రెండో ఎస్ఆర్సి అనేది అవుట్ డేటెడ్ మెడిసిన్ వంటిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.

రెండో ఎస్ఆర్సి కాంగ్రెస్ పార్టీ విధానమే అయితే రాష్ట్రంలో మీ పుట్టి మునగడం ఖాయమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల సాయంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.ఈ రాష్ట్రం ఏమైపోయినా సరే కాంగ్రెస్ను ఎలా బతికించుకోవాలనేదే ఆ పార్టీ నేతల యోచనగా వుందని అన్నారు. అనిశ్చితి వున్న చోట అభివృద్ధి అసాధ్యమని, కాంగ్రెస్ చేసిన రాజకీయ తప్పిదానికి ఆపార్టీ సర్వనాశనం కాక తప్పదన్నారు. తెలంగాణ అంశం వెంటనే తేల్చాలని అన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి