6, డిసెంబర్ 2011, మంగళవారం

ఉద్యమనేతకు 12 నెలల నిర్భంధం


టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు డా. చెరుకు సుధాకర్‌ను మరో 12 నెలలు జైలులో ఉంచాలని ప్రభుత్వం జీవో నం. 5431ని జారీ చేసింది. చెరుకు సుధాకర్ పీడీ యాక్ట్‌పై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణను పూర్తి చేసింది. చెరుకు సుధాకర్ హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 ప్రకారం మరో 12 నెలలు జైలులో ఉంచాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత నెల 3 న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడి నుండి వరంగల్ జైలుకు తరలించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను విడుదల చేయాలని తెలంగాణ నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ 48 గంటలపాటు నిరాహారదీక్ష చేశారు. అయినప్పటికి ప్రభుత్వం ఆయనను విడుదల చేయకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొదట పీడీ యాక్టు కింద అరెస్టు చేసి తరువాత నాసా కిందకు మార్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకే సీమాంధ్ర ప్రభుత్వం నిరంకుశంగా నిర్భందించిందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా దీనికి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

1 కామెంట్‌:

  1. పాకిస్తాన్‌లోని జియా-ఉల్-హక్ పాలన ఎలా ఉండేదో, సమైక్యవాదుల పాలన అలాగే ఉంది.

    రిప్లయితొలగించండి