14, నవంబర్ 2011, సోమవారం

రాజీనామాలు ఇప్పుడు అప్రస్తుతం : ఎర్రబెల్లి


తాము చేసిన రాజీనామాలు ఆమోదించమని స్పీకర్ వద్దకు తామొక్కరమే వెళ్లడం సరికాదని తెలంగాణ

 టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  టీడీఎల్పీ కార్యాలయంలో సీనియర్ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజీనామాల విషయం ప్రస్తుతానికి అనవసర అంశమని అన్నారు. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు మాత్రం అసెంబ్లీకి హాజరు కామన్నారు.
కాంగ్రెస్ తెలంగాణ లీడర్లు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని అంతర్గతంగా ఏమి ఒప్పందం చేసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం టెండర్ల విషయంలో సీఎం స్వయంగా కాగితాలు మారుస్తూ టీఆర్‌ఎస్‌కు టెండర్ దక్కే విధంగా చేశాడని, దీనిని ప్రజల దృష్టికి తీసుకు అందరం రాజీనామాలు చేసి కలిసి ఉద్యమిద్దామంటే , తెలంగాణ కోసం పార్టీ పెట్టిన కేసిఆర్ ఎందుకు కలిసిరావడం లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి