22, జులై 2014, మంగళవారం

టీఆర్ఎస్ ఎంపీ కవిత ఏం చెప్పింది ?


పనికిమాలిన పచ్చపత్రిక (పత్రిక అనడానికి సిగ్గేస్తోంది) 'సీమాంధ్రజ్యోతి' పిచ్చిరాతలు పట్టుకుని మోడీ భజనపరులు తెగ రెచ్చిపోతున్నారు. తమను తాము ఈ దేశాన్ని ఉద్దరించేవారిగా ఫీలవుతున్న కుహానా మేధావులు తెగ ఫీలయిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ సీమాంధ్రజ్యోతి చేసిన నిర్వాకం ..తెలంగాణ ఉద్యమకారుల మనోస్థైర్యం దెబ్బతినేలా రాసిన కథనాలు ..దీని నిర్వాకం మూలంగా ఎంతమంది ఉద్యమకారులు నేలకొరిగారో అందరికీ తెలిసిందే. ఇలాంటి పనికిమాలిన మీడియా రాసిన రాతలు అక్షర సత్యాలయినట్లు తెగ తొందరపడిపోతున్నారు.

ఓ పత్రిక నిర్వహించిన చర్చలో పాల్గొన్నఎంపీ కవిత "1947 స్వాతంత్రానికి తెలంగాణ, జమ్మూకాశ్మీర్ లు ప్రత్యేక దేశాలని, ఆ తరువాత సైనిక చర్య ద్వారా ఈ ప్రాంతాలను ఈ దేశంలో కలిపారని" తెలిపింది. దీనికి మసిపూసి మారేడుకాయ చేసి ..స్వంతకవిత్వం జోడించి వండి వార్చి ఏదో కలకలం రేపుతాం అన్నంత రీతిలో సీమాంధ్రజ్యోతి లేఖిరాతలతో కథనం ప్రచురించింది. అది పట్టుకుని కుహానా దేశభక్తులు తెగ ఊగిపోతున్నారు.

1947 ఆగస్టు 15న తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. ఆ తరువాత సైనిక చర్య ద్వారా తెలంగాణకు విముక్తి లభించింది అన్నది తెలంగాణ ఉద్యమంలో వందలసార్లు చెప్పుకున్నదే. తెలంగాణ వాదులు అందరికీ తెలిసిందే. సెప్టెంబరు 17 విమోచన దినం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చర్చలో వెల్లడిస్తే ఏదో జరిగిపోయిందని తెగ బాధపడిపోతున్నారు.

వీరి రాతలు ..పూతల్లో ఎంపీ కవిత మాట్లాడిన అంశాల మీద చర్చ చేయాలన్న తపనకంటే ..తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ అధినేత కూతురిని దోషిగా నిలబెట్టడానికి అవకాశం దొరికింది అన్న ఆనందమే ఎక్కువ కనబడుతోంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి కుహానా దేశభక్తులారా ..తెలంగాణ వాదులను మించిన దేశభక్తుడు ఎవ్వడూ లేడు. అందుకే 60 ఏళ్లు ప్రజాస్వామ్యబద్దంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. మేం ఎన్నుకున్న మా నాయకులే మమ్మల్ని వెన్నుపోటు పొడిచినా బరించి పోరాడాం. వగల ఏడ్పులు మాని బురద జల్లడం మానుకోండి.

sandeepreddy kothapally

www.facebook.com/thovva 

7 కామెంట్‌లు:

  1. ఈ వీరావేశాలు తిట్లదండకాలూ ఎందుకు?
    కవితమ్మగారు ఏమన్నదీ వారి హావభావ వాగ్విలాసాల్ని ప్రదర్శించే వీడియో ద్వారానే ప్రకటీంచితే సరిపోతుంది కదండీ? అలా చేస్తే వివాదం సమసిపోతుందిగా?

    దయచేసి ఆ వీడియోను ఇవ్వండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవాకులు చవాకులు పేలుతున్న పచ్చ మీడియా, కాషాయ పార్టీ అలాంటి అభ్యంతర కర వ్యాఖ్యలు చేసిన వీడియో ఏమైనా వుంటే చూపి తరించొచ్చుగా, వైయక్తిక దాడులకు పాల్పడేముందు?

      1947కు పూర్వం కాశ్మీర్, హైదరాబాద్ రాష్ట్రాలు ఈ దేశంలో భాగం కావు. అలాగే సైనిక చర్య ద్వారా దేశంలో కలిపారు అంటే ఎవరికైనా ఎందుకు ఉలుకు? పైగా ఈ పసుపు, కాషాయ భక్తులు పాకిస్తాన్ పత్రికలో వచ్చిన వార్తను పట్టుకొని దాడులకు దిగడం విచిత్రంగా లేదూ?

      ఇలాగే పెట్రేగి పోతే సానియా మీర్జాపై దాడి విషయంలో జరిగిన శృంగభంగమే వీరికి ఇప్పుడూ జరుగక తప్పదు.

      తొలగించండి
  2. పక్కదేశం వారే మంట్టున్నారో చదవండి.
    Kashmir,Telangana not India's parts: Indian MP

    Kavitha, who represents Telangana Rashtra Samithi (TRS) party in the parliament, during a newspaper said that Telangana and Kashmir were both separate territories but were forcefully merged into India after independence. "We need to come out clean on Jammu Kashmir. Few parts were not ours, we should agree, we should redraw the international lines, and move on," she added.

    http://www.dailytimes.com.pk/foreign/22-Jul-2014/kashmir-telangana-not-india-s-parts-indian-mp

    రిప్లయితొలగించండి
  3. ఇంకా ఈ తెలంగాణ ఎంపి ని సమర్ధించడం దేశద్రోహం అవుతుంది

    రిప్లయితొలగించండి
  4. May be that TRS wants telangana state to evolve as separate country?

    రిప్లయితొలగించండి
  5. http://www.greatandhra.com/politics/gossip/we-are-not-indians-by-choice-kavitha-58333.html

    రిప్లయితొలగించండి