12, జూన్ 2012, మంగళవారం

ముగ్గురు స్నేహితుల కథ !

ఒక ఊరిలో ఓ మిరప కాయ, ఓ ఉల్లిపాయ, ఓ మంచుముక్క ముగ్గురూ మంచి స్నేహితులు. 

ఒకనాడు ఆ ముగ్గురు ఈతకి వెళ్ళారు. అక్కడ నీళ్ళలో మునిగి మంచుముక్క కరిగిపోయింది. దీంతో తమ స్నేహితుడు పోయాడని ఏడుస్తూ వస్తున్న మిగిలిన ఇద్దరిలో ఒక మిర్చి బండివాడు  వెంటాడి, ఆ మిరప కాయని పిండి లో ముంచి, నూనెలో వేసి హత్య చేశాడు.

దీంతో భయపడి  ఏడుస్తూ ఉల్లిపాయ దేవుడి వద్దకు వెళ్లింది. నా స్నేహితులిద్దరూ చనిపోయారు. వారి కోసం నేను ఏడ్చి ఏడ్చీ అలిశాను. మరి  నా కోసం ఎవరు  ఏడుస్తారు,స్వామీ?" అని అడుగగా ఆ స్వామి "ఉల్లీ, ఇక నుంచీ నిన్ను నీ సంతతిని చంపినవారే ఏడ్చేదరు," అని వరమిచ్చాడట.

1 కామెంట్‌: