27, ఆగస్టు 2011, శనివారం

గర్జించిన ‘గద్వాల’: మార్మోగిన తెలంగాణం


సీమాంధ్ర ముఖ్యమంత్రి పర్యటన తమకు అవసరం లేదని గద్వాలలో తెలంగాణ వాదులు, విద్యార్థులు భారీగా ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు పెట్టినా, కళాశాలలకు తాళాలు వేసినా, తెలంగాణ వాదులను అరెస్టు చేసినా, మంత్రి డీకే అరుణ హెచ్చరించినా  అన్నింటినీ దాటుకుని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి సభలో యువకులకు ఉద్యోగాలు ప్రకటించగానే మా ఉద్యోగాలు మేము చేసుకుంటామని, సీమాంధ్ర పాలన అక్కరలేదని నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలమూరు జిల్లాకు యువ కిరణాలు పథకం కింద రాబోయే మూడేళ్లలో 70 వేల ఉద్యోగాల వస్తాయని చెప్పడంతో  సభలో ఒక్కసారిగ విద్యార్థులు జై తెలంగాణ మా తెలంగాణలో మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం అంటు ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుతగలడంతో వారిని పక్కకు తప్పించండి వారికి ఈ జిల్లాకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేనట్టుంది అంటు నిరసనల మద్యనే తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా  గద్వాల్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం గోబ్యాక్ అంటు నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15మంది విద్యార్థులు కిరోసిన్ డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఉద్రిక్తల నడుమనే ముఖ్యమంత్రి గద్వాల్ చేరుకున్నారు.
తెలంగాణవాదులు సీఎం పర్యటనను వ్యతిరేకిస్తుండటంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ముందస్తుగా విద్యార్థులను, తెలంగాణవాదులను అదుపులోనికి తీసుకున్నారు. విద్యార్థులు బయటకు రాకుండా కళాశాల గేట్లకు తాళాలు వేసారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి