30, జనవరి 2014, గురువారం

ఏపి నుండి పోతున్న..తిరిగి తెలంగాణల అడుగువెడ్త


నేను రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఢిల్లీకి వెళ్తున్నా

తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అడుగుపెట్టబోతున్నా..

ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చిట్టచివరి సమావేశం ముగిసిపోయింది
సభలో ఏదో జరిగిపోయింది అన్నట్లు సీమాంధ్ర మీడియా అవాకులు చెవాకులు పేలుతోంది
ఢిల్లీకి చెందిన వారితో మాట్లాడా ..ఇక్కడ జరిగిన దేనిగురించి భయపడొద్దని చెప్పారు
లంకల పుట్టినోళ్లంతా రాక్షసులే అని నేను అన్నమాటలు సీమాంధ్ర నేతలు నిజం చేశారు
ఈ రోజు వారు సభలో వ్యవహరించిన తీరే అందుకు కారణం
రాష్ట్రపతి అనుకుంటే శాసనసభనే రద్దు చేసే అధికారం ఉంది
కానీ చంద్రబాబు రాష్ట్రపతిని తేలిగ్గా తీసుకున్నారు.

సీమాంధ్ర నేతలంతా తమ రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే చూశారు
ఒక్కరు కూడా సీమాంధ్ర ప్రయోజనాల గురించి పట్టుబట్టలేదు..ఇది దారుణం
మేధావులం అని చెప్పుకునే చంద్రబాబు, జయప్రకాష్ నారాయణలకు
కూడా సీమాంధ్ర ప్రయోజనాలు పట్టలేదు

తెలంగాణ ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదు
తెలంగాణ రాష్ట్రం వచ్చేస్తుంది..అందులో బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుందాం
మెజార్టీ వారి అభిప్రాయంతోనే రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని ఎవరయినా అంటే
ఈ దేశంలో అసలు రాష్ట్రాలే ఏర్పడవు..అలా ఎవరన్నా అంటే
వాళ్లంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు

ఇప్పటికయినా సీమాంధ్ర మీడియా తన పద్దతి మార్చుకోవాలి
ఇంత మూర్ఖంగా మీడియా ఉండడం ఎక్కడా జరగదు
రేపు తెలంగాణ వచ్చిన తరువాత మీరు ఏ మొహం 
పెట్టుకుని వార్తలు రాస్తారు.. ఓ సమస్య పరిష్కారం అవుతోంది..సంతోషించండి
ఇద్దరు రాజ్యసభకు పోటీలో ఉంటే అదేదో పెద్ది విచిత్రంగా చూస్తున్నారు

తెలంగాణ విభజన గెలుపు ..ఓటమికి సంబంధించిన అంశంగా చూస్తున్నారు
ఇది తప్పు ..ఇది కోట్లాది మంది ప్రజల మనసులతో ముడిపడి ఉన్నది
ఇప్పటికయినా విజ్ఞులు అర్ధం చేసుకోవాలి ..ఎవరూ వెయ్యేళ్లు బతకడానికి ఈ భూమ్మీదకు రాలేదు... రేపటి తరాలకు మనం మార్గదర్శకంగా నిలవాలి 
సీమాంధ్ర పెద్దలు ప్రజల మనసుల్లో విషబీజాలు నాటుతున్నారు
ఈ రోజు కూడా మీరు తెలంగాణ ప్రజల మనసులలో భయం సృష్టిస్తున్నారు
రేపు మనం అంతా ఒక దేశంలో కలిసి ఉండాలి
రేపు ఏదయినా ఉపద్రవం వస్తే ఒకరికి ఒకరం సహకరించుకోవాలి
మీడియా న్యూస్ రాస్తుందా ? వ్యూస్ రాస్తుందా ?

బిల్లు ఒక్కటే ఉంటుంది..అది చివరి వరకూ అనేక మార్పులు చేర్పులకు గురవుతుంది
చివరకు పార్లమెంటులో తీర్మానం చేసిన తరువాత వచ్చిందే ఫైనల్ బిల్లు 
అంతేగానీ అసలు బిల్లు ..నకిలీ బిల్లు అని ఉండవు..
15 రోజులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయం ..ఇది రాసిపెట్టుకోండి
ఢిల్లీ ఈ విషయంలో స్పష్టంగా ఉంది... ఏ సభలో ఏ రోజు చర్చ అనేది కూడా నిర్ణయించారు
తెలంగాణ - అంధ్ర ప్రత్యేక రాష్ట్రాలలోనే ఎన్నికలు జరుగుతాయి

తెలంగాణలో శాసనసభ స్థానాలు పెరగబోతున్నాయి.. అవి వచ్చేసారి అమలులోకి వస్తాయి
శాసనసభను ఎక్కువకాలం పొడిగించే అవకాశం లేనందున ఈ సారికి శాసనసభ స్థానాలు పెంచుతున్నట్లు మాత్రమే బిల్లులో పేర్కొననున్నారు ..
ఢిల్లీకి వెళ్లిన నేను అన్ని పార్టీల నేతలను కలుస్తా..సోనియాను కూడా కలుస్తా 
ఈ రోజు తెలంగాణ ఏర్పడడానికి కారణం సోనియాగాంధీనే 

నేను ఈ రోజు నా జీవితంలో గొప్ప సాఫల్యం పొందుతున్న
నేను ఎక్కడా ఓడిపోలే..ఎమ్మెల్యే కావాలనుకున్న అయిన
ఎంపీ కావాలనుకున్న అయిన ..తెలంగాణ రావాలనుకున్న వస్తుంది
ఇక బంగారు తెలంగాణను ఏర్పాటు చేసుకోవడం మిగిలింది
నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు
నన్ను తెలంగాణ ప్రజలు చివరకు అర్ధం చేసుకున్నారు

ఈ విజయం తెలంగాణ అమరులకు అంకితం
వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోంది
అమరుల కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం అందిస్తాం
ప్రతి కుటుంబానికి ఓ ఉద్యోగం అందిస్తాం 
వారికి తెలంగాణ రాష్ట్రంలో అండగా నిలుస్తాం 

జై తెలంగాణ జైజై తెలంగాణ

sandeepreddy kothapally

please like this page

www.facebook.com/thovva

https://www.facebook.com/pages/We-support-kcr/179026928974415?ref=hl

1, జనవరి 2014, బుధవారం

ఆడు ఒక్క పూట ఏశానికి మీసాలు తీసుకుంటున్నడు

ఆడు ఒక్క పూట ఏశానికి మీసాలు తీసుకుంటున్నడు
పగటి ఏశగాని లెక్కన పరేషాన్ అయితున్నడు
తెలంగాణను జీర్ణం జేసుకోలేక ఆగమయితున్నడు
అందుకే ఆని అసలు వికృత రూపాన్ని బయట వెట్టుకుంటున్నడు
మూణ్ణెళ్ల ముఖ్యమంత్రి గిరి జూసుకొని
నాయంత మొనగాడు లేడనుకుంటున్నడు

అబ్బే ..హవులే..బెవకూఫ్
కలిసుందామనేటోనికి ఇన్ని కుట్రలుంటాయిరా !
నీ ఒక్క శాడిస్టు మనస్తత్వాన్ని సంతృప్తి పరచుకోనికె
ప్రజల మధ్య సంబంధాలు శాశ్వతంగా దెబ్బతీస్తావురా ?!


మీ రెంత లేకి ఎధవలో ఇప్పుడు బయటవడ్తుంది
మేమెందుకు విడిపోతున్నమో ..సీమాంధ్ర
ప్రజలకు ఇప్పుడు అర్ధమవుతుంది..
కానీ వాళ్లు మొదట చేయాల్సింది
మీ రాజకీయ భవిష్యత్ కు సమాధికట్టడం

నమ్ముకుని మిమ్మల్ని ఎన్నుకున్నరా ..
ఇంగ వాళ్లను దేవుడు గుడ కాపాడలేడు

https://www.facebook.com/sandeepreddy.kothapally

www.facebook.com/thovva