19, జులై 2011, మంగళవారం

seemandhra media siggupadu

తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న ఈ సమయంలో సైతం రాజధాని హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యార్థులలో క్రేజ్ తగ్గడం లేదు. మంగళవారం మెడిసిన్ కౌన్సిలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఉస్మానియా, ఎస్వీ, ఆంధ్రా తదితర అనుబంధ నాలుగు మెడికల్ కళాశాలలో జరుగుతున్నాయి. అయితే విద్యార్థులు చాలామంది ఉస్మానియా మెడికల్ కళాశాలలో చేరేందుకే ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిన ఈ సమయంలో తెలంగాణలోని చాలా మంది విద్యార్థులు విజయవాడ, గుంటూరు, చెన్నై తదితర కళాశాలలో చదవడానికి మక్కువ చూపుతున్నారన్న నేపథ్యంలో మెడికల్ కౌన్సెలింగ్ పైనా ఆ ప్రభావం ఉంటుందని పలువురు భావించారు.

అయితే మెడికల్‌లో టాప్ 20లోని పదహారు మంది విద్యార్థులు ఉస్మానియా మెడికల్ కళాశాలలోనే జాయిన్ అయ్యారు. విజయవాడకు చెందిన మెడికల్ టాప్ ర్యాంకర్ హిమజ సైతం ఉస్మానియాలో జాయిన్ అయింది. ఉస్మానియాలో ఫ్యాకల్టీ బావుంటుందన్న అభిప్రాయంతోనే వారు ఉస్మానియాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ బాగా అభివృద్ధి చెంది హాస్పిటల్స్ బాగా డెవలప్ అయిన నేపథ్యంలో ఉస్మానియాలో చదువుతేనే బావుంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. కాగా ఉస్మానియా తర్వాత ఆంధ్రా మెడికల్ విశ్వవిద్యాలయానికి విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తున్నారు.