23, నవంబర్ 2011, బుధవారం

మూడో రోజూ తెలంగానం


అధిక ధరలు, నల్లధనం, ప్రత్యేక తెలంగాణ నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలు మూడోరోజు కూడా ప్రారంభం

అయిన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. గురువారం ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టాయి. తెలంగాణ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక తెలంగాణ నినాదాలతో లోక్ సభ, రాజ్యసభల్లో గందరగోళం నెలకొంది. సభా కార్యక్రమాలకు సజావుగా కొనసాగేందుకు అవకాశం లేకపోవటంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడ్డాయి. మొదట కేసీఆర్, విజయశాంతి తెలంగాణ నినాదాలు చేయడంతో వెంటనే కాంగ్రెస్, టీడీపీ నేతలు తెలంగాణ నినాదాలు ప్రారంభించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి