4, జనవరి 2013, శుక్రవారం

సీమాంధ్ర మైకులకు పక్షవాతమెందుకో ?


''జనవరి 1 నుండి నా రాజీనామ అమలులో ఉంటుంది. నాకు అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో గానీ, ఎంపీ పదవితో గానీ ఎలాంటి సంబంధం లేదు. జనవరి నుండి నా రాజీనామా అమలులో ఉంటుంది"

కాంగ్రెస్ ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు మాట్లాడిన మాటలు ఇవి. కానీ జనవరి 1 వ తేదీ దాటి నాలుగు రోజులు గడిచినా తాను ఇచ్చిన మాటపై కావూరి కనీసం నోరు కూడా తెరవడం లేదు. తెలంగాణ అంటే తొడగొట్టి మాట్లాడే ఈ పెద్ద మనిషికి తాను ఇచ్చిన వాగ్ధానం గురించి తెలియదా ? ఆయన ఎలాగూ స్వార్ధపరుడు వదిలేద్దాం. మరి సీమాంధ్ర ఛానళ్ల మైకులు, సీమాంధ్ర పత్రికల పెన్నులు ఎందుకు మూగబోయాయో అర్ధం కావడం లేదు. వాటికి ఎందుకు పక్షవాతం వచ్చిందో ఎవరికీ అర్ధం కాదు. ఓ ప్రజా ప్రతినిధి ...అందునా ఎంపీ ఓ ఛాలెంజ్ చేశాక..దాని గడువు దాటాక ఇంతవరకు ఈ పత్రికలు ఆ మాటకు ఎందుకు కట్టుబడ లేదని ఎందుకు ప్రశ్నించవు ?

ఇదే తెలంగాణ చెందిన కేసీఆర్ లేక హరీష్ రావు, కేటీఆర్ లేక మరే ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు అయినా ఇలా ఛాలెంజ్ చేసి మాటతప్పితే ఈ సీమాంధ్ర మైకులు ఇలాగే ఊరుకునేవా ? వెంటబడి మరీ వేధించేవి. దానికి సమాధానం చెప్పినా వ్యతిరేక వార్తలు గుప్పించేవి. నిజంగా ఈ సీమాంధ్ర మీడియాకు సిగ్గుంటే తెలంగాణ సమస్య ఇన్నాళ్లు నలుగుతూ వచ్చేదా ? అందుకే మిత్రులారా బివేర్ ఆఫ్ సీమాంధ్ర మీడియా..బివేర్ ఆఫ్ సీమాంధ్ర నేతలు
జై తెలంగాణ ...జై జై తెలంగాణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి