెడ్డి కి తలతిరిగే సమాధానం చెప్పిన తెలంగాణ వాది, తెలంగాణ ఆడపడుచు కృష్ణవేణి పెళ్లి ముహూర్తం ఖాయం అయింది. ఈ నెల 15 న మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ నియోజకవర్గం తెలకపల్లి మండలకేంద్రంలోని శివగంగ ఫంక్షన్ హాల్ లో వివాహం జరగనుంది.




                    పెళ్లికి డబ్బులిస్తా అని కృష్ణవేణి తండ్రి వెంకటేష్ గౌడ్ ను జనార్ధన్ రెడ్డి ప్రలోభ పెడితే ఆ డబ్బుతో పెళ్లి జరిగితే అమరుల ఆత్మ క్షోభిస్తుందని, అవసరమైతే ఆస్తులు అమ్మయినా పెళ్లి చేసుకుంటానని, తెలంగాణ కే ఓటు వేద్దామని చెప్పి ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. కృష్ణవేణి చెప్పిన మాటలు తెలంగాణ వాదులను అబ్బురపరిచాయి. ఏకంగా స్టేషన్ ఘన్ పూర్ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృష్ణవేణి పెళ్లిని దగ్గరుండి జరిపించి అత్తారింటికి సాగనంపుతామని మాటిచ్చారు. ఈ నెల 15 న పెళ్లి చేసుకోనున్న తెలంగాణ ఆడపడుచు కృష్ణవేణి ని తెలంగాణా వాదులంతా హాజరై ఆశీర్వదించండి. అభినందించండి. తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు అంటూ తన పెళ్లి పత్రిక ద్వారా కృష్ణవేణి తెలంగాణ యువతకు పిలుపునిస్తోంది. పోరాటాలతోనే తెలంగాణ సాధ్యమని, తెలంగాణ తల్లికి గర్భశోకం మిగల్చవద్దని కోరుకుంటోంది.    

27, మార్చి 2012, మంగళవారం

మరో బలిదానం !


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ మరో యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం ఇమాంపూర్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ మండలం రాయలపూర్‌కు చెందిన యాదగిరిగా పోలీసులు గుర్తించారు.

తాను తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యాదగిరి సెల్‌ఫోన్‌లో వాయిస్ రికార్డు చేసి చనిపోయాడు. దీంతో పాటు ఫోన్ లో తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ టైప్ చేశాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు పెద్దఎత్తున్న సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.

25, మార్చి 2012, ఆదివారం

ఓరుగల్లులో మరో ఆత్మహత్య


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన భోజ్యానాయక్ ఆత్మహత్య చేసుకుని అంత్యక్రియలు పూర్తయి 24 గంటలు గడువక ముందే మరో ఆత్మహత్య సంఘటన జరగడం సంచలనం రేపుతోంది. వరంగల్ లోని హన్మకొండలో కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది.
హన్మకొండ సమీపంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద రాజమొగిలి అనే యువకుడు వంటిపై పెట్రోలు పోసుకుని జై తెలంగాణ నినాదాలు చేస్తూ నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి స్పందించేలోపే ఎక్కువభాగం కాలిపోయాడు. రాజమొగిలి జఫర్ ఘడ్ మండలం తిమ్మంపల్లికి  చెందిన వ్యక్తి. ఆయన భౌతికఖాయాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందనలేదని నిరసన వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ శాసనసభ్యలు సభ వాయిదా పడినా సభలోనే నిరసన తెలుపుతున్నారు. తెలంగాణ గురించి తెల్చేవరకు సభను విడిచిపెట్టమని వారు తేల్చిచెప్పారు.

24, మార్చి 2012, శనివారం

తెలంగాణ కోసం మరో ఆత్మహత్య


తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు కోరుతూ వరంగల్ జిల్లాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ లోని ఆర్ట్ కళాశాల దగ్గర జై తెలంగాణ అంటూ బొజ్జా నాయక్ అనే విద్యార్థి  వంటికి నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బొజ్జా నాయక్ న్యూసైన్స్ కళాశాలలో ఎంబీఎ చదువుతున్నాడు. రఘునాథపల్లి మండలం అశ్వారావు పల్లి పక్కన బీరానాయక్ తండా ఆయన స్వగ్రామం.
కాంగ్రెస్, టీడీపీ నాయకుల దొంగనాటకాల వల్లనే తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ఆలస్య మవుతుందని బొజ్జానాయక్ విమర్శించాడు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కోర్టులో పోరాడుతామని, విద్యార్థి ఆత్మహత్య బాధాకరమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంఘటితంగా పోరాడి తెలంగాణ సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆత్మహత్యలకు సోనియా సహా రాష్ట్ర మంత్రి డీకె అరుణ, గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు బాధ్యత వహించాలని,చ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని న్యాయవాది అరుణ్ కుమార్ కోరారు.

21, మార్చి 2012, బుధవారం

గెలిచిన గుర్రాలివే !


Nagam Janardhan27,325  మెజార్టీ  
నాగం జనార్ధన్ రెడ్డి (నాగర్ కర్నూలు)


JUPALLI Krishna Rao15,043 ఓట్ల మెజార్టీ
జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్)


Gampa Gpvardhan44,465 ఓట్లతో ఘనవిజయం (కామారెడ్డి)
గంప గోవర్ధన్ (టీఆర్ఎస్)

JoguRamanna33 వేల ఓట్లు మెజార్టీ
జోగురామన్న (ఆదిలాబాద్)

1897 మెజార్టీ
ఎన్నం శ్రీనివాస్ రెడ్డి (బీజేపీ)
SRINIVAS

                                           
Rajaiah32,830 మెజార్టీతో గెలుపు
తాటి కొండ రాజయ్య (స్టేషన్ ఘన్ పూర్)

20, మార్చి 2012, మంగళవారం

కారు జోరు..టీడీపీ, కాంగ్రెస్ బేజారు


నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, స్టేషన్ ఘనపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య ఘనవిజయం సాధించారు. కామారెడ్డిలో టీడీపీకి  డిపాజిట్ దక్కలేదు. స్టేషన్ ఘనపూర్ లో టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి రెండో స్థానంలో నిలిచారు.
గంప గోవర్ధన్ అనూహ్యంగా 44 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించగా, రాజయ్య 26 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. కామారెడ్డిలో అభ్యర్థిపై వ్యతిరేకత ఉందని, గెలుపు కష్టమని వార్తలు వచ్చాయి. అయితే ఓటింగ్ సరళిలో ఆ విషయం ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేసినట్లు కనిపిస్తోంది.

పాలమూరులో ముందుకెళ్లిన ’కారు‘

మహబూబ్ నగర్ అసేంబ్లీ నియోజకవర్గంలో రౌండ్ రౌండ్ కు ఫలితాల్లో తేడా వస్తోంది. ఆరు రౌండ్ల వరకు కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం పుంజుకున్నారు.
ఎనిమిదో రౌండ్ పూర్తయ్యే సరికి 479 ఓట్ల అధిక్యంలోకి దూసుకెళ్లారు. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ కు 15,470 ఓట్లు రాగా, బీజేపీకి 14,900 ఓట్లు, కాంగ్రెస్ కు 13,700 ఓట్లు, టీడీపీకి  9900 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఇక్కడ వెనకబడి పోగా బీజేపీ, టీఆర్ఎస్ ల మద్య ప్రధాన పోటీ నెలకొంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం సయ్యద్ ఇబ్రహీం 2317 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. మహబూబ్ నగర్ లో ముస్లింల ప్రాబల్యం అభ్యర్థికి కలిసివచ్చినట్లు గా తెలిసి పోతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయం అనుకోవచ్చు. టీఆర్ఎస్ అభ్యర్థికి 23 వేల 564 ఓట్లు రాగా, బీజేపీకి 21,560 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 16 వేల ఓట్లు, టీడీపీకి 11 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మరో ఏడు రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది.

15, మార్చి 2012, గురువారం

కృష్ణవేణి...తెలంగాణ విరిబోణి

‘కంఠమే తెగుతున్నా కంట నీరు వద్దని ఓరుగల్లు కోటకే పోరు పాఠం నేర్పినట్టి..కత్తులకు పదును బెట్టి కదనరంగమున దూకిన సమక్క సారలమ్మ రణభూమికి వందనం’

                 సీమాంధ్ర నేతల గుండెలదిరేటట్లు..సమైక్య వాదుల చెంప పగిలేటట్టు..ఇంటి దొంగ వీపు వాచేటట్లు తెలంగాణ ముద్దు బిడ్డ, పాలమూరు ఆడబిడ్డ కృష్ణవేణి ఇచ్చిన షాక్ ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డలకు గొప్ప ఊపిరినిచ్చింది. రెండు కళ్ల చంద్రబాబు పార్టీ తరపున నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మర్రి జనార్ధన్ రెడ్డికి కృష్ణవేణి ఇచ్చిన షాక్, చెప్పిన మాటలు ఆయన తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీకుండా చేసింది.

సీమాంధ్ర డబ్బు సంచులను ఎర వేసి తెలంగాణ ఓట్లు కొల్లగొట్టాలను కున్న మర్రికి తిక్క తిరిగేలా మొహం మీదే సమాధానం చెప్పింది కృష్ణవేణి. నాగర్ కర్నూలు తాలూకా తెలకపల్లికి చెందిన కృష్ణవేణి టీఆర్ఎస్ కార్యకర్త సూర్య వెంకటేష్ గౌడ్ కుమార్తె. గత 11 తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తగా పనిచేస్తున్న వెంకటేష్ నిఖార్సయిన తెలంగాణ వాది. ప్లంబర్ పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ ఉప ఎన్నికలో తన సహచరులంతా మర్రి డబ్బులకు లొంగినా  తాను మాత్రం తెలంగాణ జెండా విడవలేదు.


                        దీంతో బిడ్డ పెళ్లిని సాకుగా చూపి తెలుగుదేశం పార్టీలోకి రావాలని, డబ్బులిస్తానని మర్రి జనార్ధన్ రెడ్డి ఏకంగా ఇంటికే ఫోన్ చేశాడు. ’’ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా‘‘ వెంకటేష్ కుమార్తె కృష్ణవేణి నీ డబ్బు వద్దు..నీ సోపతి వద్దు. అవసరమయితే పొలం అమ్మి పెళ్లి చేసుకుంటా..లేకపోతే ఇలాగే ఉంటా...నాయినా నీవు పార్టీ మారొద్దని తేల్చి చెప్పింది. దీంతో సీమాంధ్రుల సంక చేరిన మర్రికి తిక్క కుదిరింది. చావులకు, పెళ్లిళ్లకు డబ్బులని, వాటర్ ప్లాంట్లు అని ఓ ట్రస్టు పేరుతో రాజకీయాలకు దిగిన మర్రికి బుర్ర తిరిగేలా చెప్పిన సమాధానం మామూలుది కాదు. అది తెలంగాణ గుండె చప్పుడు. అందుకే కృష్ణవేణిని అభినందిద్దాం...ఆయన తండ్రికి అండగా నిలుద్దాం. కాల్ 9948698519

12, మార్చి 2012, సోమవారం

సీమాంధ్ర డబ్బొద్దన్న తెలంగాణ పులిబిడ్డ

ఈ అమ్మాయిది మా ఊరే, వీళ్ల నాన్న మా మిత్రుడు. 11 ఏళ్లుగా టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ, తన పని తప్ప మరో లోకం తెలియదు. అభినందించ దలుచుకున్న వారు krushnaveni తండ్రి వెంకటయ్య గౌడ్ కు కాల్ చేయండి. 9948698519

11, మార్చి 2012, ఆదివారం

చంద్రబాబు శకుని..కిరణ్ శని


‘దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి పోటీ చేయాలి’ అన్న టీడీపీ చంద్రబాబు నాయుడు సవాల్ ను టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్వీకరించారు. రాజీనామా చేసి పోటీ చేసేందుకు సిద్దమని, దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయించి తనతో పోటీకి రావాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ఏ నియోజకవర్గం నుండి అయినా పోటీ చేసి చంద్రబాబు డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు.  తెలంగాణ ఇచ్చేది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని , తెలంగాణ రాకపోవడానికి నాకు ఏం సంబంధం అంటున్న చంద్ర బాబు, డిసెంబర్ 9 నాడు రాత్రి వచ్చిన తెలంగాణ ప్రకటనను అడ్డుకున్నది నీవు కాదా ? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్ నుండే దొంగ రాజీనామాలు చేసేలా సీమాంధ్ర ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారని విమర్శించారు. తెలంగాణకు చంద్రబాబునాయుడు శకుని అయితే, ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి శని  అని అన్నారు.

8, ఫిబ్రవరి 2012, బుధవారం

పోటెత్తిన మేడారం


ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర  మేడారం ‘సమ్మక్క – సారలమ్మ’ జాతరకు భక్త జనం పోటెత్తింది.
 ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుండటంతో  మేడారం జనారణ్యంగా మారింది. అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్దికెక్కిన మేడారం జాతర భక్తి తన్మయత్వంలో ముంచెత్తుతోంది.  ఎటు చూసినా యిసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసి పోయింది.
సమక్క.. సారలమ్మలను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటికే అమ్మవారి సన్నిధికి చేరుకున్న భక్తులు దేవతల గద్దెలను దర్శించుకున్నారు. ఈ ఏడు జాతరకు కోటి మంది భక్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారంలో హిజ్రాలు హల్ చల్ చేస్తున్నారు. నృత్యాలు చేస్తూ సమ్మక్కను ఎత్తుకుని మేళ తాళాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. జాతర భద్రతకు వేల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మావోయిస్టు యాక్షన్ టీములు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు.  జాతరకు వచ్చే వీవీఐపీలను మావోయిస్టులు టార్గెట్ గా చేసుకుని, హింసాత్మక సంఘటలనకు పాల్పడే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. అమ్మవార్ల గద్దెల చుట్టూ 1200మందికి పైగా సాయుధ పోలీసులు పహరా కాస్తున్నారు. 40సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని 6భారీఎల్ ఈడీ స్క్రీన్ల ద్వారా పరిశీలిస్తారు.
ఎడ్లబండ్లపై మోజు…
పట్టణ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఎండ్ల బండ్లపై జంపన్న వాగుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇక్కడి స్థానికులకు ఇదో కొత్త ఉపాధిగా మారింది. బస్టాండు నుండి జంపన్న వాగు దూరంగా ఉండడం, దీంతో పాటు ఎడ్లబండి ప్రయాణం కొత్త అనుభూతికి గురిచేయడంతో అత్యధికులు దీనిపై మోజుపడుతున్నారు. దీనికి గాను బండికి రూ.50 వసూలు చేస్తున్నారు. బుధవారం రాత్రి సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గిరిజన పూజారులు గద్దెలపై ప్రతిష్టించారు. ఈ ప్రతిష్టాపనని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండేళ్లకోకసారి జరిగే ఈ జాతరను దాదాపు కోటిన్నర మంది దర్శించుకుంటారు.

4, ఫిబ్రవరి 2012, శనివారం

యువరాజ్ సింగ్ కు క్యాన్సర్


భారత క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. భారత జట్టు డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్సింగ్ అభిమానులకు ఇది మరింత ఆందోళన కలిగించే వార్త. యువరాజ్ సింగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని సమాచారం. ఈ మేరకు ఆయన అమెరికాలో కీమోథెరపీ చికిత్స పొందుతున్నారు. భారత్ కు మరోసారి ప్రపంచకప్ వచ్చేందుకు కారణమయిన యువరాజ్ సింగ్ ఆ తరువాత క్యాన్సర్ ఉందని తెలిసినట్లు సమాచారం.
మార్చి వరకు ఆయనకు కీమోథెరపి చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ మొదటి దశలోనే ఉందని, ఆయనకు ఎలాంటి ప్రమాదంలేదని యువీ వ్యక్తిగత వైద్యుడు చెబుతున్నాడు. కీమోథెరపీ చికిత్స మూడుదశల్లో జరుగుతుందని వైద్యుడు జతిన్ చౌదరి చెబుతున్నారు. తన ఆటతీరుతో, అందచందాలతో బాలీవుడ్ భామల మనసులు దోచుకున్న యువరాజ్ క్రికెట్ లో తన సత్తా చాటుకున్నాడు. ఆయనకు క్యాన్సర్ ఉందన్న వార్తలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
గత అక్టోబర్ లోనే గుండెకు, ఊపిరితిత్తుల మధ్య వైద్యులు కణితిని గుర్తించారు. అయితే అది అంత ప్రమాదకరం కాదని మొదట అనుకున్నారు. క్రమేణా అది ఇబ్బందిగా మారడంతో చికిత్సను ప్రారంభించారు.