18, నవంబర్ 2011, శుక్రవారం

తెలంగాణపై ఎస్సార్సీ వేయం : ఏఐసీసీ


తెలంగాణ సమస్యను, ఎస్సార్సీతో ముడిపెట్టలేమని ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ స్పష్టం చేశారు. రెండు అంశాలను వేరుగా చూడాలని అన్నారు. ఎస్సార్సీ పరిధి నుంచి తెలంగాణను వేరుగా చూస్తున్నామన్నారు. వనరులు, సాధ్యాసాధ్యాల్ని రాష్ట్రాల ఏర్పాటుకు కమిషన్ ప్రతిపాదనలు ఇస్తుందని ఆయన అన్నారు. దేశంలోని చిన్న రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడమే తమ అభిమతమని ఆయన మీడియాతో అన్నారు.
తెలంగాణ సమస్యను ఏఐఐసీసీ ప్రత్యేకంగా పరిగణిస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయట్లేదని ఆయన స్ఫష్టం చేశారు. యూపీ విషయంలో రెండో ఎస్సార్సీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి