21, మార్చి 2012, బుధవారం

గెలిచిన గుర్రాలివే !


Nagam Janardhan27,325  మెజార్టీ  
నాగం జనార్ధన్ రెడ్డి (నాగర్ కర్నూలు)


JUPALLI Krishna Rao15,043 ఓట్ల మెజార్టీ
జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్)


Gampa Gpvardhan44,465 ఓట్లతో ఘనవిజయం (కామారెడ్డి)
గంప గోవర్ధన్ (టీఆర్ఎస్)

JoguRamanna33 వేల ఓట్లు మెజార్టీ
జోగురామన్న (ఆదిలాబాద్)

1897 మెజార్టీ
ఎన్నం శ్రీనివాస్ రెడ్డి (బీజేపీ)
SRINIVAS

                                           
Rajaiah32,830 మెజార్టీతో గెలుపు
తాటి కొండ రాజయ్య (స్టేషన్ ఘన్ పూర్)

20, మార్చి 2012, మంగళవారం

కారు జోరు..టీడీపీ, కాంగ్రెస్ బేజారు


నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, స్టేషన్ ఘనపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య ఘనవిజయం సాధించారు. కామారెడ్డిలో టీడీపీకి  డిపాజిట్ దక్కలేదు. స్టేషన్ ఘనపూర్ లో టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి రెండో స్థానంలో నిలిచారు.
గంప గోవర్ధన్ అనూహ్యంగా 44 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించగా, రాజయ్య 26 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. కామారెడ్డిలో అభ్యర్థిపై వ్యతిరేకత ఉందని, గెలుపు కష్టమని వార్తలు వచ్చాయి. అయితే ఓటింగ్ సరళిలో ఆ విషయం ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేసినట్లు కనిపిస్తోంది.

పాలమూరులో ముందుకెళ్లిన ’కారు‘

మహబూబ్ నగర్ అసేంబ్లీ నియోజకవర్గంలో రౌండ్ రౌండ్ కు ఫలితాల్లో తేడా వస్తోంది. ఆరు రౌండ్ల వరకు కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం పుంజుకున్నారు.
ఎనిమిదో రౌండ్ పూర్తయ్యే సరికి 479 ఓట్ల అధిక్యంలోకి దూసుకెళ్లారు. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ కు 15,470 ఓట్లు రాగా, బీజేపీకి 14,900 ఓట్లు, కాంగ్రెస్ కు 13,700 ఓట్లు, టీడీపీకి  9900 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఇక్కడ వెనకబడి పోగా బీజేపీ, టీఆర్ఎస్ ల మద్య ప్రధాన పోటీ నెలకొంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం సయ్యద్ ఇబ్రహీం 2317 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. మహబూబ్ నగర్ లో ముస్లింల ప్రాబల్యం అభ్యర్థికి కలిసివచ్చినట్లు గా తెలిసి పోతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయం అనుకోవచ్చు. టీఆర్ఎస్ అభ్యర్థికి 23 వేల 564 ఓట్లు రాగా, బీజేపీకి 21,560 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 16 వేల ఓట్లు, టీడీపీకి 11 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మరో ఏడు రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది.

15, మార్చి 2012, గురువారం

కృష్ణవేణి...తెలంగాణ విరిబోణి

‘కంఠమే తెగుతున్నా కంట నీరు వద్దని ఓరుగల్లు కోటకే పోరు పాఠం నేర్పినట్టి..కత్తులకు పదును బెట్టి కదనరంగమున దూకిన సమక్క సారలమ్మ రణభూమికి వందనం’

                 సీమాంధ్ర నేతల గుండెలదిరేటట్లు..సమైక్య వాదుల చెంప పగిలేటట్టు..ఇంటి దొంగ వీపు వాచేటట్లు తెలంగాణ ముద్దు బిడ్డ, పాలమూరు ఆడబిడ్డ కృష్ణవేణి ఇచ్చిన షాక్ ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డలకు గొప్ప ఊపిరినిచ్చింది. రెండు కళ్ల చంద్రబాబు పార్టీ తరపున నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మర్రి జనార్ధన్ రెడ్డికి కృష్ణవేణి ఇచ్చిన షాక్, చెప్పిన మాటలు ఆయన తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీకుండా చేసింది.

సీమాంధ్ర డబ్బు సంచులను ఎర వేసి తెలంగాణ ఓట్లు కొల్లగొట్టాలను కున్న మర్రికి తిక్క తిరిగేలా మొహం మీదే సమాధానం చెప్పింది కృష్ణవేణి. నాగర్ కర్నూలు తాలూకా తెలకపల్లికి చెందిన కృష్ణవేణి టీఆర్ఎస్ కార్యకర్త సూర్య వెంకటేష్ గౌడ్ కుమార్తె. గత 11 తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తగా పనిచేస్తున్న వెంకటేష్ నిఖార్సయిన తెలంగాణ వాది. ప్లంబర్ పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ ఉప ఎన్నికలో తన సహచరులంతా మర్రి డబ్బులకు లొంగినా  తాను మాత్రం తెలంగాణ జెండా విడవలేదు.


                        దీంతో బిడ్డ పెళ్లిని సాకుగా చూపి తెలుగుదేశం పార్టీలోకి రావాలని, డబ్బులిస్తానని మర్రి జనార్ధన్ రెడ్డి ఏకంగా ఇంటికే ఫోన్ చేశాడు. ’’ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా‘‘ వెంకటేష్ కుమార్తె కృష్ణవేణి నీ డబ్బు వద్దు..నీ సోపతి వద్దు. అవసరమయితే పొలం అమ్మి పెళ్లి చేసుకుంటా..లేకపోతే ఇలాగే ఉంటా...నాయినా నీవు పార్టీ మారొద్దని తేల్చి చెప్పింది. దీంతో సీమాంధ్రుల సంక చేరిన మర్రికి తిక్క కుదిరింది. చావులకు, పెళ్లిళ్లకు డబ్బులని, వాటర్ ప్లాంట్లు అని ఓ ట్రస్టు పేరుతో రాజకీయాలకు దిగిన మర్రికి బుర్ర తిరిగేలా చెప్పిన సమాధానం మామూలుది కాదు. అది తెలంగాణ గుండె చప్పుడు. అందుకే కృష్ణవేణిని అభినందిద్దాం...ఆయన తండ్రికి అండగా నిలుద్దాం. కాల్ 9948698519

12, మార్చి 2012, సోమవారం

సీమాంధ్ర డబ్బొద్దన్న తెలంగాణ పులిబిడ్డ

ఈ అమ్మాయిది మా ఊరే, వీళ్ల నాన్న మా మిత్రుడు. 11 ఏళ్లుగా టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ, తన పని తప్ప మరో లోకం తెలియదు. అభినందించ దలుచుకున్న వారు krushnaveni తండ్రి వెంకటయ్య గౌడ్ కు కాల్ చేయండి. 9948698519

11, మార్చి 2012, ఆదివారం

చంద్రబాబు శకుని..కిరణ్ శని


‘దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి పోటీ చేయాలి’ అన్న టీడీపీ చంద్రబాబు నాయుడు సవాల్ ను టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్వీకరించారు. రాజీనామా చేసి పోటీ చేసేందుకు సిద్దమని, దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయించి తనతో పోటీకి రావాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ఏ నియోజకవర్గం నుండి అయినా పోటీ చేసి చంద్రబాబు డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు.  తెలంగాణ ఇచ్చేది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని , తెలంగాణ రాకపోవడానికి నాకు ఏం సంబంధం అంటున్న చంద్ర బాబు, డిసెంబర్ 9 నాడు రాత్రి వచ్చిన తెలంగాణ ప్రకటనను అడ్డుకున్నది నీవు కాదా ? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్ నుండే దొంగ రాజీనామాలు చేసేలా సీమాంధ్ర ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారని విమర్శించారు. తెలంగాణకు చంద్రబాబునాయుడు శకుని అయితే, ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి శని  అని అన్నారు.

8, ఫిబ్రవరి 2012, బుధవారం

పోటెత్తిన మేడారం


ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర  మేడారం ‘సమ్మక్క – సారలమ్మ’ జాతరకు భక్త జనం పోటెత్తింది.
 ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుండటంతో  మేడారం జనారణ్యంగా మారింది. అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్దికెక్కిన మేడారం జాతర భక్తి తన్మయత్వంలో ముంచెత్తుతోంది.  ఎటు చూసినా యిసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసి పోయింది.
సమక్క.. సారలమ్మలను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటికే అమ్మవారి సన్నిధికి చేరుకున్న భక్తులు దేవతల గద్దెలను దర్శించుకున్నారు. ఈ ఏడు జాతరకు కోటి మంది భక్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారంలో హిజ్రాలు హల్ చల్ చేస్తున్నారు. నృత్యాలు చేస్తూ సమ్మక్కను ఎత్తుకుని మేళ తాళాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. జాతర భద్రతకు వేల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మావోయిస్టు యాక్షన్ టీములు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు.  జాతరకు వచ్చే వీవీఐపీలను మావోయిస్టులు టార్గెట్ గా చేసుకుని, హింసాత్మక సంఘటలనకు పాల్పడే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. అమ్మవార్ల గద్దెల చుట్టూ 1200మందికి పైగా సాయుధ పోలీసులు పహరా కాస్తున్నారు. 40సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని 6భారీఎల్ ఈడీ స్క్రీన్ల ద్వారా పరిశీలిస్తారు.
ఎడ్లబండ్లపై మోజు…
పట్టణ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఎండ్ల బండ్లపై జంపన్న వాగుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇక్కడి స్థానికులకు ఇదో కొత్త ఉపాధిగా మారింది. బస్టాండు నుండి జంపన్న వాగు దూరంగా ఉండడం, దీంతో పాటు ఎడ్లబండి ప్రయాణం కొత్త అనుభూతికి గురిచేయడంతో అత్యధికులు దీనిపై మోజుపడుతున్నారు. దీనికి గాను బండికి రూ.50 వసూలు చేస్తున్నారు. బుధవారం రాత్రి సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గిరిజన పూజారులు గద్దెలపై ప్రతిష్టించారు. ఈ ప్రతిష్టాపనని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండేళ్లకోకసారి జరిగే ఈ జాతరను దాదాపు కోటిన్నర మంది దర్శించుకుంటారు.

4, ఫిబ్రవరి 2012, శనివారం

యువరాజ్ సింగ్ కు క్యాన్సర్


భారత క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. భారత జట్టు డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్సింగ్ అభిమానులకు ఇది మరింత ఆందోళన కలిగించే వార్త. యువరాజ్ సింగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని సమాచారం. ఈ మేరకు ఆయన అమెరికాలో కీమోథెరపీ చికిత్స పొందుతున్నారు. భారత్ కు మరోసారి ప్రపంచకప్ వచ్చేందుకు కారణమయిన యువరాజ్ సింగ్ ఆ తరువాత క్యాన్సర్ ఉందని తెలిసినట్లు సమాచారం.
మార్చి వరకు ఆయనకు కీమోథెరపి చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ మొదటి దశలోనే ఉందని, ఆయనకు ఎలాంటి ప్రమాదంలేదని యువీ వ్యక్తిగత వైద్యుడు చెబుతున్నాడు. కీమోథెరపీ చికిత్స మూడుదశల్లో జరుగుతుందని వైద్యుడు జతిన్ చౌదరి చెబుతున్నారు. తన ఆటతీరుతో, అందచందాలతో బాలీవుడ్ భామల మనసులు దోచుకున్న యువరాజ్ క్రికెట్ లో తన సత్తా చాటుకున్నాడు. ఆయనకు క్యాన్సర్ ఉందన్న వార్తలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
గత అక్టోబర్ లోనే గుండెకు, ఊపిరితిత్తుల మధ్య వైద్యులు కణితిని గుర్తించారు. అయితే అది అంత ప్రమాదకరం కాదని మొదట అనుకున్నారు. క్రమేణా అది ఇబ్బందిగా మారడంతో చికిత్సను ప్రారంభించారు.