27, అక్టోబర్ 2011, గురువారం

చంద్రబాబు రాజకీయ వ్యభిచారి

కాంగ్రెస్  అన్యాయాలు చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహరెడ్డి విరుచుకుపడ్డారు.
 చంద్రబాబు ముఖ్యమంత్రితో కుమ్మకై తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు.  కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే  బాబును తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. అవినీతి, అక్రమాలు భయటపడుతాయని రహస్యంగా చిదంబరంను కలిసి బాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని అన్నారు. 
చంద్రబాబు ప్రభుత్వ కాలంలో రైతుల అష్టకష్టాలు పడ్డారని, రైతుల నడ్డి విరించింది చంద్రబాబే అని నాయిని ఆరోపించారు. మళ్లీ చంద్రబాబే రైతులపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. తెలంగాణలో చంద్రబాబు పర్యటిస్తే జరుగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని  హెచ్చరించారు. చందాలు వసూలు చేయకుండా చంద్రబాబు పార్టీని నడుపుతున్నారా అని నాయిని ప్రశ్నించారు.
మరోవైపు చంద్రబాబుకు దమ్ముంటే కేసీఆర్ ఆస్తులపై బహిరంగ చర్చలకు రావాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చర్చకు వస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ టీడీపీ నేతలకు దమ్ముంటే బాబును చర్చలకు తీసుకురవాలన్నారు. తామే జూబ్లీ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతుల వంకతో బాబు తెలంగాణ అడుగుపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు దళిత కార్డు అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పప్పెట్ షో ఆడిస్తుంటే ఒక బ్రోకర్, ఒక జోకర్, ఒక పిట్టల దొరలా ఆడుతున్నారన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి