8, అక్టోబర్ 2013, మంగళవారం

తెలంగాణ వాదులకు హెచ్చరిక..విజ్ఞప్తి !

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని, అరవై ఏళ్ల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందని సంబరాల్లో ఉన్న

తెలంగాణ వాదులకు హెచ్చరికతో కూడిన విజ్ఞప్తి. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లేదు. సీమాంద్ర పెట్టుబడిదారులతో, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరిగిన ఒప్పందం మేరకు తొమ్మిది జిల్లాల తెలంగాణను ఇచ్చి..హైదరాబాద్ ను ఢిల్లీ తరహా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణకు సంబంధించి క్యాబినెట్ నోట్ లో లేని అంశాలు ఇవి. తెలంగాణ వాదులు ఇప్పుడే తిరగబడి ఈ కుట్రను అడ్డుకోకుంటే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అత్యున్నత స్థాయిలో బహిరంగ రహస్యంగా ఉన్న ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవిగా తెలుస్తున్నాయి

- హైదరాబాద్ ను ఢిల్లీ తరహా ప్రత్యేక రాష్ట్రం చేయడం.
- 40 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక రాష్ట్రం. కేంద్రం చేతిలో రక్షణ బాధ్యతలు.
- హెచ్ ఎం డీ ఎ పరిధి అంతా ఈ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి.
- ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం ఉంది కాబట్టి ఎంఐఎం నుండి అభ్యంతరం లేదు.
- సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆస్తుల అక్రమాలు బయటపడకుండా ఉన్నతస్థాయిలో జరిగిన ఒప్పందం.
- తెలంగాణ వచ్చినా సీమాంధ్ర పెట్టుబడిదారులకు ఎలాంటి భయం అక్కర్లేదు.
- తెలంగాణ ఇచ్చినా సరే హైదరాబాద్ మా పరిధిలో ఉంచాలని వచ్చిన డిమాండ్ మేరకు కాంగ్రెస్ అభయహస్తం.
- హైదరాబాద్ లో భారీ అక్రమాలతో, ప్రభుత్వ అండతో ఆస్తులు కూడగట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, రాజగురువు రామోజీరావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, చిరంజీవి ఇలా ఇతర సీమాంధ్ర పెద్దలుగా చలామణి అవుతున్న..ఆక్రమణ దారులు, భూకబ్జా దారులు అంతా కూడబలుక్కుని కేంద్రంతో రాసుకున్న ఒప్పందం ఇది.
- హైదరాబాద్ లో జగన్ దీక్ష అంతా కాంగ్రెస్ స్కెచ్..ఢిల్లీలో చంద్రబాబు దీక్ష కూడా కాంగ్రెస్ స్కెచ్
- హైదరాబాద్ తో కూడిన తెలంగాణకే తమ మద్దతు అని బీజేపీ చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంకోసం బీజేపీని ఒప్పించేందుకే గత కొన్నాళ్లుగా చంద్రబాబు ఢిల్లీకి తీర్ధయాత్రలు చేస్తున్నారు. తాజా దీక్ష కూడా దాని కోసమే.
- సీమాంధ్రలో ఆందోళనలు, అల్లర్లు అన్నీకాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్నవే.
- ముఖ్యమంత్రి గాండ్రింపులు, అధిష్టానం వ్యతిరేక వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్నవే.
- దిగ్విజయ్ సింగ్ పదవి మాత్రం శాశ్వతమా..అధిష్టానమే నిర్ణయం మార్చుకోవాలి అని ముఖ్యమంత్రి గట్టిగా మాట్లాడడం ఒప్పందంలో భాగమే. ఇంత అన్నా కాంగ్రెస్ ఇంతవరకు ఏమీ అనలేదు. ముఖ్యమంత్రిని కూడా మార్చం అని గట్టిగా చెబుతోంది. ఇక ముఖ్యమంత్రి మీద డీజీపీ వ్యాఖ్యలు చేస్తే ఏకంగా డిగ్గీరాజా లైన్లోకి వచ్చాడు అంటే కాంగ్రెస్ వ్యవహారం అర్ధం చేసుకోవచ్చు.
- మీడియా వర్గాలలో, మీడియా యాజమాన్యాలలో ఈ వార్త ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. కానీ ఎవ్వరూ దీనిని ఓ వార్తగా చూడడం లేదు. ఎందుకంటే తెలంగాణలో వ్యతిరేకత ఇప్పుడే వస్తుందని కావొచ్చు ? లేదా భవిష్యత్ కార్యాచరణ ఇప్పటి నుండే మొదలు పెడతారన్న అనుమానం కావచ్చు ?
- ఏదీ ఏమయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న ప్రకటన ఎంత నిజమో..సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం చేస్తారన్నది కూడా అంతే నిజం అని తెలుస్తోంది. తెలంగాణ వాదులు ఇప్పుడే మేల్కొని కాంగ్రెస్ నేతల మీద గట్టిగా పోరాడకుంటే తెలంగాణ ఇచ్చినా ఒకటే..ఇవ్వకపోయినా ఒకటే.

2 కామెంట్‌లు: