15, ఏప్రిల్ 2012, ఆదివారం

పేదింటి పెళ్లికి కేసీఆర్



‘‘తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ిఇస్తానన్న డబ్బు తీసుకోకుండా తమకు తెలంగాణనే ముఖ్యమని చెప్పిన తన పార్టీ కార్యకర్త వెంకటేష్ గౌడ్ కుమార్తె కృష్ణవేణి వివాహానికి’’ కేసీఆర్ ఆదివారం స్వయంగా హాజరయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గం తెలకపల్లిలో ఈ వివాహం జరిగింది. ఇటీవల టీడీపీ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి కృష్ణవేణి వివాహానికి డబ్బులు ఇస్తానన్న్నా ఆమె తిరస్కరించింది. దీంతో స్టేషన్  ఘన్ పూర్ బహిరంగసభలో కేసీఆర్  కృష్ణవేణి ని అభినందించారు. తాను దగ్గరుండి ఆమె వివాహం జరిపించి అత్తవారింటికి పంపిస్తానని మాటిచ్చాడు.
ఈ మేరకు ఆదివారం హాజరయిన కేసీఆర్  కృష్ణవేణి,  బాల్ రాజ్ గౌడ్ ల వివాహానికి హాజరయ్యారు. దంపతులిద్దరినీ ఆశీర్వదించి కృష్ణవేణికి ఓ నెక్లెస్ ను బహుమతిగా అందించారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ భోజనం చేసి వెళ్లారు. మీడియాతో మాట్లాడాలని కోరినా తిరస్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు,  రాజయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్ రావు ఆర్య, పొలిట్ బ్యూరో సభ్యులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నేతలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాల్ రాజ్ తదితరులు హాజరయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి